ETV Bharat / sitara

కరోనా సంరక్షణ కేంద్రానికి అమితాబ్​ రూ.2 కోట్ల సాయం

author img

By

Published : May 10, 2021, 9:32 AM IST

కరోనాపై పోరాటంలో తన వంతు సాయాన్ని అందించేందుకు ముందుకొచ్చారు బాలీవుడ్​ మెగాస్టార్ అమితాబ్​ బచ్చన్​. దిల్లీలోని రాకబ్​ గంజ్​ గురుద్వారాను కరోనా సంరక్షణ కేంద్రంగా మార్చిన నేపథ్యంలో దానికి రూ.2 కోట్లను విరాళంగా ప్రకటించారు. త్వరలోనే ఆక్సిజన్​ కాన్సట్రేటర్లను అందుబాటులో తీసుకొస్తానని ఆయన హామీ ఇచ్చారు.

Amitabh Bachchan Gave 2 Crore Rupees For Covid Centre: Delhi Gurdwara Body
కరోనా సంరక్షణ కేంద్రానికి అమితాబ్​ రూ.2 కోట్ల సాయం

దేశవ్యాప్తంగా కరోనా తాండవిస్తున్న వేళ ఎంతోమంది ప్రముఖులు తమ వంతుగా సాయన్ని అందించేందుకు ముందుకొస్తున్నారు. ఈ జాబితాలో ఇప్పుడు బాలీవుడ్​ మెగాస్టార్​ అమితాబ్​ బచ్చన్​ చేరారు. దిల్లీలోని రాకబ్​ గంజ్​ గురుద్వారాను కరోనా సంరక్షణా కేంద్రంగా మార్చిన సందర్భంగా.. ఏర్పాట్ల కోసం రూ.2 కోట్లను విరాళంగా ప్రకటించారు అమితాబ్​. ఈ విషయాన్ని ఆ గురుద్వారా నిర్వాహాక అధ్యక్షుడు మజిందర్​ సింగ్​ వెల్లడించారు.

రాకబ్​గంజ్​లో ఏర్పాటు చేసిన కరోనా సంరక్షణ కేంద్రం సోమవారం ప్రారంభంకానుంది. 300 పడకలతో ఇందులో ఏర్పాటు చేశారు. దిల్లీలో ఆక్సిజన్​ కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో అమితాబ్​ తనకు ప్రతిరోజూ ఫోన్​ చేసి పరిస్థితుల గురించి తెలుసుకునేవారని నిర్వాహకుడు మజిందర్​ తెలిపారు. అలాగే కొవిడ్​ కేంద్ర నిర్మాణ పనుల గురించి అడిగేవారని పేర్కొన్నారు. త్వరలోనే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందుబాటులోకి తీసుకొస్తానని అమితాబ్​ హామీ ఇచ్చారని ఆయన వెల్లడించారు.

ఇదీ చూడండి: అందాల రాక్షసివే.. గుండెల్లో గుచ్చావే!

దేశవ్యాప్తంగా కరోనా తాండవిస్తున్న వేళ ఎంతోమంది ప్రముఖులు తమ వంతుగా సాయన్ని అందించేందుకు ముందుకొస్తున్నారు. ఈ జాబితాలో ఇప్పుడు బాలీవుడ్​ మెగాస్టార్​ అమితాబ్​ బచ్చన్​ చేరారు. దిల్లీలోని రాకబ్​ గంజ్​ గురుద్వారాను కరోనా సంరక్షణా కేంద్రంగా మార్చిన సందర్భంగా.. ఏర్పాట్ల కోసం రూ.2 కోట్లను విరాళంగా ప్రకటించారు అమితాబ్​. ఈ విషయాన్ని ఆ గురుద్వారా నిర్వాహాక అధ్యక్షుడు మజిందర్​ సింగ్​ వెల్లడించారు.

రాకబ్​గంజ్​లో ఏర్పాటు చేసిన కరోనా సంరక్షణ కేంద్రం సోమవారం ప్రారంభంకానుంది. 300 పడకలతో ఇందులో ఏర్పాటు చేశారు. దిల్లీలో ఆక్సిజన్​ కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో అమితాబ్​ తనకు ప్రతిరోజూ ఫోన్​ చేసి పరిస్థితుల గురించి తెలుసుకునేవారని నిర్వాహకుడు మజిందర్​ తెలిపారు. అలాగే కొవిడ్​ కేంద్ర నిర్మాణ పనుల గురించి అడిగేవారని పేర్కొన్నారు. త్వరలోనే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందుబాటులోకి తీసుకొస్తానని అమితాబ్​ హామీ ఇచ్చారని ఆయన వెల్లడించారు.

ఇదీ చూడండి: అందాల రాక్షసివే.. గుండెల్లో గుచ్చావే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.