'అ!', 'కల్కి' లాంటి వినూత్న చిత్రాలు తీసిన డైరెక్టర్ ప్రశాంత్వర్మ.. ఈసారి మరో అడుగు ముందుకేసి మరింత భిన్నమైన సినిమాను తీసుకురాబోతున్నారు. ఇప్పటి వరకూ హాలీవుడ్కే తెలిసిన జాంబీలను తెలుగు తెరపై 'జాంబీరెడ్డి'గా చూపించబోతున్నారు. శుక్రవారం సినిమా విడుదల కానున్న సందర్భంగా మేకింగ్ వీడియోను పంచుకున్నారు.
బాలనటుడిగా గుర్తింపు తెచ్చుకున్న తేజసజ్జా ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించారు. ఆనంది, దక్ష నగార్కర్ హీరోయిన్లు. జబర్దస్త్ గెటప్ శ్రీను, పృథ్వీరాజ్ కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాలో నటులందర్నీ జాంబీలుగా చూపించడం సహా తెరపై ఒక భీతిల్లే వాతావరణాన్ని చూపించేందుకు ఎంతో కష్టపడ్డామని డైరెక్టర్ ప్రశాంత్వర్మ చెప్పారు.
ఇది చదవండి: 'జాంబీలతో ఫైట్లే కాదు రొమాన్స్ కూడా'