ETV Bharat / sitara

రూ.55 కోట్లకు 'తలైవి' ఓటీటీ హక్కులు

author img

By

Published : Jun 6, 2020, 5:42 AM IST

Updated : Jun 6, 2020, 5:58 AM IST

తాను ప్రధాన పాత్ర పోషిస్తున్న 'తలైవి' సినిమాను తొలుత థియేటర్లలోనే విడుదల చేస్తామని నటి కంగనా రనౌత్ వెల్లడించింది. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాన్ని పంచుకుంది.

Thalaivi news
తలైవి వార్తలు

లాక్‌డౌన్‌ ప్రభావంతో చాలా సినిమాలు ఓటీటీలో నేరుగా విడుదల చేస్తారంటూ వార్తలొస్తున్నాయి. ఒకటి రెండు చిత్రాలు ఇప్పటికే ఇలా విడుదలయ్యాయి. ఈ క్రమంలోనే జయలలిత బయోపిక్ 'తలైవి'.. స్మార్ట్​తెరపై రానుందని పుకార్లు వచ్చాయి. ఈ విషయమై స్పందించిన హీరోయిన్ కంగనా రనౌత్​... కచ్చితంగా థియేటర్​లోనే తొలుత విడుదల చేస్తామని స్పష్టం చేసింది. ఓటీటీ ట్రెండ్​పైనా తన అభిప్రాయం వెల్లడించింది​.

"తలైవి వంటి భారీ బడ్జెట్​, అత్యధిక ప్రేక్షకాదరణ పొందగలిగే సినిమాను తొలుత డిజిటల్​ వేదికగా విడుదల చేయలేం. ఇదే కోవలోకి మణికర్ణిక కూడా వస్తుంది. అయితే పంగా, జడ్జిమెంటల్​ హై క్యా సినిమాలు అభిమానులను బాగా ఆకట్టుకున్నా.. ఇవి డిజిటల్​ ఫ్రెండ్లీ సినిమాలు. అవి అక్కడ కూడా మంచి లాభాలను సంపాదించాయి. కాబట్టి ఓటీటీలో విడుదల అనేది ఆయా పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది"

-- కంగనా రనౌత్​, కథానాయిక

జయలలిత జీవితం ఆధారంగా తీస్తున్న 'తలైవి'.. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా డిజిటల్ హకుల్ని అమెజాన్​, నెట్​ఫ్లిక్స్​ రూ.55 కోట్లకు సొంతం చేసుకున్నట్లు కంగనా చెప్పింది. ఇందులో ఎమ్‌జీఆర్‌గా అరవింద స్వామి నటిస్తున్నారు. ఏ.ఎల్‌ విజయ్‌ దర్శకుడు. విష్ణు ఇందూరి, శైలేష్‌ ఆర్‌.సింగ్‌ నిర్మాతలు. కరోనా నేపథ్యంలో థియేటర్లు ప్రారంభంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం వల్ల చిత్ర విడుదల ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

లాక్‌డౌన్‌ ప్రభావంతో చాలా సినిమాలు ఓటీటీలో నేరుగా విడుదల చేస్తారంటూ వార్తలొస్తున్నాయి. ఒకటి రెండు చిత్రాలు ఇప్పటికే ఇలా విడుదలయ్యాయి. ఈ క్రమంలోనే జయలలిత బయోపిక్ 'తలైవి'.. స్మార్ట్​తెరపై రానుందని పుకార్లు వచ్చాయి. ఈ విషయమై స్పందించిన హీరోయిన్ కంగనా రనౌత్​... కచ్చితంగా థియేటర్​లోనే తొలుత విడుదల చేస్తామని స్పష్టం చేసింది. ఓటీటీ ట్రెండ్​పైనా తన అభిప్రాయం వెల్లడించింది​.

"తలైవి వంటి భారీ బడ్జెట్​, అత్యధిక ప్రేక్షకాదరణ పొందగలిగే సినిమాను తొలుత డిజిటల్​ వేదికగా విడుదల చేయలేం. ఇదే కోవలోకి మణికర్ణిక కూడా వస్తుంది. అయితే పంగా, జడ్జిమెంటల్​ హై క్యా సినిమాలు అభిమానులను బాగా ఆకట్టుకున్నా.. ఇవి డిజిటల్​ ఫ్రెండ్లీ సినిమాలు. అవి అక్కడ కూడా మంచి లాభాలను సంపాదించాయి. కాబట్టి ఓటీటీలో విడుదల అనేది ఆయా పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది"

-- కంగనా రనౌత్​, కథానాయిక

జయలలిత జీవితం ఆధారంగా తీస్తున్న 'తలైవి'.. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా డిజిటల్ హకుల్ని అమెజాన్​, నెట్​ఫ్లిక్స్​ రూ.55 కోట్లకు సొంతం చేసుకున్నట్లు కంగనా చెప్పింది. ఇందులో ఎమ్‌జీఆర్‌గా అరవింద స్వామి నటిస్తున్నారు. ఏ.ఎల్‌ విజయ్‌ దర్శకుడు. విష్ణు ఇందూరి, శైలేష్‌ ఆర్‌.సింగ్‌ నిర్మాతలు. కరోనా నేపథ్యంలో థియేటర్లు ప్రారంభంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం వల్ల చిత్ర విడుదల ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
Last Updated : Jun 6, 2020, 5:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.