ETV Bharat / opinion

ఆర్థిక ప్యాకేజీలో ఏం ఇచ్చారు? ఏం మరిచారు?

author img

By

Published : May 26, 2020, 3:37 PM IST

రూ.20.97 లక్షల కోట్లు! కరోనా సంక్షోభం నుంచి ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకు మోదీ సర్కార్ ప్రకటించిన భారీ ప్యాకేజీ విలువ ఇది. వీధి వ్యాపారుల నుంచి కార్పొరేట్ల వరకు... ప్రతి వర్గాన్ని, రంగాన్ని ఆదుకునేలా ఈ ప్యాకేజీని రూపొందించినట్లు చెబుతోంది కేంద్రం. అందులో నిజమెంత? పేదలు, రైతులు, నిరుద్యోగుల సమస్యలు ఈ ఉద్దీపనతో పరిష్కారం అవుతాయా?

covid package
ఆర్థిక ప్యాకేజీ

కరోనా కారణంగా దేశంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితి నెలకొంది. ప్రపంచ దేశాలకు భిన్నంగా స్పందించిన భారత్... కఠినమైన లాక్​డౌన్​తో కరోనాపై యుద్ధాన్ని ప్రకటించింది. 130 కోట్ల మంది జనాభా ఉన్న దేశంలో చాలా మంది జీవనోపాధిపై దీని ప్రభావం పడింది.

చాలా అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే భారత్​లో కరోనా విజృంభణ తక్కువ స్థాయిలోనే ఉంది. అయితే ఆర్థిక పరంగా చాలా నష్టం వాటిల్లింది. ఉత్పత్తి, ఉద్యోగాలు, ఆదాయాలు భారీగా పడిపోయాయి. 2019లో 4.3 శాతం, 2018లో 6.8 శాతంగా ఉన్న దేశ ఆర్థిక వృద్ధి రేటు 2020లో 1.2శాతంగా ఉండనుందని ఐరాస అంచనా వేసింది.

సెంటర్​ ఫర్ మానిటరింగ్ ద ఇండియన్​ ఎకానమీ (సీఎంఐఈ) గణాంకాల ప్రకారం ఏప్రిల్​లో 11.4 కోట్ల మంది ఉపాధి కోల్పోయారు. వీరిలో 2.7 కోట్ల మంది 20- 30 మధ్య వయస్కులే కావటం గమనార్హం.

ప్యాకేజీలో లోపాలు?

కరోనా సంక్షోభం నుంచి బయటపడేందుకు కేంద్రం రూ.20.97 లక్షల కోట్లు ప్రకటించింది. ఇందులో రెండు అంశాలుగా డబ్బును దేశ ఆర్థిక వ్యవస్థలోకి చొప్పించనుంది. బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా నగదు లభ్యత ఉండేలా చూసుకోవటం వాటిలో ప్రధానమైంది. ఎంఎస్​ఎంఈలు, వీధి వ్యాపారులకు రుణాల అందజేతకు పూచీకత్తును ప్రభుత్వమే ఇస్తుంది.

వ్యవసాయం, పరిశ్రమ, వ్యాపార సౌలభ్యానికి సంబంధించిన కీలక సంస్కరణలకు ప్రభుత్వం సిద్ధమైంది. వ్యవసాయ మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టడం సహా ప్రభుత్వ రంగాల్లో ప్రైవేటు సంస్థలకు భాగస్వామ్యం కల్పించటమే లక్ష్యంగా పెటుకుంది.

దేశం స్వావలంబన దిశగా అడగులు వేసేలా రూపొందించిన ఈ ప్యాకేజీని చాలా మంది ఆర్థిక నిపుణలు స్వాగతించారు. ఈ సంస్కరణలు, నగదు లభ్యత చర్యలు కట్టుదిట్టంగా అమలు చేస్తే చాలా అంశాలను పరిష్కరించుకోగలమని అంటున్నారు.

వస్తు వినియోగం సంగతేంటి?

అయినప్పటికీ.. ఇందులో కొన్ని సమస్యలు ఉన్నాయి. అత్యంత ప్రధానమైనది వస్తు సేవల వినియోగ డిమాండ్​ పునరుద్ధరణకు చర్యలు తీసుకోలేదు. ఆర్థిక వృద్ధి తగ్గటం, నిరుద్యోగిత పెరగటానికి ప్రధాన కారణం వస్తు సేవలకు డిమాండ్ తగ్గటమే.

రెండోది... సరఫరా వ్యవస్థ పునరుద్ధరణ. కరోనా కారణంగా పూర్తిగా ధ్వంసమైన సరఫరా వ్యవస్థను తిరిగి గాడిన పెడితేనే వస్తు వినియోగం పెరిగే అవకాశం ఉంటుంది. ఫలితంగా ఆదాయం పెరుగుతుంది.

తిరిగి అక్కడికే..

లాక్​డౌన్ కారణంగా ఉద్యోగాలు పోయాయి. జీతాలూ తగ్గాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ సాయం లేనిదే వినియోగదారుడు వ్యయాన్ని భరించలేడు. మరోవైపు, రిటైల్ నుంచి కార్పొరేట్ల వరకు అన్ని వ్యాపారాలకు ప్రస్తుత ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా నిర్ణీత ఖర్చులు ఉంటాయి. ఇది వ్యాపారాల పునరుద్ధరణపై మరింత ఒత్తిడి పెంచుతుంది. కానీ రాయితీలతో ప్రత్యక్ష సాయం కన్నా రుణాలు అందివ్వటంపైనే ప్యాకేజీ అధికంగా దృష్టి సారించింది.

వస్తు, సేవల వినియోగం పాతాళానికి చేరిన సమయంలో.. ఆర్థిక వ్యవస్థలో వినియోగ డిమాండ్​ మెరుగుదలపైనే రుణాల అందజేత ఆధారపడి ఉంటుంది. ఫలితంగా డిమాండ్ పెంచేందుకు మళ్లీ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది.

మరింత ముందుకు..

వినియోగ డిమాండ్‌ను పునరుద్ధరించడానికి ఆర్థిక ఉద్దీపన చర్యల్లో భాగంగా కొన్ని ప్రతిపాదనలు ఉన్నాయి. ప్రజల ఖర్చును పెరిగేలా చూడాలి. ఫలితంగా నిరుద్యోగులకు పని లభిస్తుంది. రైతులకు ముందస్తు రాయితీలు అందివ్వాలి. ఉత్పాదకత ఆధారంగా చిన్న మధ్యతరహా పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందించాలి.

ఆదాయం పెరిగితే ఖర్చు కూడా..

దీనికి సమాంతరంగా పేదలు, సంక్షోభ పరిస్థితుల్లో ఉన్న వారికి నగదు బదిలీ మొత్తాన్ని పెంచాలి. ఫలితంగా వాళ్లు రోజువారీ అవసరాలకు కొనుక్కోగలరు. ఫలితంగా వినియోగ డిమాండ్ పెరుగుతుంది.

వ్యవసాయం, ఎంఎస్ఎంఈ రంగాల్లో 80 శాతం శ్రామిక శక్తి ఉంది. ఉద్దీపన చర్యల్లో వీటిపైన అధిక దృష్టి సారిస్తేనే ఈ కీలక రంగాల్లో ఉద్యోగ అవకాశాలు మరింతగా పెరుగుతాయి. ఫలితంగా ఆదాయాలు పెరిగి.. మళ్లీ వినియోగం మెరుగవుతుంది.

ఈ రంగాలకు ఆర్థికంగా చేయూతను ఇచ్చేలా చర్యలు చేపడితే ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది. ఆర్థిక ద్రవ్యలోటు సమస్యను ఇది అధిగమిస్తుంది. కానీ దేశ ప్రజల ప్రాణాలు, జీవనోపాధి కన్నా పెద్ద విషయం మరొకటి లేదు.

(రచయిత- డాక్టర్​ మహేంద్ర బాబు కురువ, హెచ్​ఎన్​బీ గఢ్​వాల్​ కేంద్ర విశ్వవిద్యాలయంలో సహాయ ఆచార్యులు)

కరోనా కారణంగా దేశంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితి నెలకొంది. ప్రపంచ దేశాలకు భిన్నంగా స్పందించిన భారత్... కఠినమైన లాక్​డౌన్​తో కరోనాపై యుద్ధాన్ని ప్రకటించింది. 130 కోట్ల మంది జనాభా ఉన్న దేశంలో చాలా మంది జీవనోపాధిపై దీని ప్రభావం పడింది.

చాలా అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే భారత్​లో కరోనా విజృంభణ తక్కువ స్థాయిలోనే ఉంది. అయితే ఆర్థిక పరంగా చాలా నష్టం వాటిల్లింది. ఉత్పత్తి, ఉద్యోగాలు, ఆదాయాలు భారీగా పడిపోయాయి. 2019లో 4.3 శాతం, 2018లో 6.8 శాతంగా ఉన్న దేశ ఆర్థిక వృద్ధి రేటు 2020లో 1.2శాతంగా ఉండనుందని ఐరాస అంచనా వేసింది.

సెంటర్​ ఫర్ మానిటరింగ్ ద ఇండియన్​ ఎకానమీ (సీఎంఐఈ) గణాంకాల ప్రకారం ఏప్రిల్​లో 11.4 కోట్ల మంది ఉపాధి కోల్పోయారు. వీరిలో 2.7 కోట్ల మంది 20- 30 మధ్య వయస్కులే కావటం గమనార్హం.

ప్యాకేజీలో లోపాలు?

కరోనా సంక్షోభం నుంచి బయటపడేందుకు కేంద్రం రూ.20.97 లక్షల కోట్లు ప్రకటించింది. ఇందులో రెండు అంశాలుగా డబ్బును దేశ ఆర్థిక వ్యవస్థలోకి చొప్పించనుంది. బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా నగదు లభ్యత ఉండేలా చూసుకోవటం వాటిలో ప్రధానమైంది. ఎంఎస్​ఎంఈలు, వీధి వ్యాపారులకు రుణాల అందజేతకు పూచీకత్తును ప్రభుత్వమే ఇస్తుంది.

వ్యవసాయం, పరిశ్రమ, వ్యాపార సౌలభ్యానికి సంబంధించిన కీలక సంస్కరణలకు ప్రభుత్వం సిద్ధమైంది. వ్యవసాయ మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టడం సహా ప్రభుత్వ రంగాల్లో ప్రైవేటు సంస్థలకు భాగస్వామ్యం కల్పించటమే లక్ష్యంగా పెటుకుంది.

దేశం స్వావలంబన దిశగా అడగులు వేసేలా రూపొందించిన ఈ ప్యాకేజీని చాలా మంది ఆర్థిక నిపుణలు స్వాగతించారు. ఈ సంస్కరణలు, నగదు లభ్యత చర్యలు కట్టుదిట్టంగా అమలు చేస్తే చాలా అంశాలను పరిష్కరించుకోగలమని అంటున్నారు.

వస్తు వినియోగం సంగతేంటి?

అయినప్పటికీ.. ఇందులో కొన్ని సమస్యలు ఉన్నాయి. అత్యంత ప్రధానమైనది వస్తు సేవల వినియోగ డిమాండ్​ పునరుద్ధరణకు చర్యలు తీసుకోలేదు. ఆర్థిక వృద్ధి తగ్గటం, నిరుద్యోగిత పెరగటానికి ప్రధాన కారణం వస్తు సేవలకు డిమాండ్ తగ్గటమే.

రెండోది... సరఫరా వ్యవస్థ పునరుద్ధరణ. కరోనా కారణంగా పూర్తిగా ధ్వంసమైన సరఫరా వ్యవస్థను తిరిగి గాడిన పెడితేనే వస్తు వినియోగం పెరిగే అవకాశం ఉంటుంది. ఫలితంగా ఆదాయం పెరుగుతుంది.

తిరిగి అక్కడికే..

లాక్​డౌన్ కారణంగా ఉద్యోగాలు పోయాయి. జీతాలూ తగ్గాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ సాయం లేనిదే వినియోగదారుడు వ్యయాన్ని భరించలేడు. మరోవైపు, రిటైల్ నుంచి కార్పొరేట్ల వరకు అన్ని వ్యాపారాలకు ప్రస్తుత ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా నిర్ణీత ఖర్చులు ఉంటాయి. ఇది వ్యాపారాల పునరుద్ధరణపై మరింత ఒత్తిడి పెంచుతుంది. కానీ రాయితీలతో ప్రత్యక్ష సాయం కన్నా రుణాలు అందివ్వటంపైనే ప్యాకేజీ అధికంగా దృష్టి సారించింది.

వస్తు, సేవల వినియోగం పాతాళానికి చేరిన సమయంలో.. ఆర్థిక వ్యవస్థలో వినియోగ డిమాండ్​ మెరుగుదలపైనే రుణాల అందజేత ఆధారపడి ఉంటుంది. ఫలితంగా డిమాండ్ పెంచేందుకు మళ్లీ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది.

మరింత ముందుకు..

వినియోగ డిమాండ్‌ను పునరుద్ధరించడానికి ఆర్థిక ఉద్దీపన చర్యల్లో భాగంగా కొన్ని ప్రతిపాదనలు ఉన్నాయి. ప్రజల ఖర్చును పెరిగేలా చూడాలి. ఫలితంగా నిరుద్యోగులకు పని లభిస్తుంది. రైతులకు ముందస్తు రాయితీలు అందివ్వాలి. ఉత్పాదకత ఆధారంగా చిన్న మధ్యతరహా పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందించాలి.

ఆదాయం పెరిగితే ఖర్చు కూడా..

దీనికి సమాంతరంగా పేదలు, సంక్షోభ పరిస్థితుల్లో ఉన్న వారికి నగదు బదిలీ మొత్తాన్ని పెంచాలి. ఫలితంగా వాళ్లు రోజువారీ అవసరాలకు కొనుక్కోగలరు. ఫలితంగా వినియోగ డిమాండ్ పెరుగుతుంది.

వ్యవసాయం, ఎంఎస్ఎంఈ రంగాల్లో 80 శాతం శ్రామిక శక్తి ఉంది. ఉద్దీపన చర్యల్లో వీటిపైన అధిక దృష్టి సారిస్తేనే ఈ కీలక రంగాల్లో ఉద్యోగ అవకాశాలు మరింతగా పెరుగుతాయి. ఫలితంగా ఆదాయాలు పెరిగి.. మళ్లీ వినియోగం మెరుగవుతుంది.

ఈ రంగాలకు ఆర్థికంగా చేయూతను ఇచ్చేలా చర్యలు చేపడితే ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది. ఆర్థిక ద్రవ్యలోటు సమస్యను ఇది అధిగమిస్తుంది. కానీ దేశ ప్రజల ప్రాణాలు, జీవనోపాధి కన్నా పెద్ద విషయం మరొకటి లేదు.

(రచయిత- డాక్టర్​ మహేంద్ర బాబు కురువ, హెచ్​ఎన్​బీ గఢ్​వాల్​ కేంద్ర విశ్వవిద్యాలయంలో సహాయ ఆచార్యులు)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.