ETV Bharat / sitara

బాలీవుడ్ నటులకు సోషల్​ మీడియా సెగ​

author img

By

Published : Jun 23, 2020, 12:50 PM IST

నటుడు సుశాంత్‌ సింగ్ రాజ్​పుత్‌ ఆత్మహత్యతో బాలీవుడ్‌లో 'బంధుప్రీతి' అంశం మరోసారి చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో అసహనానికి గరైన కొంతమంది బీటౌన్​ కథానాయికలు తమ ఖాతాల నుంచి వైదొలగొడం, కామెంట్​ సెక్షన్లపై పరిమితి విధించుకోవడం వంటివి చేస్తున్నారు.

heroines
కథానాయికలు

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌.. బంధుప్రీతి, ప్రముఖుల అమానుష చర్యల వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని కొంతమంది నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా వారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తీవ్ర అసంతృప్తికి గురైన బీటౌన్​ కథానాయికలు తమ సోషల్​ మీడియా ఖాతాలకు గుడ్​బై చెప్పడం, కామెంట్​ సెక్షన్లను పరిమితం చేయడం లేదా క్లోజ్ చేయడం చేస్తున్నారు. మరి ఇంతకి ఆ కథానాయికలు ఎవరో తెలుసుకుందాం.

సోనమ్​ కపూర్​

ఒకానొక సమయంలో తన తండ్రితో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్న సోనమ్‌.. తనకు సుశాంత్‌ ఎవరో తెలియదని చెప్పిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో తనపై వస్తోన్న విమర్శనాత్మక ట్వీట్లపై స్పందించిన సోనమ్​.. ఇన్‌స్టా వేదికగా ఆ ట్వీట్లను షేర్‌ చేశారు. ప్రతి ఒక్కరి జీవితంలో కర్మ సిద్ధాంతానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. ఈ వ్యాఖ్యలపై మరోసారి నెటిజన్లు సోనమ్​పై విరుచుకుపడ్డారు. "మీ తండ్రి అనిల్ కపూర్ లేకపోతే నీ పరిస్థితి ఏంటి", "మీ తండ్రి కష్టపడటం వల్ల మీరు ఈ స్థితిలో ఉన్నారు" అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఫలితంగా తన కామెంట్ సెక్షన్​ను పరిమితం చేసుకున్నారు సోనమ్.

  • This is some of comments coming my way. All the media and all the people who’ve encouraged this sort of behaviour and instigated it. This is on you. People talking about how one should have been kind to someone are doing worse to others. pic.twitter.com/6rH4LSBOxp

    — Sonam K Ahuja (@sonamakapoor) June 21, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

సోనాక్షి సిన్హా

బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​ సోనాక్షి సిన్హా.. తనపై వస్తోన్న విమర్శనాత్మక ట్వీట్ల తాకిడి తట్టుకోలేక ట్విట్టర్​ నుంచి వైదొలిగారు. ప్రస్తుత రోజుల్లో ట్విట్టర్​లో నెగిటివిటీ ఎక్కువగా ఉందని.. ప్రతికూల భావనలకు దూరంగా ఉన్నప్పుడే అందమైన జీవితాన్ని కాపాడుకోగలమని తెలిపారు.

తగ్గిన ఫాలోవర్స్‌

బాలీవుడ్‌ అగ్రనిర్మాతలు, నటీనటుల ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ ఖాతాలను అన్‌ఫాలో చేస్తున్నారు నెటిజన్లు. ఈ నేపథ్యంలో ఆలియా భట్​కు 48.8 మిలియన్ల మంది ఫాలోవర్స్​ ఉండగా.. ఈ సంఖ్య 47.4 మిలియన్లకు పడిపోయింది. తాజాగా తన కామెంట్ల సెక్షన్​ను పరిమితం చేసిందీ భామ. కరీనా కపూర్​, అనన్యా పాండే కూడా ఇదే పని చేశారు.

కరణ్‌ జోహర్‌ను ఇప్పటికీ ఇన్‌స్టాలో 5 లక్షల మంది అన్‌ఫాలో చేయగా.. ఆయుష్ శర్మ, సాకిబ్ సలీమ్, సింగర్ నేహా భాసిన్, దర్శకుడు శశాంక్ ఖైతాన్ తదితరులు తమ ఖాతాల నుంచి వైదొలిగారు.

kareena
కరీనా
alia
ఆలియా భట్​
ananya
అనన్య పాండే
karan
కరణ్​ జోహార్​

ఇది చూడండి : అనుచిత వ్యాఖ్యలపై సోనమ్ కపూర్​​ ఆగ్రహం

ట్విట్టర్​కు హీరోయిన్ సోనాక్షి సిన్హా గుడ్​బై

'నన్ను చాలాసార్లు మానసికంగా హింసించారు'

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌.. బంధుప్రీతి, ప్రముఖుల అమానుష చర్యల వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని కొంతమంది నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా వారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తీవ్ర అసంతృప్తికి గురైన బీటౌన్​ కథానాయికలు తమ సోషల్​ మీడియా ఖాతాలకు గుడ్​బై చెప్పడం, కామెంట్​ సెక్షన్లను పరిమితం చేయడం లేదా క్లోజ్ చేయడం చేస్తున్నారు. మరి ఇంతకి ఆ కథానాయికలు ఎవరో తెలుసుకుందాం.

సోనమ్​ కపూర్​

ఒకానొక సమయంలో తన తండ్రితో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్న సోనమ్‌.. తనకు సుశాంత్‌ ఎవరో తెలియదని చెప్పిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో తనపై వస్తోన్న విమర్శనాత్మక ట్వీట్లపై స్పందించిన సోనమ్​.. ఇన్‌స్టా వేదికగా ఆ ట్వీట్లను షేర్‌ చేశారు. ప్రతి ఒక్కరి జీవితంలో కర్మ సిద్ధాంతానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. ఈ వ్యాఖ్యలపై మరోసారి నెటిజన్లు సోనమ్​పై విరుచుకుపడ్డారు. "మీ తండ్రి అనిల్ కపూర్ లేకపోతే నీ పరిస్థితి ఏంటి", "మీ తండ్రి కష్టపడటం వల్ల మీరు ఈ స్థితిలో ఉన్నారు" అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఫలితంగా తన కామెంట్ సెక్షన్​ను పరిమితం చేసుకున్నారు సోనమ్.

  • This is some of comments coming my way. All the media and all the people who’ve encouraged this sort of behaviour and instigated it. This is on you. People talking about how one should have been kind to someone are doing worse to others. pic.twitter.com/6rH4LSBOxp

    — Sonam K Ahuja (@sonamakapoor) June 21, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

సోనాక్షి సిన్హా

బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​ సోనాక్షి సిన్హా.. తనపై వస్తోన్న విమర్శనాత్మక ట్వీట్ల తాకిడి తట్టుకోలేక ట్విట్టర్​ నుంచి వైదొలిగారు. ప్రస్తుత రోజుల్లో ట్విట్టర్​లో నెగిటివిటీ ఎక్కువగా ఉందని.. ప్రతికూల భావనలకు దూరంగా ఉన్నప్పుడే అందమైన జీవితాన్ని కాపాడుకోగలమని తెలిపారు.

తగ్గిన ఫాలోవర్స్‌

బాలీవుడ్‌ అగ్రనిర్మాతలు, నటీనటుల ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ ఖాతాలను అన్‌ఫాలో చేస్తున్నారు నెటిజన్లు. ఈ నేపథ్యంలో ఆలియా భట్​కు 48.8 మిలియన్ల మంది ఫాలోవర్స్​ ఉండగా.. ఈ సంఖ్య 47.4 మిలియన్లకు పడిపోయింది. తాజాగా తన కామెంట్ల సెక్షన్​ను పరిమితం చేసిందీ భామ. కరీనా కపూర్​, అనన్యా పాండే కూడా ఇదే పని చేశారు.

కరణ్‌ జోహర్‌ను ఇప్పటికీ ఇన్‌స్టాలో 5 లక్షల మంది అన్‌ఫాలో చేయగా.. ఆయుష్ శర్మ, సాకిబ్ సలీమ్, సింగర్ నేహా భాసిన్, దర్శకుడు శశాంక్ ఖైతాన్ తదితరులు తమ ఖాతాల నుంచి వైదొలిగారు.

kareena
కరీనా
alia
ఆలియా భట్​
ananya
అనన్య పాండే
karan
కరణ్​ జోహార్​

ఇది చూడండి : అనుచిత వ్యాఖ్యలపై సోనమ్ కపూర్​​ ఆగ్రహం

ట్విట్టర్​కు హీరోయిన్ సోనాక్షి సిన్హా గుడ్​బై

'నన్ను చాలాసార్లు మానసికంగా హింసించారు'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.