ETV Bharat / sitara

'సీబీఐకి సుశాంత్ కేసు.. అంకిత సంతోషం'

author img

By

Published : Aug 5, 2020, 5:20 PM IST

సుశాంత్​ కేసును సీబీఐకి అప్పగించడం ఎంతో సంతోషంగా ఉందని నటి అంకిత లోఖండే తెలిపింది. బుధవారం బిహార్​ ప్రభుత్వం సిఫార్సు మేరకు కేంద్రం సీబీఐ దర్యాప్తునకు అంగీకరించింది.

Ankita Lokhande
సుశాంత్​

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసుపై సీబీఐ విచారణకు కేంద్రం అంగీకరించడం పట్ల నటి అంకితా లోఖండే సంతోషం వ్యక్తం చేసింది. ఎప్పటి నుంచో ఈ క్షణం కోసం ఎదురు చూస్తున్నట్లు ట్విట్టర్​ వేదికగా తెలిపింది.

బిహార్​ ప్రభుత్వం చేసిన సిఫార్సు మేరకు.. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు సాలిసిటర్​ జనరల్​ తుషార్​ మెహతా బుధవారం సుప్రీంకోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో జస్టిస్ హృషికేశ్ రాయ్ ధర్మాసనం నటుడి మరణం వెనుకున్న నిజం బయటకు రావాలని అభిప్రాయపడింది.

ఈ కేసులో దర్యాప్తునకు సంబంధించిన అన్ని రికార్డులను సమర్పించాలని ముంబయి పోలీసులకు అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ విషయంపై వచ్చే వారం విచారణ చేయనున్నట్లు జస్టిస్​ రాయ్​ పేర్కొన్నారు. అంతకంటే ముందు ముంబయి పోలీసులు ఇప్పటి వరకు ఏం చేశారో తెలుసుకోవాలనుకుంటున్నట్లు తెలిపారు.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసుపై సీబీఐ విచారణకు కేంద్రం అంగీకరించడం పట్ల నటి అంకితా లోఖండే సంతోషం వ్యక్తం చేసింది. ఎప్పటి నుంచో ఈ క్షణం కోసం ఎదురు చూస్తున్నట్లు ట్విట్టర్​ వేదికగా తెలిపింది.

బిహార్​ ప్రభుత్వం చేసిన సిఫార్సు మేరకు.. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు సాలిసిటర్​ జనరల్​ తుషార్​ మెహతా బుధవారం సుప్రీంకోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో జస్టిస్ హృషికేశ్ రాయ్ ధర్మాసనం నటుడి మరణం వెనుకున్న నిజం బయటకు రావాలని అభిప్రాయపడింది.

ఈ కేసులో దర్యాప్తునకు సంబంధించిన అన్ని రికార్డులను సమర్పించాలని ముంబయి పోలీసులకు అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ విషయంపై వచ్చే వారం విచారణ చేయనున్నట్లు జస్టిస్​ రాయ్​ పేర్కొన్నారు. అంతకంటే ముందు ముంబయి పోలీసులు ఇప్పటి వరకు ఏం చేశారో తెలుసుకోవాలనుకుంటున్నట్లు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.