ప్రముఖ హాలీవుడ్ నటుడు క్రిస్ హేమ్స్వర్త్, బాలీవుడ్ నటులు రణ్దీప్ హుడా, పంకజ్ త్రిపాఠి కలిసి నటించిన చిత్రం 'ఎక్స్ట్రాక్షన్'. సామ్ హార్గ్రేవ్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఏప్రిల్ 24, 2020న నెట్ఫ్లిక్స్లో విడుదలైంది. అయితే తాజాగా ఈ సినిమా ట్రైలర్ను అనుసరించి మక్కీకిమక్కీగా నైజీరియా దేశానికి చెందిన కుర్రాళ్లు హేమ్స్వర్త్, మిగతా నటీనటులుగా అలాంటి సీన్లనే తమదైన రీతిలో చిత్రీకరించారు. ఈ వీడియోను చూసిన క్రిస్ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ట్రైలర్ షాట్ను అప్లోడ్ చేసి షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది.
ఈ సందర్బంగా హేమ్స్వర్త్ స్పందిస్తూ.. "మా నిజమైన ట్రైలర్ వెర్షన్ కన్నా మీరు తీసిన ట్రైలర్ వెర్షన్ బాగుందని అనుకుంటున్నా.." అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">