ETV Bharat / sitara

దీపికాపై సుశాంత్​ అభిమానుల ఆగ్రహానికి కారణమిదే!

author img

By

Published : Aug 13, 2020, 6:56 PM IST

మానసిక ఒత్తిడి కారణంగానే బాలీవుడ్​ నటుడు సుశాంత్​ మరణించాడని నటి దీపికా పదుకొణె నమ్మించే ప్రయత్నం చేసిందని.. పలువురు నెటిజన్లు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుశాంత్​ మరణించిన రోజు నుంచి దీపిక మానసిక ఒత్తిడి సిద్ధాంతాన్ని చెబుతోందని విమర్శించారు. పోలీసులు కేసు నమోదు చేయకుండా, వైద్యులు ధ్రువీకరించకుండా ఆత్మహత్య అని ఎలా చెప్పగలిగారని నటికి సోషల్​మీడియాలో పలువురు ప్రశ్నలు సంధిస్తున్నారు.

Know why Sushant Singh Rajput fans troll Deepika Padukone
దీపికా పదుకొణెపై సుశాంత్​ అభిమానులు ఆగ్రహం

సుశాంత్​ మానసిక ఒత్తిడి కారణంగా మృతి చెందాడని నమ్మించే విధంగా బాలీవుడ్​ నటి దీపికా పదుకొణె ప్రవర్తించిందని పలువురు నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ఈ కారణంగా సోషల్​మీడియాలో ఆమెపై ట్రోలింగ్​ మొదలైంది.

సుశాంత్​ జూన్​ 14న ఆత్మహత్య చేసుకున్న తర్వాత దీపిక తన ట్విట్టర్​లో మానసిక ఒత్తిడిపై పలు సిద్ధాంతాలను వెల్లడించింది. ఆ ట్వీట్లు జూన్​ 21 వరకు కొనసాగాయి. ఆ తర్వాత సుశాంత్​ మృతిపై నటి మౌనంగా ఉండిపోయింది. అయితే వాటిపై సుశాంత్​ అభిమానులు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

"పోలీసులు ఎఫ్​ఐఆర్​ నమోదు చేయలేదు. ఇంతలోనే దీపిక మానసిక ఒత్తిడి సిద్ధాంతాన్ని జపించడం మొదలుపెట్టింది. వైద్యులు అదృశ్యమయ్యారు. మహారాష్ట్ర డీసీపీ సుశాంత్​ది ఆత్మహత్య అని ఖరారు చేశారు. సిస్టమ్​లో ఏదో తప్పు జరుగుతోంది" అని ఓ నెటిజన్​ ట్వీట్​ చేశారు.

"ప్రియమైన దీపికా పదుకొణె.. మీరు నిరాశకు లోనవుతున్నారని అనిపిస్తుందా?" అని మరొకరు రిప్లై ఇచ్చారు.

"సుశాంత్​ మృతి తర్వాత మానసిక ఒత్తిడి పేరుతో స్పందించడం వల్ల ప్రజలు దీపికను ద్వేషిస్తున్నారు. ఇలాంటి పని చేసినందుకు మీరు సిగ్గుపడాలి. ఇలాంటి అమానవీయమైన పని ఎలా చేశారు?" అని సుశాంత్​ అభిమాని ట్వీట్​ చేశారు.

"నేను మిమ్మల్ని చాలా ఇష్టపడతాను. కానీ, మీరు చెప్పిన మానసిక ఒత్తిడి సిద్ధాంతం తర్వాత మీకు అభిమానిగా ఉన్నందుకు బాధపడుతున్నా. మీరు నిజంవైపు ఉండకపోయినా పర్వాలేదు. కానీ, ఇలాంటి అర్థంలేని సిద్ధాంతాలు చెప్పొద్దు" అని మరో నెటిజన్​ స్పందించారు.

"నా తర్వాత ఇలా చేయండి!! డిప్రెషన్​ అనేది విలాసవంతమైనది కాదు. ప్రజల నుంచి సానుభూతి పొందడానికి మానసిక ఒత్తిడి సిద్ధాంతాన్ని ఉపయోగించకూడదు" అని దీపికా పదుకొణె స్టైల్​లో ఓ నెటిజన్​ రిప్లై ఇచ్చారు.

సుశాంత్​ మానసిక ఒత్తిడి కారణంగా మృతి చెందాడని నమ్మించే విధంగా బాలీవుడ్​ నటి దీపికా పదుకొణె ప్రవర్తించిందని పలువురు నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ఈ కారణంగా సోషల్​మీడియాలో ఆమెపై ట్రోలింగ్​ మొదలైంది.

సుశాంత్​ జూన్​ 14న ఆత్మహత్య చేసుకున్న తర్వాత దీపిక తన ట్విట్టర్​లో మానసిక ఒత్తిడిపై పలు సిద్ధాంతాలను వెల్లడించింది. ఆ ట్వీట్లు జూన్​ 21 వరకు కొనసాగాయి. ఆ తర్వాత సుశాంత్​ మృతిపై నటి మౌనంగా ఉండిపోయింది. అయితే వాటిపై సుశాంత్​ అభిమానులు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

"పోలీసులు ఎఫ్​ఐఆర్​ నమోదు చేయలేదు. ఇంతలోనే దీపిక మానసిక ఒత్తిడి సిద్ధాంతాన్ని జపించడం మొదలుపెట్టింది. వైద్యులు అదృశ్యమయ్యారు. మహారాష్ట్ర డీసీపీ సుశాంత్​ది ఆత్మహత్య అని ఖరారు చేశారు. సిస్టమ్​లో ఏదో తప్పు జరుగుతోంది" అని ఓ నెటిజన్​ ట్వీట్​ చేశారు.

"ప్రియమైన దీపికా పదుకొణె.. మీరు నిరాశకు లోనవుతున్నారని అనిపిస్తుందా?" అని మరొకరు రిప్లై ఇచ్చారు.

"సుశాంత్​ మృతి తర్వాత మానసిక ఒత్తిడి పేరుతో స్పందించడం వల్ల ప్రజలు దీపికను ద్వేషిస్తున్నారు. ఇలాంటి పని చేసినందుకు మీరు సిగ్గుపడాలి. ఇలాంటి అమానవీయమైన పని ఎలా చేశారు?" అని సుశాంత్​ అభిమాని ట్వీట్​ చేశారు.

"నేను మిమ్మల్ని చాలా ఇష్టపడతాను. కానీ, మీరు చెప్పిన మానసిక ఒత్తిడి సిద్ధాంతం తర్వాత మీకు అభిమానిగా ఉన్నందుకు బాధపడుతున్నా. మీరు నిజంవైపు ఉండకపోయినా పర్వాలేదు. కానీ, ఇలాంటి అర్థంలేని సిద్ధాంతాలు చెప్పొద్దు" అని మరో నెటిజన్​ స్పందించారు.

"నా తర్వాత ఇలా చేయండి!! డిప్రెషన్​ అనేది విలాసవంతమైనది కాదు. ప్రజల నుంచి సానుభూతి పొందడానికి మానసిక ఒత్తిడి సిద్ధాంతాన్ని ఉపయోగించకూడదు" అని దీపికా పదుకొణె స్టైల్​లో ఓ నెటిజన్​ రిప్లై ఇచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.