టాలీవుడ్ అగ్రహీరో జూ.ఎన్టీఆర్.. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో కొత్తవారితో తీస్తోన్న సినిమా ఫస్ట్లుక్ను విడుదల చేశాడు. తన ట్విట్టర్లో 'మత్తు వదలరా' తొలిరూపును పంచుకున్నాడు. ఈ చిత్రంతో సింహాకోడూరి హీరోగా పరిచయమవుతున్నాడు. వార్త పత్రికలపై ఈ నటుడు పడుకొని ఉన్న ఈ ఫొటో ఆసక్తి రేపుతోంది.
ఈ సినిమాతో కీరవాణి కుమారుడు, గాయకుడు కాలభైరవ సంగీత దర్శకుడిగా మారుతున్నాడు. రితేష్ రానా దర్శకత్వం వహిస్తున్నాడు. చిరంజీవి-హేమలత సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.
ఇది చదవండి: కుక్కలతో.. క్యాట్ వాక్ చేసిన ఫ్యాషన్ భామలు