ETV Bharat / sitara

'నువ్వే కావాలి' కోసం నేను, రిచా అలా: తరుణ్​

author img

By

Published : Oct 12, 2020, 2:21 PM IST

ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్​లో, తరుణ్​ హీరోగా కె. విజయ్​ భాస్కర్ దర్శకత్వం వహించిన సినిమా 'నువ్వే కావాలి'. మంగళవారానికి (అక్టోబర్ 13) 20 ఏళ్లు పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా హీరో తరుణ్​​ కొన్ని ఆసక్తికర సంగతులు పంచుకున్నారు.

nuvve kaavali 20 years
నువ్వేకావాలి
నువ్వేకావాలి

బాలనటుడిగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన తరుణ్‌.. 'నువ్వే కావాలి' సినిమాతో కథానాయకుడిగా పరిచయమయ్యారు. కె.విజయ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో యువతను ఊర్రూతలూగించింది. తరుణ్‌- హీరోయిన్​ రిచా నటన, విజయ్‌ భాస్కర్‌ టేకింగ్‌, త్రివిక్రమ్‌ రచనా శైలితో పాటు, సంగీత దర్శకుడు కోటి అందించిన స్వరాలు యువతనే కాదు, అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఉషాకిరణ్‌ మూవీస్‌ నిర్మించిన ఈ చిత్రం.. 20 వసంతాలు(అక్టోబరు 13)న పూర్తి చేసుకోబోతోంది. ఈ సందర్భంగా హీరో తరుణ్​ చిత్రవిశేషాలను పంచుకున్నారు.

'నువ్వే కావాలి' సినిమా వచ్చి అప్పుడే 20 ఏళ్లు పూర్తయ్యాయంటే నమ్మలేకపోతున్నాను. చిటికెలో ఇన్నేళ్లు గడిచిపోయాయి. ఎంతో ఆనందంగా ఉంది. అప్పటివరకు 20-30 సినిమాల్లో బాలనటుడిగా చేశాను. ఆ తర్వాత సినిమాలు చేయాలని అనుకోలేదు. ఇంటర్​ చదివేటప్పుడు రాజీవ్​ మేనన్​ చేసిన యాడ్​లో సరదాగా నటించాను. అందులో నాతో పాటు రిచా కూడా నటించింది. అది చూసి 'నువ్వే కావాలి' సినిమా కోసం నన్ను రిచాను ఎంచుకున్నారు. అలా ఈ సినిమా చేశాం. నిర్మాత రామోజీరావు, స్రవంతి రవికిశోర్​, దర్శకుడు విజయ్ భాస్కర్, త్రివిక్రమ్​, హీరోయిన్​ రిచా​లకు ధన్యవాదాలు. మరో విశేషమేమిటంటే నన్ను బాలనటుడిగా 'మనసు మమత' ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది ఉషాకిరణ్​ మూవీస్​. ఈ సంస్థతో నాకు ఎంతో చక్కని అనుబంధం ఉంది. మరోసారి చిత్రబృందానికి నా ధన్యావాదాలు" అని మనసులో మాటలను పంచుకున్నారు తరుణ్​.

నువ్వేకావాలి

బాలనటుడిగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన తరుణ్‌.. 'నువ్వే కావాలి' సినిమాతో కథానాయకుడిగా పరిచయమయ్యారు. కె.విజయ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో యువతను ఊర్రూతలూగించింది. తరుణ్‌- హీరోయిన్​ రిచా నటన, విజయ్‌ భాస్కర్‌ టేకింగ్‌, త్రివిక్రమ్‌ రచనా శైలితో పాటు, సంగీత దర్శకుడు కోటి అందించిన స్వరాలు యువతనే కాదు, అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఉషాకిరణ్‌ మూవీస్‌ నిర్మించిన ఈ చిత్రం.. 20 వసంతాలు(అక్టోబరు 13)న పూర్తి చేసుకోబోతోంది. ఈ సందర్భంగా హీరో తరుణ్​ చిత్రవిశేషాలను పంచుకున్నారు.

'నువ్వే కావాలి' సినిమా వచ్చి అప్పుడే 20 ఏళ్లు పూర్తయ్యాయంటే నమ్మలేకపోతున్నాను. చిటికెలో ఇన్నేళ్లు గడిచిపోయాయి. ఎంతో ఆనందంగా ఉంది. అప్పటివరకు 20-30 సినిమాల్లో బాలనటుడిగా చేశాను. ఆ తర్వాత సినిమాలు చేయాలని అనుకోలేదు. ఇంటర్​ చదివేటప్పుడు రాజీవ్​ మేనన్​ చేసిన యాడ్​లో సరదాగా నటించాను. అందులో నాతో పాటు రిచా కూడా నటించింది. అది చూసి 'నువ్వే కావాలి' సినిమా కోసం నన్ను రిచాను ఎంచుకున్నారు. అలా ఈ సినిమా చేశాం. నిర్మాత రామోజీరావు, స్రవంతి రవికిశోర్​, దర్శకుడు విజయ్ భాస్కర్, త్రివిక్రమ్​, హీరోయిన్​ రిచా​లకు ధన్యవాదాలు. మరో విశేషమేమిటంటే నన్ను బాలనటుడిగా 'మనసు మమత' ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది ఉషాకిరణ్​ మూవీస్​. ఈ సంస్థతో నాకు ఎంతో చక్కని అనుబంధం ఉంది. మరోసారి చిత్రబృందానికి నా ధన్యావాదాలు" అని మనసులో మాటలను పంచుకున్నారు తరుణ్​.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.