ETV Bharat / sitara

కరోనా యోధుల కోసం కరీనా ప్రత్యేక టీ షర్టులు! - కరీనా కపూర్​

తమ ప్రాణాలను పణంగా పెట్టి కరోనా రోగుల బాగోగులు చూసుకుంటున్న వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపింది బాలీవుడ్ నటి కరీనా కపూర్​. ఈ సందర్భంగా వారికి ప్రత్యేకంగా తయారు చేయించిన యాంటీ మైక్రోబియల్​ టీ షర్టులను అందజేసింది.

Kareena Kapoor
కరీనా కపూర్​
author img

By

Published : Sep 4, 2020, 3:40 PM IST

కరోనా కాలంలో నిరంతరం శ్రమిస్తున్న యోధులకు కృతజ్ఞతలు తెలిపింది బాలీవుడ్​ హీరోయిన్​ కరీనా కపూర్​. ఈ క్రమంలోనే మూడు ఆస్పత్రుల్లోని వైద్య సిబ్బందికి యాంటీ మైక్రోబియల్​ టీ షర్టులను అందజేసింది. దిల్లీలోని ఆల్​ ఇండియా ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ మెడికల్​ సైన్సెస్​(ఎయిమ్స్​), ముంబయికి చెందిన లోకమాన్య తిలక్​ మున్సిపల్​ హాస్పిటల్​​, బెంగళూరులోని సక్రా వరల్డ్​ ఆస్పత్రిలోని ఆరోగ్య సంరక్షణ నిపుణులకు ఈ టీ షర్టులను విరాళంగా ఇచ్చింది. ఈ సందర్భంగా ఇన్​స్టాగ్రామ్​లో ఓ పోస్టు చేసింది.

"మనమంతా భౌతిక దూరం పాటిస్తున్నాం. ఒకరినొకరు రక్షించుకునేందుకు చేయగలినదంతా చేస్తున్నాం. అయితే వైద్య సిబ్బంది చేస్తున్న కృషికి, వారి ప్రేమకు ధన్యవాదాలు. ప్రపంచమంతా ఈ మహమ్మారి వ్యాపించి అందరూ ఇళ్లకే పరిమితమైతే.. మీరు మాత్రం మమ్మల్ని రక్షించేందుకు యుద్ధం చేస్తున్నారు. మీ సేఫ్టీ కోసం పీపీఈ కిట్లు ధరించడం చాలా ముఖ్యం.. కానీ వాటిని శరీరంపై ఉంచుకోవడం ఎంత కష్టమో నాకు తెలుసు. అందుకే 'పుమా' కంపెనీ నుంచి మీ కోసం మాస్కులు, యాంటీ మైక్రోబియల్​ టీ షర్టులను పంపించాం. దయచేసి వాటిని స్వీకరించండి."

-కరీనా కపూర్​ , సినీ నటి

కరోనా రోగులకు వైద్యం చేసే సమయంలో పీపీఈ కిట్లు ధరించడం తప్పనిసరి. అయితే, చాలాసేపటి వరకు ఈ వీటిని శరీరంపై ఉంచుకోవడం అంత తేలికైన విషయం కాదు. వీటి వల్ల త్వరగా అలసిపోవడమే కాకుండా.. అసౌకర్యంగానూ ఉంటుంది. అయితే, యాంటీ మైక్రోబియల్​ టీ షర్టులు పీపీఈ కిట్లను ధరించడాన్ని సౌకర్యవంతంగా మారుస్తాయి. సూక్ష్మజీవుల ప్రభావం వారిపై పడకుండా సాయపడతాయి.

కరోనా కాలంలో నిరంతరం శ్రమిస్తున్న యోధులకు కృతజ్ఞతలు తెలిపింది బాలీవుడ్​ హీరోయిన్​ కరీనా కపూర్​. ఈ క్రమంలోనే మూడు ఆస్పత్రుల్లోని వైద్య సిబ్బందికి యాంటీ మైక్రోబియల్​ టీ షర్టులను అందజేసింది. దిల్లీలోని ఆల్​ ఇండియా ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ మెడికల్​ సైన్సెస్​(ఎయిమ్స్​), ముంబయికి చెందిన లోకమాన్య తిలక్​ మున్సిపల్​ హాస్పిటల్​​, బెంగళూరులోని సక్రా వరల్డ్​ ఆస్పత్రిలోని ఆరోగ్య సంరక్షణ నిపుణులకు ఈ టీ షర్టులను విరాళంగా ఇచ్చింది. ఈ సందర్భంగా ఇన్​స్టాగ్రామ్​లో ఓ పోస్టు చేసింది.

"మనమంతా భౌతిక దూరం పాటిస్తున్నాం. ఒకరినొకరు రక్షించుకునేందుకు చేయగలినదంతా చేస్తున్నాం. అయితే వైద్య సిబ్బంది చేస్తున్న కృషికి, వారి ప్రేమకు ధన్యవాదాలు. ప్రపంచమంతా ఈ మహమ్మారి వ్యాపించి అందరూ ఇళ్లకే పరిమితమైతే.. మీరు మాత్రం మమ్మల్ని రక్షించేందుకు యుద్ధం చేస్తున్నారు. మీ సేఫ్టీ కోసం పీపీఈ కిట్లు ధరించడం చాలా ముఖ్యం.. కానీ వాటిని శరీరంపై ఉంచుకోవడం ఎంత కష్టమో నాకు తెలుసు. అందుకే 'పుమా' కంపెనీ నుంచి మీ కోసం మాస్కులు, యాంటీ మైక్రోబియల్​ టీ షర్టులను పంపించాం. దయచేసి వాటిని స్వీకరించండి."

-కరీనా కపూర్​ , సినీ నటి

కరోనా రోగులకు వైద్యం చేసే సమయంలో పీపీఈ కిట్లు ధరించడం తప్పనిసరి. అయితే, చాలాసేపటి వరకు ఈ వీటిని శరీరంపై ఉంచుకోవడం అంత తేలికైన విషయం కాదు. వీటి వల్ల త్వరగా అలసిపోవడమే కాకుండా.. అసౌకర్యంగానూ ఉంటుంది. అయితే, యాంటీ మైక్రోబియల్​ టీ షర్టులు పీపీఈ కిట్లను ధరించడాన్ని సౌకర్యవంతంగా మారుస్తాయి. సూక్ష్మజీవుల ప్రభావం వారిపై పడకుండా సాయపడతాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.