'బురదలోకి దిగిపోయినాం. కాళ్లు కడుక్కోవడానికి నీళ్లు సరిపోవు, ఎవుడు ఎప్పుడు ఎల్లిపోయి వచ్చి మా పీక తీసుకెళ్లిపోతాడా? అని భయంగా ఉంటాదే' అని అంటున్నాడు యువహీరో రక్షిత్. ఇతడు నటించిన చిత్రం 'పలాస 1978'. యథార్థ సంఘటనల ఆధారంగా తీశారు. నటుడు రానా.. నేడు(ఆదివారం) విడుదల ట్రైలర్ను చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు చెప్పాడు.
ఇందులో నక్షత్ర హీరోయిన్. రఘు కుంచె సంగీతమందించడం సహా ప్రతినాయకుడిగానూ నటించాడు. కరుణ కుమార్ దర్శకుడు. దయన్ అట్లూరి నిర్మించారు. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పకులు. ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.
- " class="align-text-top noRightClick twitterSection" data="">