ETV Bharat / science-and-technology

గ్రహశకలం నమూనాలతో భూమికి తిరుగు పయనం - బెన్నూ గ్రహశకలం

బెన్నూ అనే గ్రహశకలం నుంచి నమూనాలు సేకరించిన వ్యోమనౌక.. భూమికి తిరుగు ప్రయాణం మొదలుపెట్టింది. సుమారు 400 గ్రాముల ఆస్టరాయిడ్ నమూనాలతో రెండేళ్ల తర్వాత ఇది భూమికి చేరుకోనుంది.

NASA spacecraft begins 2-year trip home with asteroid rubble
ఆస్టరాయిడ్ నమూనాలతో భూమికి తిరుగు పయనం
author img

By

Published : May 11, 2021, 1:20 PM IST

అంతరిక్షంలోని గ్రహశకలం నుంచి నమూనాలు సేకరించిన వ్యోమనౌక 'ఒసైరిస్ రెక్స్'.. భూమికి తిరుగు ప్రయాణాన్ని ప్రారంభించింది. రెండేళ్లు ప్రయాణించిన తర్వాత ఇది భూమిని చేరుకోనుంది. బెన్నూ నుంచి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న సమయంలో.. వ్యోమనౌక ఇంజిన్లను మండించినట్లు నాసా తెలిపింది.

నాసా ప్రయోగించిన ఈ వ్యోమనౌక 2018లో 'బెన్నూ' అనే ఆస్టరాయిడ్​ను చేరుకుంది. రెండేళ్ల పాటు పరిభ్రమించిన తర్వాత బెన్నూపై దిగి నమూనాలను సేకరించింది. 60 గ్రాముల గ్రహశకల నమూనాలను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే సుమారు 200 నుంచి 400 గ్రాముల మేర నమూనాలను వ్యోమనౌక మోసుకొస్తోంది.

అంతరిక్షంలోని గ్రహశకలం నుంచి నమూనాలు సేకరించిన వ్యోమనౌక 'ఒసైరిస్ రెక్స్'.. భూమికి తిరుగు ప్రయాణాన్ని ప్రారంభించింది. రెండేళ్లు ప్రయాణించిన తర్వాత ఇది భూమిని చేరుకోనుంది. బెన్నూ నుంచి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న సమయంలో.. వ్యోమనౌక ఇంజిన్లను మండించినట్లు నాసా తెలిపింది.

నాసా ప్రయోగించిన ఈ వ్యోమనౌక 2018లో 'బెన్నూ' అనే ఆస్టరాయిడ్​ను చేరుకుంది. రెండేళ్ల పాటు పరిభ్రమించిన తర్వాత బెన్నూపై దిగి నమూనాలను సేకరించింది. 60 గ్రాముల గ్రహశకల నమూనాలను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే సుమారు 200 నుంచి 400 గ్రాముల మేర నమూనాలను వ్యోమనౌక మోసుకొస్తోంది.

ఇవీ చదవండి:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.