గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా.. తన కొత్త బాలీవుడ్ సినిమా 'స్కై ఈజ్ పింక్' ప్రచారంలో బిజీగా ఉంది. అందులో భాగంగా నోయిడా సెక్టార్ 125లోని ఆమిటి యూనివర్సిటీలో సందడి చేసింది. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమానికి చిత్ర దర్శకురాలు సోనాలి బోస్, సహనటుడు రోహిత్ శరఫ్తో కలిసి హాజరైంది. పాట పాడుతూ, నృత్యం చేస్తూ విద్యార్థులను ఉత్సాహపరిచింది. చాలా కాలం తర్వాత దిల్లీ వచ్చానని, ఇక్కడి వారిని కలుసుకోవడం తనకెంతో ఆనందంగా ఉందని చెప్పింది.
బాలీవుడ్లో దాదాపు మూడేళ్ల తర్వాత ప్రియాంక కనిపిస్తుండటం విశేషం. ఈ సినిమాలో ఫర్హాన్ అక్తర్, జైరా వాసీం ఇతర పాత్రలు పోషించారు. ఇటీవలే విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఈనెల 11న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
![priyanka chopra selfie with students](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4621064_priyanka-selfie.jpg)
ఇది చదవండి: సినిమా చూసి నిక్ ఏడ్చేశాడు: హీరోయిన్ ప్రియాంక చోప్రా