ETV Bharat / sitara

మహేశ్ ప్రణాళిక మారింది.. లైన్​లోకి పరశురామ్

author img

By

Published : Feb 24, 2020, 9:29 AM IST

Updated : Mar 2, 2020, 9:13 AM IST

'సరిలేరు నీకెవ్వరు' విజయం తర్వాత కొత్త సినిమాను వంశీ పైడిపల్లితో చేస్తున్నట్లు ప్రకటించాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. కానీ ఇప్పుడు ప్రణాళిక మార్చుకున్నాడట.

మహేశ్
మహేశ్

మహేశ్ బాబు ప్రణాళిక మారింది. ఈ హీరో తన తదుపరి చిత్రాన్ని పరశురామ్‌ దర్శకత్వంలోనే చేయాలని నిర్ణయించుకున్నాడు. మార్చి నుంచి చిత్రీకరణ మొదలు పెట్టనున్నట్టు సమాచారం. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్​ తదుపరి సినిమా తెరకెక్కాల్సింది.

'సరిలేరు నీకెవ్వరు' ప్రచార కార్యక్రమాల్లో మహేశ్ అదే విషయాన్ని వెల్లడించాడు. కానీ ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్టు పనులు ఇంకా పూర్తి కాలేదట. అవి ఒక కొలిక్కి రావడానికి ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తుండటం వల్ల ప్రిన్స్ ఆలోపు పరశురామ్‌తో సినిమా చేయాలని నిర్ణయించాడు.

పరశురామ్
పరశురామ్

పరశురామ్‌ చాలా రోజుల కిందటే మహేశ్​కు కథ చెప్పి ఒప్పించాడు. అందుకు సంబంధించిన స్క్రిప్టు పనులు పూర్తయ్యాయి. దీంతో మహేశ్ మొదట ఈ కథకే పచ్చజెండా ఊపేశాడు. ఇదే ఏడాదిలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారని సమాచారం.

మహేశ్ బాబు ప్రణాళిక మారింది. ఈ హీరో తన తదుపరి చిత్రాన్ని పరశురామ్‌ దర్శకత్వంలోనే చేయాలని నిర్ణయించుకున్నాడు. మార్చి నుంచి చిత్రీకరణ మొదలు పెట్టనున్నట్టు సమాచారం. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్​ తదుపరి సినిమా తెరకెక్కాల్సింది.

'సరిలేరు నీకెవ్వరు' ప్రచార కార్యక్రమాల్లో మహేశ్ అదే విషయాన్ని వెల్లడించాడు. కానీ ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్టు పనులు ఇంకా పూర్తి కాలేదట. అవి ఒక కొలిక్కి రావడానికి ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తుండటం వల్ల ప్రిన్స్ ఆలోపు పరశురామ్‌తో సినిమా చేయాలని నిర్ణయించాడు.

పరశురామ్
పరశురామ్

పరశురామ్‌ చాలా రోజుల కిందటే మహేశ్​కు కథ చెప్పి ఒప్పించాడు. అందుకు సంబంధించిన స్క్రిప్టు పనులు పూర్తయ్యాయి. దీంతో మహేశ్ మొదట ఈ కథకే పచ్చజెండా ఊపేశాడు. ఇదే ఏడాదిలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారని సమాచారం.

Last Updated : Mar 2, 2020, 9:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.