ETV Bharat / sitara

F3 Movie: ప్రత్యేక గీతంలో ప్రగ్యా జైశ్వాల్​!

author img

By

Published : Jun 21, 2021, 10:42 PM IST

విక్టరీ వెంకటేశ్​(Venkatesh), మెగా ప్రిన్స్​ వరుణ్​ తేజ్​(Varun Tej) కలిసి నటిస్తున్న చిత్రం 'ఎఫ్​3'(F3 Movie). అనిల్​ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఓ ప్రత్యేక సాంగ్​ కోసం ప్రగ్యా జైశ్వాల్​(Pragya Jaiswal)ను సంప్రదించినట్లు సమాచారం. అందుకు ఆమె కూడా అంగీకరించిందని టాలీవుడ్​లో ప్రచారం జరుగుతోంది.

Pragya Jaiswal for a special song in F3 Movie
F3 Movie: ప్రత్యేక గీతంలో ప్రగ్యా జైశ్వాల్​!

తెలుగు సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో 'ఎఫ్‌3'(F3 movie) ఒకటి. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్‌(Venkatesh), వరుణ్‌తేజ్‌(Varun Tej) కీలకపాత్రల్లో నటిస్తున్నారు. తమన్నా(Tammanah), మెహరీన్‌(Mehreen) కథానాయికలు. గతంలో వచ్చిన 'ఎఫ్‌2'కు కొనసాగింపుగా ఈ సినిమా రాబోతోంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా షూటింగ్‌ కరోనా కారణంగా ఆగిపోయింది. త్వరలోనే చిత్రీకరణకు సిద్ధమవుతోంది.

ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర వార్త తెలుగు చిత్రపరిశ్రమలో చక్కర్లు కొడుతోంది. ఇందులో ప్రత్యేక గీతం కోసం కథానాయిక ప్రగ్యా జైశ్వాల్‌(Pragya Jaiswal)ను చిత్రబృందం సంప్రదించిందట. మాస్‌, యూత్‌తో పాటు అన్ని వర్గాలను ఈ పాట ఆకట్టుకునేలా ఈ గీతం ఉంటుందని సమాచారం. ఆమెకు కూడా అందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై చిత్రబృందం స్పందించాల్సి ఉంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

తెలుగు సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో 'ఎఫ్‌3'(F3 movie) ఒకటి. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్‌(Venkatesh), వరుణ్‌తేజ్‌(Varun Tej) కీలకపాత్రల్లో నటిస్తున్నారు. తమన్నా(Tammanah), మెహరీన్‌(Mehreen) కథానాయికలు. గతంలో వచ్చిన 'ఎఫ్‌2'కు కొనసాగింపుగా ఈ సినిమా రాబోతోంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా షూటింగ్‌ కరోనా కారణంగా ఆగిపోయింది. త్వరలోనే చిత్రీకరణకు సిద్ధమవుతోంది.

ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర వార్త తెలుగు చిత్రపరిశ్రమలో చక్కర్లు కొడుతోంది. ఇందులో ప్రత్యేక గీతం కోసం కథానాయిక ప్రగ్యా జైశ్వాల్‌(Pragya Jaiswal)ను చిత్రబృందం సంప్రదించిందట. మాస్‌, యూత్‌తో పాటు అన్ని వర్గాలను ఈ పాట ఆకట్టుకునేలా ఈ గీతం ఉంటుందని సమాచారం. ఆమెకు కూడా అందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై చిత్రబృందం స్పందించాల్సి ఉంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

ఇదీ చూడండి.. రామ్​చరణ్​ @4 మిలియన్స్​.. 'ఇన్​సైడ్​ ఎడ్జ్​ 3' రిలీజ్​ అప్​డేట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.