ETV Bharat / sitara

సెట్​లో బాలయ్య.. హైదరాబాద్​లో 'అఖండ' రీస్టార్ట్

author img

By

Published : Jul 12, 2021, 5:26 PM IST

లాక్​డౌన్​ నుంచి సడలింపులు వచ్చిన నేపథ్యంలో టాలీవుడ్​లో జోష్ కనిపిస్తోంది. పలు సినిమాలు షూటింగ్​లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే బాలయ్య 'అఖండ' కూడా చివరి షెడ్యూల్​ మొదలైంది.

Final Schedule of Balakrishna 'Akhanda' resumes in Hyderabad
బాలకృష్ణ

అగ్రహీరో నందమూరి బాలకృష్ణ కూడా సెట్​లో అడుగుపెట్టేశారు. ఆయన నటిస్తున్న 'అఖండ' షూటింగ్.. హైదరాబాద్​లో సోమవారం తిరిగి ప్రారంభమైంది. ఈ షెడ్యూల్​తో చిత్రీకరణ పూర్తవుతుంది. త్వరలో విడుదల తేదీనీ వెల్లడించే అవకాశముంది. చివరి షెడ్యూల్​లో బాలయ్యపై కీలక సన్నివేశాలతో పాటు ఫైట్​ సీక్వెన్స్​ను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.

.
.

'అఖండ' నుంచి ఇప్పటికే వచ్చిన టీజర్, పోస్టర్లు.. అభిమానుల్ని అలరించడమే కాకుండా సినిమాపై అంచనాల్ని పెంచేస్తున్నాయి. బోయపాటి-బాలయ్య కాంబినేషన్​లో వచ్చిన 'సింహా', 'లెజెండ్' చిత్రాలు బ్లాక్​బస్టర్​లుగా నిలవడం వల్ల ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

.
.

ఇందులో బాలయ్య.. అఘోరా పాత్రలో కనిపించి, ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేయనున్నారు. ఆయన సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్​గా నటిస్తోంది. శ్రీకాంత్ ప్రతినాయకుడిగా చేస్తున్నారు. తమన్ సంగీతమందిస్తున్నారు. బోయపాటి శీను దర్శకత్వం వహిస్తుండగా, మిర్యాల రవీందర్​రెడ్డి భారీ బడ్జెట్​తో నిర్మిస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

అగ్రహీరో నందమూరి బాలకృష్ణ కూడా సెట్​లో అడుగుపెట్టేశారు. ఆయన నటిస్తున్న 'అఖండ' షూటింగ్.. హైదరాబాద్​లో సోమవారం తిరిగి ప్రారంభమైంది. ఈ షెడ్యూల్​తో చిత్రీకరణ పూర్తవుతుంది. త్వరలో విడుదల తేదీనీ వెల్లడించే అవకాశముంది. చివరి షెడ్యూల్​లో బాలయ్యపై కీలక సన్నివేశాలతో పాటు ఫైట్​ సీక్వెన్స్​ను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.

.
.

'అఖండ' నుంచి ఇప్పటికే వచ్చిన టీజర్, పోస్టర్లు.. అభిమానుల్ని అలరించడమే కాకుండా సినిమాపై అంచనాల్ని పెంచేస్తున్నాయి. బోయపాటి-బాలయ్య కాంబినేషన్​లో వచ్చిన 'సింహా', 'లెజెండ్' చిత్రాలు బ్లాక్​బస్టర్​లుగా నిలవడం వల్ల ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

.
.

ఇందులో బాలయ్య.. అఘోరా పాత్రలో కనిపించి, ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేయనున్నారు. ఆయన సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్​గా నటిస్తోంది. శ్రీకాంత్ ప్రతినాయకుడిగా చేస్తున్నారు. తమన్ సంగీతమందిస్తున్నారు. బోయపాటి శీను దర్శకత్వం వహిస్తుండగా, మిర్యాల రవీందర్​రెడ్డి భారీ బడ్జెట్​తో నిర్మిస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.