కరోనా వైరస్ భారత్లో విస్తరించకుండా ఉండాలంటే ప్రతి వ్యక్తి లక్ష్మణరేఖ దాటొద్దన్న ప్రధాని నరేంద్రమోదీ విజ్ఞప్తి మేరకు ప్రముఖ ర్యాపర్ ప్రణవ్ చాగంటి తనదైన శైలిలో ప్రత్యేక పాటను రూపొందించాడు. 'లక్ష్మణ రేఖ' పేరుతో సాగే ఆ పాటలో ప్రతి అక్షరం అ అనే స్వరంతో పూర్తవుతుంది.
తలకట్ల కవిత్వంగా వర్ణించే ఇలాంటి అసాధారణ ప్రక్రియలు తెలుగులో వందల ఏళ్ల క్రితం నుంచే ఉన్నాయని చెబుతున్నాడు ప్రణవ్. కరోనా వైరస్ నేపథ్యంలో తనవంతు సామాజిక బాధ్యతగా ఆ ప్రయోగానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపాడు. ప్రణవ్ రూపొందించిన ఆ పాట సామాజిక మాద్యమాల్లో యువతను విశేషంగా ఆకట్టుకుంటూ అవగాహన కల్పిస్తోంది.