ETV Bharat / sitara

నిఖిల్ 'కార్తికేయ 2'లో స్వాతి!

author img

By

Published : Apr 21, 2020, 4:18 PM IST

నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కి విజయాన్నందుకున్న చిత్రం 'కార్తికేయ'. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కబోతుంది. 'కార్తికేయ'లో హీరోయిన్​గా నటించిన స్వాతి ఈ సినిమాలో ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనుందని సమాచారం.

స్వాతి
స్వాతి

'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే!'లో త్రిష చెల్లిగా, వెంకటేశ్​ని ప్రేమిస్తున్న వన్‌సైడ్‌ లవర్‌గా, అమాయకమైన పాత్రలో నటించి ఆకట్టుకుంది కలర్స్‌ స్వాతి. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో కథానాయికగాను నటించి మెప్పించింది. అందులో ఒకటి 'కార్తికేయ'. ఈ సినిమా మంచి ఫలితాన్నే రాబట్టింది. తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్‌గా 'కార్తికేయ 2' చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో స్వాతి ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనుందని సమాచారం.

ఇప్పటికే ఈ చిత్రంలో ప్రధాన కథానాయికగా అనుపమ పరమేశ్వరన్‌ని తీసుకున్నారని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాలభైరవ సంగీతం అందిస్తున్నాడు. స్వాతి 2017లో వచ్చిన 'లండన్‌ బాబులు' చిత్రం తర్వాత మళ్లీ ఇప్పటి వరకు తెలుగు తెరపై కనిపించలేదు.

'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే!'లో త్రిష చెల్లిగా, వెంకటేశ్​ని ప్రేమిస్తున్న వన్‌సైడ్‌ లవర్‌గా, అమాయకమైన పాత్రలో నటించి ఆకట్టుకుంది కలర్స్‌ స్వాతి. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో కథానాయికగాను నటించి మెప్పించింది. అందులో ఒకటి 'కార్తికేయ'. ఈ సినిమా మంచి ఫలితాన్నే రాబట్టింది. తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్‌గా 'కార్తికేయ 2' చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో స్వాతి ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనుందని సమాచారం.

ఇప్పటికే ఈ చిత్రంలో ప్రధాన కథానాయికగా అనుపమ పరమేశ్వరన్‌ని తీసుకున్నారని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాలభైరవ సంగీతం అందిస్తున్నాడు. స్వాతి 2017లో వచ్చిన 'లండన్‌ బాబులు' చిత్రం తర్వాత మళ్లీ ఇప్పటి వరకు తెలుగు తెరపై కనిపించలేదు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.