మెగా పవర్స్టార్ రామ్చరణ్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నారు. దాని తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'ఆచార్య' షూటింగ్లో పాల్గొంటారు. ఈ సినిమాల తర్వాత చరణ్ మరో కొత్త చిత్రం ఏంటనే సందేహాలు అభిమానుల్లో ఉన్నాయి. అయితే చరణ్ లైనప్లో ఇప్పటికే చాలామంది దర్శకుల పేర్లు ఉన్నాయని పుకార్లు వినిపిస్తున్నాయి.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మరో యువ దర్శకుడి పేరు బలంగా వినిపిస్తోంది. అతడే కోలీవుడ్కు చెందిన లోకేశ్ కనగరాజ్. 'ఖైదీ', 'మాస్టర్' సినిమాలతో తమిళంతో పాటు తెలుగులోనూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ దర్శకుడు చరణ్కు ఇప్పటికే స్టోరీ లైన్ చెప్పారట. త్వరలోనే పూర్తి స్టోరీ చెబుతానని తెలిపారట. ప్రస్తుతం 'విక్రమ్' సినిమాతో బిజీగా ఉన్న లోకేశ్ అది పూర్తయ్యాక చరణ్కు పూర్తి స్టోరీ చెప్పబోతున్నారని టాలీవుడ్. ఇదే నిజమైతే చరణ్ చేయబోయే కొత్త చిత్రం ఈ దర్శకుడితోనే అవుతుంది.