ETV Bharat / sitara

'మీడియా నిందలు వేస్తోంది'.. సుప్రీంలో రియా పిటిషన్

author img

By

Published : Aug 10, 2020, 5:30 PM IST

Updated : Aug 10, 2020, 6:06 PM IST

సుశాంత్ రాజ్​పుత్ ఆత్మహత్య​ కేసులో భాగంగా రియా చక్రవర్తి అత్యున్నత న్యాయస్థానంలో మరో పిటిషన్​ దాఖలు చేసింది. తనపై మీడియా అసత్య ప్రచారం చేస్తోందని ఆరోపించింది.

Rhea Chakraborty
సుశాంత్​

బాలీవుడ్​ హీరో సుశాంత్ సింగ్ రాజ్​పుత్​ ప్రియురాలు రియా చక్రవర్తి సోమవారం సుప్రీం కోర్టులో మరో పిటిషన్​ దాఖలు చేసింది. మీడియా తనపై అన్యాయంగా నిందలు మోపుతోందని.. సుశాంత్​ మృతి విషయంలో తనను దోషిగా చూపిస్తున్నారని ఆరోపించింది.

రియా తాజా అభ్యర్థనలోని ముఖ్యాంశాలు ఇవే..

  • దేశవ్యాప్తంగా ఈ కేసు సంచలనాత్మకంగా మారిన కారణంగా పిటిషనర్​ హక్కులకు భంగం వాటిల్లడంతో పాటు, గోప్యత ఉల్లంఘన జరిగే అవకాశం ఉంది.
  • నటులు అశుతోష్​ భక్రే, సమీర్ శర్మ కూడా గడిచిన 30 రోజుల్లో ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ఆ విషయంపై ఎవరూ స్పందించడం లేదు.
  • సుశాంత్​ కేసు చర్చనీయాంశం కాకముందే.. పిటిషనర్​పై మీడియా నిందలు మోపింది.
  • ముంబయి మెజిస్ట్రేట్​కు బదులుగా పట్నాకు కేసును బదిలీ చేయడంలో బిహార్​ ప్రభుత్వం చట్టవిరుద్ధంగా వ్యవహరించింది. రాష్ట్రం, కేంద్రంలో ఒకే అధికార పార్టీ ఉండటమే ఇందుకు కారణం.
  • సీబీఐకి కేసును అప్పగించడానికి కొన్ని పద్దతులున్నాయి.
  • ఈడీ సరైన న్యాయం కోసం తగిన రీతిలో విచారణ చేపడుతోంది.

రెండో రోజూ రియా తన కుటుంబ సభ్యులతో కలిసి విచారణ నిమిత్తం ఈడీ కార్యాలయానికి వచ్చింది. అంతకుముందు శుక్రవారం సుమారు 8 గంటల పాటు మనీల్యాండరింగ్​ కేసులో రియాను అధికారులు ప్రశ్నించారు. ఆమె సోదరుడు షోయిక్​నూ శనివారం 18 గంటలు విచారించారు.

బాలీవుడ్​ హీరో సుశాంత్ సింగ్ రాజ్​పుత్​ ప్రియురాలు రియా చక్రవర్తి సోమవారం సుప్రీం కోర్టులో మరో పిటిషన్​ దాఖలు చేసింది. మీడియా తనపై అన్యాయంగా నిందలు మోపుతోందని.. సుశాంత్​ మృతి విషయంలో తనను దోషిగా చూపిస్తున్నారని ఆరోపించింది.

రియా తాజా అభ్యర్థనలోని ముఖ్యాంశాలు ఇవే..

  • దేశవ్యాప్తంగా ఈ కేసు సంచలనాత్మకంగా మారిన కారణంగా పిటిషనర్​ హక్కులకు భంగం వాటిల్లడంతో పాటు, గోప్యత ఉల్లంఘన జరిగే అవకాశం ఉంది.
  • నటులు అశుతోష్​ భక్రే, సమీర్ శర్మ కూడా గడిచిన 30 రోజుల్లో ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ఆ విషయంపై ఎవరూ స్పందించడం లేదు.
  • సుశాంత్​ కేసు చర్చనీయాంశం కాకముందే.. పిటిషనర్​పై మీడియా నిందలు మోపింది.
  • ముంబయి మెజిస్ట్రేట్​కు బదులుగా పట్నాకు కేసును బదిలీ చేయడంలో బిహార్​ ప్రభుత్వం చట్టవిరుద్ధంగా వ్యవహరించింది. రాష్ట్రం, కేంద్రంలో ఒకే అధికార పార్టీ ఉండటమే ఇందుకు కారణం.
  • సీబీఐకి కేసును అప్పగించడానికి కొన్ని పద్దతులున్నాయి.
  • ఈడీ సరైన న్యాయం కోసం తగిన రీతిలో విచారణ చేపడుతోంది.

రెండో రోజూ రియా తన కుటుంబ సభ్యులతో కలిసి విచారణ నిమిత్తం ఈడీ కార్యాలయానికి వచ్చింది. అంతకుముందు శుక్రవారం సుమారు 8 గంటల పాటు మనీల్యాండరింగ్​ కేసులో రియాను అధికారులు ప్రశ్నించారు. ఆమె సోదరుడు షోయిక్​నూ శనివారం 18 గంటలు విచారించారు.

Last Updated : Aug 10, 2020, 6:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.