ETV Bharat / sitara

నేను పరిచయం చేసిన దర్శకులే నా ఆస్తి: శ్రీ విష్ణు

ఖాళీ చేతులతో పరిశ్రమలో అడుగుపెట్టానని, ఇప్పుడు కోట్ల రూపాయలకంటే విలువైన ఆస్తి తన వద్ద ఉందని చెప్పారు హీరో శ్రీ విష్ణు. తన పరిచయం చేసిన దర్శకులే తన ఆస్తి అని తెలిపారు. ఇక తాను మాస్ సినిమాలకు పనికొస్తానో రానో డిసెంబర్​ 31న చెప్పాలని అన్నారు.

author img

By

Published : Dec 30, 2021, 9:53 AM IST

sree vishnu
శ్రీ విష్ణు

తెలుగు చలన చిత్ర పరిశ్రమలోకి ఖాళీ చేతులతో వచ్చానని, ఇప్పుడు రూ.కోట్లకు మించిన ఆస్తిని సంపాదించానని నటుడు శ్రీవిష్ణు అన్నారు. 'అర్జున ఫల్గుణ' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఆయన మాట్లాడారు. శ్రీ విష్ణు హీరోగా దర్శకుడు తేజ మర్ని తెరకెక్కించిన చిత్రమిది. అమృత అయ్యర్‌ కథానాయిక. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 31న విడుదలకానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రీ రిలీజ్‌ వేడుకను నిర్వహించింది.

sree vishnu
'అర్జున ఫల్గుణ' ప్రీ రిలీజ్‌ ఈవెంట్

"ఈ సినిమా ఇంత అద్భుతంగా తెరకెక్కడానికి కారణం నిర్మాతలు. వారు నటులకు ఎంతో ఫ్రీడం ఇచ్చారు. దర్శకుడు తేజ చాలా ప్రతిభావంతుడు. అతడిని సెట్‌లో చూసిన తొలిరోజు భయపడ్డా. ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్‌. దాదాపు చిత్రీకరణ మొత్తం గోదావరి జిల్లాలోనే సాగింది. 'ఇది మా గోదావరి జిల్లాల గొప్పతనం' అని సినిమా చూసిన గోదావరి జిల్లాల వారంతా కాలర్‌ ఎగరేసి చెప్పుకుంటారనే నమ్మకం ఉంది. నేను ఈ సినిమాలో జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానిగా కనిపిస్తా. 'మాస్‌ కథలు నీకు సెట్‌ కావురా. లవ్‌స్టోరీలు, కామెడీలాంటి వాటిల్లో నటించు' అని నా మిత్రులు సలహాలు ఇస్తుండేవారు. మాస్‌ చిత్రాలకు నేను పనికొస్తానో లేదో డిసెంబరు 31న చెప్పండి"

- శ్రీ విష్ణు, నటుడు

"ఖాళీ చేతులతో నేనీ పరిశ్రమలో అడుగుపెట్టా. ఇప్పుడు కోట్ల రూపాయలకంటే విలువైన ఆస్తి ఉంది. నేను పరిచయం చేసిన దర్శకులే నా ఆస్తి" అని భావోద్వేగంతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అమృత అయ్యర్‌, దర్శకులు తేజ మర్ని, కిశోర్‌ తిరుమల, సాగర్‌ కె. చంద్ర, వెంకట్‌ మహా, నిర్మాత దిల్‌రాజు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: ఇప్పటికీ అలా చేయాలంటే సిగ్గు: శ్రీ విష్ణు

తెలుగు చలన చిత్ర పరిశ్రమలోకి ఖాళీ చేతులతో వచ్చానని, ఇప్పుడు రూ.కోట్లకు మించిన ఆస్తిని సంపాదించానని నటుడు శ్రీవిష్ణు అన్నారు. 'అర్జున ఫల్గుణ' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఆయన మాట్లాడారు. శ్రీ విష్ణు హీరోగా దర్శకుడు తేజ మర్ని తెరకెక్కించిన చిత్రమిది. అమృత అయ్యర్‌ కథానాయిక. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 31న విడుదలకానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రీ రిలీజ్‌ వేడుకను నిర్వహించింది.

sree vishnu
'అర్జున ఫల్గుణ' ప్రీ రిలీజ్‌ ఈవెంట్

"ఈ సినిమా ఇంత అద్భుతంగా తెరకెక్కడానికి కారణం నిర్మాతలు. వారు నటులకు ఎంతో ఫ్రీడం ఇచ్చారు. దర్శకుడు తేజ చాలా ప్రతిభావంతుడు. అతడిని సెట్‌లో చూసిన తొలిరోజు భయపడ్డా. ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్‌. దాదాపు చిత్రీకరణ మొత్తం గోదావరి జిల్లాలోనే సాగింది. 'ఇది మా గోదావరి జిల్లాల గొప్పతనం' అని సినిమా చూసిన గోదావరి జిల్లాల వారంతా కాలర్‌ ఎగరేసి చెప్పుకుంటారనే నమ్మకం ఉంది. నేను ఈ సినిమాలో జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానిగా కనిపిస్తా. 'మాస్‌ కథలు నీకు సెట్‌ కావురా. లవ్‌స్టోరీలు, కామెడీలాంటి వాటిల్లో నటించు' అని నా మిత్రులు సలహాలు ఇస్తుండేవారు. మాస్‌ చిత్రాలకు నేను పనికొస్తానో లేదో డిసెంబరు 31న చెప్పండి"

- శ్రీ విష్ణు, నటుడు

"ఖాళీ చేతులతో నేనీ పరిశ్రమలో అడుగుపెట్టా. ఇప్పుడు కోట్ల రూపాయలకంటే విలువైన ఆస్తి ఉంది. నేను పరిచయం చేసిన దర్శకులే నా ఆస్తి" అని భావోద్వేగంతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అమృత అయ్యర్‌, దర్శకులు తేజ మర్ని, కిశోర్‌ తిరుమల, సాగర్‌ కె. చంద్ర, వెంకట్‌ మహా, నిర్మాత దిల్‌రాజు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: ఇప్పటికీ అలా చేయాలంటే సిగ్గు: శ్రీ విష్ణు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.