అక్కినేని నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ కథానాయకుడు నాగచైతన్య. చైతూ సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టి శనివారంతో 11 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా అతడి సతీమణి, నటి సమంత అభినందనలు తెలిపింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా చైతన్య ఆర్ట్ ఫొటోను పంచుకుంటూ "నీ నుంచి వచ్చే సినిమాల కోసం ఉత్సాహంతో ఎదురు చుస్తున్నా. నీ కెరీర్ మరింత ఉన్నత శిఖరాలకు చేరుతుందని ఆశిస్తున్నా. మై హీరో" అంటూ రాసుకొచ్చింది.
-
#11yearsforJosh 11 years in the industry @chay_akkineni 🔥.. so excited for what’s coming 🥰.. shine brighter and brighter my hero 🤗 pic.twitter.com/YmZYWv0BWW
— Samantha Akkineni (@Samanthaprabhu2) September 5, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">#11yearsforJosh 11 years in the industry @chay_akkineni 🔥.. so excited for what’s coming 🥰.. shine brighter and brighter my hero 🤗 pic.twitter.com/YmZYWv0BWW
— Samantha Akkineni (@Samanthaprabhu2) September 5, 2020#11yearsforJosh 11 years in the industry @chay_akkineni 🔥.. so excited for what’s coming 🥰.. shine brighter and brighter my hero 🤗 pic.twitter.com/YmZYWv0BWW
— Samantha Akkineni (@Samanthaprabhu2) September 5, 2020
2009లో విడుదలైన 'జోష్' చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు నాగచైతన్య. ఆ తర్వాత సమంతతో కలిసి చై నటించిన 'ఏమాయ చేశావె' బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. వెండితెరపై ప్రేమికులుగా అలరించిన చై-సామ్లు నిజ జీవితంలో ఒక్కటయ్యారు. చైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'లవ్ స్టోరీ'లో నటిస్తున్నాడు. సాయి పల్లవి కథానాయిక. ఇటీవల నాగార్జున పుట్టినరోజు సందర్భంగా 'థ్యాంక్ యూ' అనే మరొక చిత్రాన్ని ప్రకటించారు. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.