ETV Bharat / sitara

'వేధింపులు తట్టుకోలేక ట్విట్టర్​కు గుడ్​బై'

ప్రముఖ బాలీవుడ్​ దర్శకుడు అనురాగ్​ కశ్యప్​ మరోసారి వార్తల్లో నిలిచాడు. తన కుటుంబానికి ప్రాణహాని ఉందని పేర్కొంటూ కొన్ని ట్వీట్లు చేశాడు. అనంతరం ట్విట్టర్​ నుంచి వైదొలిగాడు.

author img

By

Published : Aug 11, 2019, 8:58 AM IST

'వేధింపులు తట్టుకోలేక ట్విట్టర్​కు గుడ్​బై'

బాలీవుడ్​ దర్శకుడు అనురాగ్​ కశ్యప్​ తన ట్విట్టర్​ ఖాతాను తొలగించాడు. "భయంలేకుండా మాట్లాడే స్వేచ్ఛ లేనప్పుడు అసలు మాట్లాడకుండా ఉండటమే మంచిది" అని చివరిగా సందేశం పోస్ట్​ చేశాడు. ఇటీవల తన కుటుంబానికి ప్రాణహాని ఉందని ప్రధాని నరేంద్ర మోదీకి ట్వీట్​ చేయడం సంచలనమైంది. మరోసారి ఇదే అంశాన్ని తెరపైకి తెస్తూ సోషల్​ మీడియా ఖాతా నుంచి వైదొలిగాడు.

" తల్లిదండ్రులకు బెదిరింపులు, కూతురికి అంతర్జాలం వేదికగా ఇబ్బందులు వస్తుంటే ఎవరూ మాట్లాడాలని అనుకోరు. ఇదంతా ఏ కారణంతో ఎవరు చేస్తున్నారో తెలియదు. కొందరు దుండగులు ఇలాంటి పద్ధతిని ఎంచుకొని రాజ్యమేలుతున్నారు. ఈ నవభారతంలో ఉన్న అందరికి అభినందనలు. ప్రతి ఒక్కరికి సంతోషం, విజయం చేకూరాలని కోరుకుంటున్నా. ఇదే నా చివరి ట్వీట్​ ఎందుకంటే నేను ట్విట్టర్​ నుంచి వైదొలుగుతున్నాను. ఎటువంటి భయం లేకుండా నా భావాలు వ్యక్తపరిచే స్వేచ్ఛలేనపుడు... మాట్లాడినా ఉపయోగం లేదు. గుడ్​బై "

-- అనురాగ్​ కశ్యప్​, బాలీవుడ్​ దర్శకుడు

anurag quits from twitter
ట్విట్టర్​ నుంచి వైదొలగిన అనురాగ్​

సామాజిక మాధ్యమాల వేదికగా తనదైన అభిప్రాయాలు చెప్పడం ద్వారా బాగా పేరుతెచ్చుకున్నాడు అనురాగ్​. సామాజిక అంశాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తుంటాడు. ఇటీవల కొన్ని చోట్ల జరిగిన మూక దాడులను ప్రస్తావిస్తూ 49 మంది ప్రముఖులు ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఇందులో కశ్యప్​ ఒకడు.

తన అభిప్రాయాలు పడని కొందరు అంతర్జాలం ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారని గతంలోనూ ట్విట్టర్లో సందేశాలు పంచుకున్నాడీ హిందీ దర్శకుడు. జులైలో మోదీ లోక్​సభ ఎన్నికల్లో విజయం తర్వాత అభినందనలు తెలిపిన ఈ దర్శకుడు.. కొందరి నుంచి తన కుటుంబానికి ముప్పు ఉన్నట్లు పేర్కొన్నాడు.

ప్రస్తుతం అనరాగ్ కశ్యప్​... తాప్సీ, భూమి పడ్నేకర్​తో కలిసి 'సాంద్​ కీ ఆంఖ్​'​ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ ఏడాది దీపావళి కానుకగా ప్రేక్షకుల్ని పలకరించనుందీ బయోపిక్​.

ఇవీచూడండి...'మోదీ మీరే చెప్పండి... ఎలా ఎదుర్కోవాలో​'

బాలీవుడ్​ దర్శకుడు అనురాగ్​ కశ్యప్​ తన ట్విట్టర్​ ఖాతాను తొలగించాడు. "భయంలేకుండా మాట్లాడే స్వేచ్ఛ లేనప్పుడు అసలు మాట్లాడకుండా ఉండటమే మంచిది" అని చివరిగా సందేశం పోస్ట్​ చేశాడు. ఇటీవల తన కుటుంబానికి ప్రాణహాని ఉందని ప్రధాని నరేంద్ర మోదీకి ట్వీట్​ చేయడం సంచలనమైంది. మరోసారి ఇదే అంశాన్ని తెరపైకి తెస్తూ సోషల్​ మీడియా ఖాతా నుంచి వైదొలిగాడు.

" తల్లిదండ్రులకు బెదిరింపులు, కూతురికి అంతర్జాలం వేదికగా ఇబ్బందులు వస్తుంటే ఎవరూ మాట్లాడాలని అనుకోరు. ఇదంతా ఏ కారణంతో ఎవరు చేస్తున్నారో తెలియదు. కొందరు దుండగులు ఇలాంటి పద్ధతిని ఎంచుకొని రాజ్యమేలుతున్నారు. ఈ నవభారతంలో ఉన్న అందరికి అభినందనలు. ప్రతి ఒక్కరికి సంతోషం, విజయం చేకూరాలని కోరుకుంటున్నా. ఇదే నా చివరి ట్వీట్​ ఎందుకంటే నేను ట్విట్టర్​ నుంచి వైదొలుగుతున్నాను. ఎటువంటి భయం లేకుండా నా భావాలు వ్యక్తపరిచే స్వేచ్ఛలేనపుడు... మాట్లాడినా ఉపయోగం లేదు. గుడ్​బై "

-- అనురాగ్​ కశ్యప్​, బాలీవుడ్​ దర్శకుడు

anurag quits from twitter
ట్విట్టర్​ నుంచి వైదొలగిన అనురాగ్​

సామాజిక మాధ్యమాల వేదికగా తనదైన అభిప్రాయాలు చెప్పడం ద్వారా బాగా పేరుతెచ్చుకున్నాడు అనురాగ్​. సామాజిక అంశాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తుంటాడు. ఇటీవల కొన్ని చోట్ల జరిగిన మూక దాడులను ప్రస్తావిస్తూ 49 మంది ప్రముఖులు ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఇందులో కశ్యప్​ ఒకడు.

తన అభిప్రాయాలు పడని కొందరు అంతర్జాలం ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారని గతంలోనూ ట్విట్టర్లో సందేశాలు పంచుకున్నాడీ హిందీ దర్శకుడు. జులైలో మోదీ లోక్​సభ ఎన్నికల్లో విజయం తర్వాత అభినందనలు తెలిపిన ఈ దర్శకుడు.. కొందరి నుంచి తన కుటుంబానికి ముప్పు ఉన్నట్లు పేర్కొన్నాడు.

ప్రస్తుతం అనరాగ్ కశ్యప్​... తాప్సీ, భూమి పడ్నేకర్​తో కలిసి 'సాంద్​ కీ ఆంఖ్​'​ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ ఏడాది దీపావళి కానుకగా ప్రేక్షకుల్ని పలకరించనుందీ బయోపిక్​.

ఇవీచూడండి...'మోదీ మీరే చెప్పండి... ఎలా ఎదుర్కోవాలో​'

AP Video Delivery Log - 0200 GMT News
Sunday, 11 August, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0152: Venezuela Sanctions 2 AP Clients Only 4224563
Maduro signs letter protesting US sanctions
AP-APTN-0132: Venezuela Sanctions AP Clients Only 4224562
Thousands join Maduro at 'No More Trump' rally
AP-APTN-0101: UN Libya Envoy AP Clients Only 4224561
Libya UN envoy condemns deadly Benghazi bombing
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.