ETV Bharat / sitara

సుశాంత్ మృతిపై వివాదాలు వద్దు: సోనూసూద్

author img

By

Published : Aug 28, 2020, 9:02 PM IST

Updated : Aug 28, 2020, 9:47 PM IST

సుశాంత్​ మరణం తర్వాత కొందరు సెలబ్రిటీలు మీడియాను ఆకర్షించేందుకు వివాదాలు సృష్టిస్తున్నారని సోనూసూద్ అభిప్రాయం వ్యక్తం చేశారు​. ప్రముఖుల హోదాలో ఉన్న వాళ్లు హుందాగా ప్రవర్తించాలని కోరారు.

People went overboard to get media attention in SSR's case: Sonu Sood
సుశాంత్ మృతిపై వివాదాలు సృష్టించవద్దు: సోనూసూద్

సుశాంత్​ సింగ్​​ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్​లోని బంధుప్రీతి, మాఫియా లాంటి అంశాలు మరోసారి తెరపైకొచ్చాయి. వీటిపై కొంతమంది సినీప్రముఖులు వారివారి అభిప్రాయాల్ని వెల్లడించారు. బాలీవుడ్​ విలక్షణ నటుడు సోనూసూద్ కూడా దీని గురించి మాట్లాడారు.​ ఇండస్ట్రీలోని కొందరు కావాలనే వివాదాలు సృష్టిస్తున్నారని, సెలబ్రిటీ హోదాలో ఉన్న వాళ్లు ఇలా చేయడం సరికాదని అన్నారు.

"నటుడిగా మీరు చెప్పే ప్రతిమాట ప్రజలపై ప్రభావం చూపుతుంది. ఎందుకంటే వాళ్లు మీ మాటలను నమ్ముతున్నారు. సెలబ్రిటీలుగా మనం చెప్పిన విషయాన్ని మర్చిపోయినా.. వాళ్లు మాత్రం గుర్తుంచుకుంటారు. ఎందరికో మనం ప్రేరణగా నిలిచాం. ప్రజలంతా మనల్ని అనుసరిస్తున్నారు. అదే మన భుజాలపై ఉన్న పెద్ద బాధ్యత. ఇలాంటి సమయంలో మీరు చాలా తెలివిగా ఉండాలి. హిందీలో ఓ సామెత కూడా ఉంది దాని గురించి నేను ఇప్పుడు మాట్లాడకూడదు. కేవలం మీడియా దృష్టిని ఆకర్షించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. సుశాంత్​ మృతిపై స్పందించిన దాని కంటే ఇకపై తెలివిగా ప్రవర్తిస్తారని ఆశిస్తున్నా."

-సోనూసూద్​, బాలీవుడ్​ నటుడు

సుశాంత్​ మరణం తర్వాత బాలీవుడ్​లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కానీ, లాక్​డౌన్​లో చిక్కుకున్న వలస కార్మికులను వారి సొంతూళ్లకు చేర్చే పనిలో బిజీగా ఉన్నారు సోనూ. అలా ఎంతోమందిని కష్టాలు తీర్చి, వారి మనసుల్లో చోటు సంపాదించారు.

సుశాంత్​ సింగ్​​ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్​లోని బంధుప్రీతి, మాఫియా లాంటి అంశాలు మరోసారి తెరపైకొచ్చాయి. వీటిపై కొంతమంది సినీప్రముఖులు వారివారి అభిప్రాయాల్ని వెల్లడించారు. బాలీవుడ్​ విలక్షణ నటుడు సోనూసూద్ కూడా దీని గురించి మాట్లాడారు.​ ఇండస్ట్రీలోని కొందరు కావాలనే వివాదాలు సృష్టిస్తున్నారని, సెలబ్రిటీ హోదాలో ఉన్న వాళ్లు ఇలా చేయడం సరికాదని అన్నారు.

"నటుడిగా మీరు చెప్పే ప్రతిమాట ప్రజలపై ప్రభావం చూపుతుంది. ఎందుకంటే వాళ్లు మీ మాటలను నమ్ముతున్నారు. సెలబ్రిటీలుగా మనం చెప్పిన విషయాన్ని మర్చిపోయినా.. వాళ్లు మాత్రం గుర్తుంచుకుంటారు. ఎందరికో మనం ప్రేరణగా నిలిచాం. ప్రజలంతా మనల్ని అనుసరిస్తున్నారు. అదే మన భుజాలపై ఉన్న పెద్ద బాధ్యత. ఇలాంటి సమయంలో మీరు చాలా తెలివిగా ఉండాలి. హిందీలో ఓ సామెత కూడా ఉంది దాని గురించి నేను ఇప్పుడు మాట్లాడకూడదు. కేవలం మీడియా దృష్టిని ఆకర్షించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. సుశాంత్​ మృతిపై స్పందించిన దాని కంటే ఇకపై తెలివిగా ప్రవర్తిస్తారని ఆశిస్తున్నా."

-సోనూసూద్​, బాలీవుడ్​ నటుడు

సుశాంత్​ మరణం తర్వాత బాలీవుడ్​లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కానీ, లాక్​డౌన్​లో చిక్కుకున్న వలస కార్మికులను వారి సొంతూళ్లకు చేర్చే పనిలో బిజీగా ఉన్నారు సోనూ. అలా ఎంతోమందిని కష్టాలు తీర్చి, వారి మనసుల్లో చోటు సంపాదించారు.

Last Updated : Aug 28, 2020, 9:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.