ETV Bharat / sitara

హైదరాబాద్‌ టు చెన్నై.. అజిత్‌ బైక్‌ రైడింగ్‌

తమిళ స్టార్ హీరో అజిత్​ హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా చెన్నైకి చేరుకున్నారట. బైక్ రైడింగ్​పై ఉన్న మక్కువతో ఇలా చేశారు. 'వాలిమై' షూటింగ్ సమయంలో ఇది జరిగింది. తాజాగా దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

author img

By

Published : Apr 21, 2020, 10:13 AM IST

అజిత్
అజిత్

తమిళ స్టార్‌ అజిత్‌కు బైక్‌ రైడింగ్‌ అంటే చాలా ఇష్టం. ఇప్పటికే ఆయన అనేక బైక్‌ రేసుల్లో పాల్గొని అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్నారు. బైక్‌ రైడింగ్‌పై ఉన్న మక్కువతో అజిత్‌ హైదరాబాద్‌ నుంచి చెన్నైకి ఒంటరిగా ప్రయాణం చేశారట. దాదాపు 650 కిలో మీటర్లు రోడ్డుపై ప్రయాణించి.. కేవలం ఆహారం, పెట్రోల్‌ కోసం మాత్రం దుకాణాల వద్ద ఆగారని 'వాలిమై' చిత్రబృందం తాజాగా తెలిపింది.

కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌లో 'వాలిమై' సినిమా షూటింగ్‌ జరిగింది. చిత్రంలోని బైక్‌ ఛేజింగ్‌ సన్నివేశాన్ని తెరకెక్కించారు. అజిత్‌ పవర్‌ఫుల్‌ పోలీసు అధికారిగా నటిస్తున్న నేపథ్యంలో ఆయన కోసం ప్రత్యేకంగా బైక్‌ను డిజైన్‌ చేయించారు. ఆ బైక్ అజిత్‌కు ఎంతో నచ్చిందట. సినిమా షెడ్యూల్‌ పూర్తి చేసుకుని అందరూ ఇంటికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అప్పుడు తన విమానం టికెట్టును రద్దు చేయమని అజిత్‌ అసిస్టెంట్‌కు చెప్పారట. బైక్‌పై ఒంటరిగా చెన్నైకి వస్తానని అన్నారు. దీంతో అసిస్టెంట్‌ విమానంలో చెన్నైకి రాగా.. అజిత్‌ 650 కిలో మీటర్లు బైక్‌పై ప్రయాణించి చెన్నై చేరుకున్నారని చిత్రబృందం తెలిపింది. ఇప్పుడు ఈ విషయం బయటికి రావడం వల్ల అందరూ ఆశ్చర్యపోతున్నారు. అజిత్‌ ఫొటోలు కూడా వైరల్‌ అవుతున్నాయి.

'వాలిమై' సినిమాకు హెచ్‌.వినోద్‌ దర్శకత్వం వహిస్తున్నారు. బోనీ కపూర్‌ నిర్మాత. యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందిస్తున్నారు. బాలీవుడ్‌ నటి హ్యుమా ఖురేషీ కథానాయికగా నటిస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా చిత్రం షూటింగ్‌ను వాయిదా వేశారు. నవంబరులో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

తమిళ స్టార్‌ అజిత్‌కు బైక్‌ రైడింగ్‌ అంటే చాలా ఇష్టం. ఇప్పటికే ఆయన అనేక బైక్‌ రేసుల్లో పాల్గొని అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్నారు. బైక్‌ రైడింగ్‌పై ఉన్న మక్కువతో అజిత్‌ హైదరాబాద్‌ నుంచి చెన్నైకి ఒంటరిగా ప్రయాణం చేశారట. దాదాపు 650 కిలో మీటర్లు రోడ్డుపై ప్రయాణించి.. కేవలం ఆహారం, పెట్రోల్‌ కోసం మాత్రం దుకాణాల వద్ద ఆగారని 'వాలిమై' చిత్రబృందం తాజాగా తెలిపింది.

కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌లో 'వాలిమై' సినిమా షూటింగ్‌ జరిగింది. చిత్రంలోని బైక్‌ ఛేజింగ్‌ సన్నివేశాన్ని తెరకెక్కించారు. అజిత్‌ పవర్‌ఫుల్‌ పోలీసు అధికారిగా నటిస్తున్న నేపథ్యంలో ఆయన కోసం ప్రత్యేకంగా బైక్‌ను డిజైన్‌ చేయించారు. ఆ బైక్ అజిత్‌కు ఎంతో నచ్చిందట. సినిమా షెడ్యూల్‌ పూర్తి చేసుకుని అందరూ ఇంటికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అప్పుడు తన విమానం టికెట్టును రద్దు చేయమని అజిత్‌ అసిస్టెంట్‌కు చెప్పారట. బైక్‌పై ఒంటరిగా చెన్నైకి వస్తానని అన్నారు. దీంతో అసిస్టెంట్‌ విమానంలో చెన్నైకి రాగా.. అజిత్‌ 650 కిలో మీటర్లు బైక్‌పై ప్రయాణించి చెన్నై చేరుకున్నారని చిత్రబృందం తెలిపింది. ఇప్పుడు ఈ విషయం బయటికి రావడం వల్ల అందరూ ఆశ్చర్యపోతున్నారు. అజిత్‌ ఫొటోలు కూడా వైరల్‌ అవుతున్నాయి.

'వాలిమై' సినిమాకు హెచ్‌.వినోద్‌ దర్శకత్వం వహిస్తున్నారు. బోనీ కపూర్‌ నిర్మాత. యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందిస్తున్నారు. బాలీవుడ్‌ నటి హ్యుమా ఖురేషీ కథానాయికగా నటిస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా చిత్రం షూటింగ్‌ను వాయిదా వేశారు. నవంబరులో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.