ETV Bharat / sitara

'సుశాంత్​ మృతిపై బాలీవుడ్​ సమాధానం చెప్పాలి!' - సుశాంత్​ మృతిపై నెటిజన్ల ప్రశ్నలకు బాలీవుడ్​ స్పందించాలి

బాలీవుడ్​ నటుడు సుశాంత్​ సింగ్​ మృతిపై నెటిజన్ల నుంచి ఎదురైన ప్రశ్నలకు హిందీ పరిశ్రమ​ సమాధానం చెప్పి తీరాలని అన్నారు ప్రముఖ విలక్షణ నటుడు మనోజ్​ బాజ్​పేయీ. ప్రతి సెలబ్రిటీ అభిమానుల ప్రేమను స్వీకరించినట్లే, వారి విమర్శలనూ తీసుకోవాలని అన్నారు.

sushanth
మనోజ్​, సుశాంత్​
author img

By

Published : Jul 8, 2020, 7:04 PM IST

నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్యకు, బాలీవుడ్​లోని నెపోటిజమ్​ ఓ కారణమని భావించిన నెటిజన్లు, పలువురు సినీ ప్రముఖుల్ని సోషల్ మీడియా వేదికగా విమర్శిస్తున్నారు. వారిపై పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. అయితే తాజాగా వీటన్నింటికీ బాలీవుడ్​ పరిశ్రమ సమాధానమివ్వాలని అన్నారు ప్రముఖ విలక్షణ నటుడు మనోజ్​ బాజ్​పేయీ​. నెటిజన్లు అడిగిన ప్రతి ప్రశ్నకు జవాబివ్వడం ఎంతో ముఖ్యమని తెలిపారు.

చిత్రసీమలో నటులు ప్రజల అభిమానాన్ని ఎలాగైతే చూరగొంటారో.. అలానే వారి విమర్శలను కూడా స్వీకరించాలని అన్నారు. ఆ విమర్శల వెనుక గల కారణాన్ని తెలుసుకుని, పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

"ఒకరు నా పట్ల కోపంగా ఉంటే.. వారికి నన్ను ప్రశ్నించే హక్కు ఉంది? నా సినిమాలను హిట్​ చేసినప్పుడు అభిమానులను ఏది చేసినా సమర్థనీయమే అంటాను? కానీ అదే అభిమానులు నన్ను ఏదైనా అంశం పట్ల ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది. అదే న్యాయం.''

-మనోజ్​ బాజ్​పేయీ.

దీంతో పాటే తాను ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు.. ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నట్లు తెలిపారు మనోజ్​. అవే కష్టాలు సుశాంత్​కు ఎదురయ్యాయని అన్నారు. కానీ సుశాంత్​ సింగ్ ఆత్మహత్యకు పాల్పడటం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. అలా చేయడం తనను ఎంతో బాధించిందని చెప్పుకొచ్చారు.

సుశాంత్​-మనోజ్​ కలిసి 2019లో విడుదలైన 'సోంచిడియా' సినిమాలో నటించారు.

sushanth
మనోజ్​, సుశాంత్​

ఇది చూడండి : అది నాకు రెండో ఇల్లు లాంటిది: ప్రియాంక

నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్యకు, బాలీవుడ్​లోని నెపోటిజమ్​ ఓ కారణమని భావించిన నెటిజన్లు, పలువురు సినీ ప్రముఖుల్ని సోషల్ మీడియా వేదికగా విమర్శిస్తున్నారు. వారిపై పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. అయితే తాజాగా వీటన్నింటికీ బాలీవుడ్​ పరిశ్రమ సమాధానమివ్వాలని అన్నారు ప్రముఖ విలక్షణ నటుడు మనోజ్​ బాజ్​పేయీ​. నెటిజన్లు అడిగిన ప్రతి ప్రశ్నకు జవాబివ్వడం ఎంతో ముఖ్యమని తెలిపారు.

చిత్రసీమలో నటులు ప్రజల అభిమానాన్ని ఎలాగైతే చూరగొంటారో.. అలానే వారి విమర్శలను కూడా స్వీకరించాలని అన్నారు. ఆ విమర్శల వెనుక గల కారణాన్ని తెలుసుకుని, పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

"ఒకరు నా పట్ల కోపంగా ఉంటే.. వారికి నన్ను ప్రశ్నించే హక్కు ఉంది? నా సినిమాలను హిట్​ చేసినప్పుడు అభిమానులను ఏది చేసినా సమర్థనీయమే అంటాను? కానీ అదే అభిమానులు నన్ను ఏదైనా అంశం పట్ల ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది. అదే న్యాయం.''

-మనోజ్​ బాజ్​పేయీ.

దీంతో పాటే తాను ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు.. ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నట్లు తెలిపారు మనోజ్​. అవే కష్టాలు సుశాంత్​కు ఎదురయ్యాయని అన్నారు. కానీ సుశాంత్​ సింగ్ ఆత్మహత్యకు పాల్పడటం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. అలా చేయడం తనను ఎంతో బాధించిందని చెప్పుకొచ్చారు.

సుశాంత్​-మనోజ్​ కలిసి 2019లో విడుదలైన 'సోంచిడియా' సినిమాలో నటించారు.

sushanth
మనోజ్​, సుశాంత్​

ఇది చూడండి : అది నాకు రెండో ఇల్లు లాంటిది: ప్రియాంక

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.