బోయపాటి శ్రీను దర్శకత్వంలో హీరో బాలకృష్ణ(Balakrishna) నటిస్తున్న సినిమా 'అఖండ'. ఇందులో ప్రతినాయకుడి పాత్రలో నటుడు శ్రీకాంత్(Srikanth) కనిపించనున్నారు. అయితే విలన్ పాత్రలు చేయోద్దని శ్రీకాంత్కు తాను సూచించినట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు బాలయ్య.
"ప్రతినాయకుడి పాత్రలపైనే పూర్తిగా దృష్టి పెట్టాలనుకుంటున్నట్లు ఓ సందర్భంలో శ్రీకాంత్ చెప్పాడు. అప్పుడు అతడికి ఓ స్వీట్ వార్నింగ్ ఇచ్చాను. పూర్తిస్థాయిలో విలన్ పాత్రల్లో నటించవద్దని, ప్రధాన పాత్రలు మాత్రమే పోషించాలని చెప్పాను. అవసరమైతే కొన్ని మంచి కథలు, పాత్రలు కూడా సూచిస్తానని చెప్పాను" అని బాలయ్య అన్నారు.
ఇదీ చూడండి: 'ఆదిత్య 369' సీక్వెల్తో మోక్షజ్ఞ ఎంట్రీ