బాలీవుడ్ నటి సుస్మితా సేన్.. దాదాపు పదేళ్ల విరామం తర్వాత మళ్లీ నటించింది. 'ఆర్య' వెబ్ సిరీస్తో ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇందులోని నటనకుగాను ఆమెపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఓ అభిమాని సుస్మితాకు స్వయంగా ఓ ప్రేమలేఖను రాసి పంపించాడు. దానిని ఇన్స్టాలో పోస్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. అద్భుతమైన లవ్లెటర్ ఇదని పేర్కొంది. జీవితకాలం గుర్తుండిపోతుందని తెలిపింది.
"అద్భుతమైన లవ్లెటర్. గత కొన్నేళ్ల నుంచి అభిమానుల ఆత్మీయత నాకు దక్కడం నిజంగా అదృష్టం. స్వయంగా రాసిన లేఖలు అంటే నాకు చాలా ఇష్టం. అలానే మీరు నాకు పంపే ప్రతి లెటర్ను చదువుతాను. అయితే తొలిసారి చాలా సింపుల్గా రాసిన ప్రేమలేఖను ఓ అభిమాని పంపారు. దీనిని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. ఐ లవ్ యూ టూ!!!" అని ఇన్స్టాలో సుస్మితాసేన్ రాసుకొచ్చింది.
ఇవీ చదవండి: