ETV Bharat / sitara

సల్మాన్​ చిత్రంలో ఉగ్రవాదిగా ఇమ్రాన్​!

బాలీవుడ్​ హీరో సల్మాన్​ ఖాన్ ప్రధానపాత్రలో యశ్​రాజ్​ ఫిల్మ్స్​ నిర్మిస్తున్న చిత్రం 'టైగర్​ 3'. కరోనా కారణంగా చిత్రీకరణ ఆగిపోయింది. ఇందులో సల్మాన్​కు జోడీగా కత్రినా కైఫ్​ నటిస్తోంది. వీరితో మరో నటుడు ఇమ్రాన్​ హష్మీ ప్రతినాయక పాత్రలో కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది.

author img

By

Published : May 24, 2021, 5:50 PM IST

Emraan Hashmi playing ISI agent in Salman Khan-Katrina Kaif starrer 'Tiger 3'?
సల్మాన్​ చిత్రంలో ఉగ్రవాదిగా ఇమ్రాన్​!

సల్మాన్‌ ఖాన్‌, కత్రినా కైఫ్‌ కలిసి నటిస్తున్న చిత్రం 'టైగర్‌ 3'. మనీశ్​ శర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా ఇమ్రాన్‌ హష్మీ నటిస్తున్నారు. ఇందులో ఆయన పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్‌ఐ ఏజెంట్‌గా కనిపించనున్నారని సమాచారం. సల్మాన్‌.. ఇండియాకు చెందిన 'రా' ఏజెంట్‌గా చేస్తున్నారు.

అయితే ఇమ్రాన్‌ గతంలో ఎన్నడూ కనిపించని గెటప్​తో ఇందులో నటించినున్నారట. అయితే వచ్చే నెలలో చిత్రీకరణను తిరిగి ప్రారంభించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాల కోసం విదేశాల్లో షూటింగ్​ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారట. ఇప్పటికే షూటింగ్‌ ప్రారంభమైనా, కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ కారణంగా మధ్యలోనే ఆగిపోయింది.

మరోవైపు కత్రినా కైఫ్​ కూడా ఐఎస్ఐ ఏజెంట్ జోయగా నటిస్తోంది. ఆమె పాత్ర గురించి మరిన్ని వివరాలు తెలియాలంటే వేచి చూడాల్సిందే. యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రీతమ్‌ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. 'రా' ఏజెంట్‌ బ్యాక్‌డ్రాప్‌తో సుమారు రూ.350 కోట్ల బడ్జెట్‌తో సినిమా తెరకెక్కిస్తున్నారు. గతంలో వచ్చిన 'ఏక్‌ థా టైగర్‌', 'టైగర్‌ జిందాహై'కి ఈ సినిమా సీక్వెల్‌.

ఇదిలా ఉంటే ఇమ్రాన్‌, అమితాబ్‌ బచ్చన్‌తో కలిసి నటించిన చిత్రం 'చెహ్రే' విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో అమితాబ్‌ న్యాయవాది వీర్‌ పాత్రలో నటించగా, ఇమ్రాన్‌ వ్యాపారవేత్త కరణ్‌ ఒబెరాయ్‌గా కనిపించనున్నారు. మిస్టరీ థ్రిల్లర్‌ నేపథ్యంగా తెరకెక్కిన ఈ చిత్రానికి రూమీ జాఫరీ దర్శకత్వం వహించారు.

ఇదీ చూడండి.. లంగాఓణీ అందాలతో 'దబాంగ్​' బ్యూటీ

సల్మాన్‌ ఖాన్‌, కత్రినా కైఫ్‌ కలిసి నటిస్తున్న చిత్రం 'టైగర్‌ 3'. మనీశ్​ శర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా ఇమ్రాన్‌ హష్మీ నటిస్తున్నారు. ఇందులో ఆయన పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్‌ఐ ఏజెంట్‌గా కనిపించనున్నారని సమాచారం. సల్మాన్‌.. ఇండియాకు చెందిన 'రా' ఏజెంట్‌గా చేస్తున్నారు.

అయితే ఇమ్రాన్‌ గతంలో ఎన్నడూ కనిపించని గెటప్​తో ఇందులో నటించినున్నారట. అయితే వచ్చే నెలలో చిత్రీకరణను తిరిగి ప్రారంభించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాల కోసం విదేశాల్లో షూటింగ్​ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారట. ఇప్పటికే షూటింగ్‌ ప్రారంభమైనా, కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ కారణంగా మధ్యలోనే ఆగిపోయింది.

మరోవైపు కత్రినా కైఫ్​ కూడా ఐఎస్ఐ ఏజెంట్ జోయగా నటిస్తోంది. ఆమె పాత్ర గురించి మరిన్ని వివరాలు తెలియాలంటే వేచి చూడాల్సిందే. యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రీతమ్‌ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. 'రా' ఏజెంట్‌ బ్యాక్‌డ్రాప్‌తో సుమారు రూ.350 కోట్ల బడ్జెట్‌తో సినిమా తెరకెక్కిస్తున్నారు. గతంలో వచ్చిన 'ఏక్‌ థా టైగర్‌', 'టైగర్‌ జిందాహై'కి ఈ సినిమా సీక్వెల్‌.

ఇదిలా ఉంటే ఇమ్రాన్‌, అమితాబ్‌ బచ్చన్‌తో కలిసి నటించిన చిత్రం 'చెహ్రే' విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో అమితాబ్‌ న్యాయవాది వీర్‌ పాత్రలో నటించగా, ఇమ్రాన్‌ వ్యాపారవేత్త కరణ్‌ ఒబెరాయ్‌గా కనిపించనున్నారు. మిస్టరీ థ్రిల్లర్‌ నేపథ్యంగా తెరకెక్కిన ఈ చిత్రానికి రూమీ జాఫరీ దర్శకత్వం వహించారు.

ఇదీ చూడండి.. లంగాఓణీ అందాలతో 'దబాంగ్​' బ్యూటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.