ETV Bharat / sitara

బన్నీ కోసం ముంబయి నుంచి వస్తున్నారు!

స్టైలిష్​స్టార్ అల్లు అర్జున్.. తన కొత్త సినిమాలో వినూత్న కేశాలంకరణతో కనిపించనున్నాడు. ఇందుకోసం ముంబయి నుంచి ప్రత్యేక హెయిర్​ స్టైలిష్ట్​ను పిలిపించారు.

author img

By

Published : Feb 21, 2020, 5:04 PM IST

Updated : Mar 2, 2020, 2:19 AM IST

alluarjun
బన్నీ కోసం ముంబయి నుంచి ప్రత్యేకంగా

సినిమా సినిమాకూ సరికొత్త లుక్స్​తో కనిపించి, అభిమానుల్ని సర్‌ప్రైజ్‌ చేస్తుంటాడు హీరో అల్లు అర్జున్‌. ఈ ప్రత్యేక లక్షణమే అతడిని తెలుగు ప్రేక్షకుల మదిలో స్టైలిష్‌ స్టార్‌గా నిలబెట్టింది. ప్రస్తుతం బన్నీ సుకుమార్‌ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఇందులో సరికొత్త లుక్‌లో కనిపించేందుకు సిద్ధమవుతున్నాడు. సరికొత్త హెయిర్​ స్టైల్​తో కనిపించనున్నాడు.

ఇందుకోసం ముంబయి నుంచి ప్రత్యేకంగా కేశాలంకరణ నిపుణులను పిలిపించనున్నారు. వారు ఇప్పటికే బన్నీ కోసం వివిధ హెయిర్‌ స్టైల్స్‌ సిద్ధం చేశారని, త్వరలో ఒకదానిని ఫైనల్​ చేయనున్నారని తెలుస్తోంది.

ఈ సినిమా కథ ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంతో సాగనుంది. దానితో పాటే పవర్‌ఫుల్‌ యాక్షన్‌ సన్నివేశాలు ఉండనున్నాయి.

bunny'అల వైకుంఠపురములో' సినిమాలో అల్లు అర్జున్

ఈ చిత్రం కోసం బన్నీ తొలిసారిగా చిత్తూరు యాసలో సంభాషణలు చెప్పబోతున్నాడు. ఇప్పటికే ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంటున్నాడట. ఇందులో రష్మిక హీరోయిన్. దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతగా వ్యవహరిస్తోంది.

సినిమా సినిమాకూ సరికొత్త లుక్స్​తో కనిపించి, అభిమానుల్ని సర్‌ప్రైజ్‌ చేస్తుంటాడు హీరో అల్లు అర్జున్‌. ఈ ప్రత్యేక లక్షణమే అతడిని తెలుగు ప్రేక్షకుల మదిలో స్టైలిష్‌ స్టార్‌గా నిలబెట్టింది. ప్రస్తుతం బన్నీ సుకుమార్‌ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఇందులో సరికొత్త లుక్‌లో కనిపించేందుకు సిద్ధమవుతున్నాడు. సరికొత్త హెయిర్​ స్టైల్​తో కనిపించనున్నాడు.

ఇందుకోసం ముంబయి నుంచి ప్రత్యేకంగా కేశాలంకరణ నిపుణులను పిలిపించనున్నారు. వారు ఇప్పటికే బన్నీ కోసం వివిధ హెయిర్‌ స్టైల్స్‌ సిద్ధం చేశారని, త్వరలో ఒకదానిని ఫైనల్​ చేయనున్నారని తెలుస్తోంది.

ఈ సినిమా కథ ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంతో సాగనుంది. దానితో పాటే పవర్‌ఫుల్‌ యాక్షన్‌ సన్నివేశాలు ఉండనున్నాయి.

bunny'అల వైకుంఠపురములో' సినిమాలో అల్లు అర్జున్

ఈ చిత్రం కోసం బన్నీ తొలిసారిగా చిత్తూరు యాసలో సంభాషణలు చెప్పబోతున్నాడు. ఇప్పటికే ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంటున్నాడట. ఇందులో రష్మిక హీరోయిన్. దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతగా వ్యవహరిస్తోంది.

Last Updated : Mar 2, 2020, 2:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.