ETV Bharat / opinion

చెరలో చెరువులు.. వరదలో ఆవాసాలు

author img

By

Published : Sep 15, 2021, 8:31 AM IST

అకస్మాత్తుగా కురిసే వానల వల్ల కలిగే వరదలతో దేశంలోని ప్రముఖ నగరాలతో పాటు.. చిన్న పట్టణాలు సైతం జలదిగ్భందంలో చిక్కుకుంటున్నాయి. వరదలు తగ్గినప్పటికీ ఆ ప్రభావం చాలామందిపై కొన్నిరోజులపాటు ఉంటోంది. ఇక వరదల వల్ల ఏటా వేల కోట్ల నష్టం వాటిల్లుతున్నప్పటికీ వీటి బాగుకోసం చేపడుతున్న చర్యలు అరకొరగా ఉంటున్నాయి. ఫలితంగా వరదలు వచ్చిన ప్రతీసారి సామాన్యులు కష్టాలను ఎదుర్కొంటున్నారు.

నగరాలు తెప్పరిల్లేదెలా?
నగరాలు తెప్పరిల్లేదెలా?

వేగంగా పెరుగుతున్న పట్టణీకరణకు కొంతమంది స్థిరాస్తి వ్యాపారుల భూదాహం తోడై చెరువులు, కుంటలు వంటి చిన్న నీటి వనరులు దురాక్రమణకు గురవుతున్నాయి. ఫలితంగా కొద్దిపాటి వర్షాలకే నగరాలు, పట్టణాలను వరదలు ముంచెత్తుతున్నాయి. చెరువులు ఆక్రమణలకు గురవుతుండటం, వాటిలోకి వరద నీరు వచ్చి చేరే మార్గాలు మూసుకుపోవడం, నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోవడం వంటి కారణాలతో ఇటీవల వరదలు ఉగ్రరూపం దాలుస్తున్నాయి. ఎక్కడ చెరువులు, కుంటలు ఉన్నాయో తెలియని పరిస్థితుల్లో భూములు కొనుగోలు చేసి ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. ఫలితంగా కొద్దిపాటి వర్షానికే జనావాసాలు జలాశయాలను తలపిస్తున్నాయి. నిరుడు అక్టోబర్‌, డిసెంబర్‌లతోపాటు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్‌ నగరంలో కొన్ని ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకొన్నాయి. తెలంగాణలో చెరువుల ఆక్రమణలపై మూడు నెలల క్రితం జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌తో పాటు వరంగల్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌ జిల్లాలతో సహా నగరాలు, పట్టణాల్లోని చెరువుల ఆక్రమణలపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ శాఖలతో పాటు కలెక్టర్లు, అధికారులకు ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో చెరువుల పరిరక్షణకు తీసుకున్న చర్యలపై ఎన్జీటీకి హెచ్‌ఎండీఏ నివేదిక అందజేసింది. హెచ్‌ఎండీఏ పరిధిలోని ఏడు జిల్లాల అదనపు కలెక్టర్లతో ప్రత్యేక కమిటీలు వేసి చెరువుల పరిరక్షణకు చర్యలు చేపడుతున్నట్లు వివరించింది. ఆంధ్రప్రదేశ్‌లో సైతం విజయనగరం, విశాఖ, కృష్ణా, నెల్లూరు, కడప జిల్లాల్లోనూ చెరువుల ఆక్రమణలపై ఇటీవల పలు కథనాలు వెలుగుచూశాయి.

వ్యర్థాలతో అనర్థం..

గత దశాబ్దం వరకు నగరాలు, పట్టణాల్లో ఎంత పెద్ద వర్షం కురిసినా కాలనీలు, జనావాసాలు వరద ముంపునకు గురికావడం చాలా అరుదుగా కనిపించేది. ఇటీవలి కాలంలో ఈ సమస్య అధికమైంది. ఒకప్పుడు హైదరాబాద్‌ నగరం, శివారు ప్రాంతాలను కలుపుతూ పెద్ద సంఖ్యలో గొలుసు కట్టు చెరువులు ఉండేవి. ప్రస్తుతం అవి ఆక్రమణలకు గురై చాలా వరకు కనుమరుగయ్యాయి. నగరాలు, పట్టణాలు విస్తరిస్తూ, భారీయెత్తున అక్రమ నిర్మాణాలు కొనసాగి వేల ఎకరాల విస్తీర్ణంలోని చెరువులు, కుంటల భూముల్ని మింగేశాయి. దీనికి తోడు ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్‌ వ్యర్థాలు, చెత్తా చెదారాన్ని విచ్చలవిడిగా పడేస్తుండటం వల్ల మురుగు, వరద నీటి ప్రవాహానికి ఆటంకాలు ఏర్పడి చిన్న వానకే నగరాల్లోని రహదారులు గోదారులుగా మారుతున్నాయి. నానాటికీ తీవ్రతరమవుతున్న భూతాపం మూలాన ఆకస్మికంగా కురుస్తున్న కుండపోత వానల వల్ల లోతట్టు ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. చెరువులు, కుంటల శిఖం భూముల్లోని లేఔట్లకు, వెంచర్లకు సునాయాసంగా అనుమతులు మంజూరవుతున్నాయి. రెవిన్యూ భూరికార్డుల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండటం స్థిరాస్తి మాఫియాకు, ఆక్రమణదారులకు వరంగా మారింది. నిన్న మొన్నటి వరకు భూ రికార్డుల నిర్వహణ, పర్యవేక్షణ, రిజిస్ట్రేషన్ల విభాగాలకు మధ్య సరైన సమన్వయం లేకపోవడంతో చెరువులు, కుంటల భూములు యథేచ్ఛగా పరాధీనమయ్యాయి.

సంరక్షణతో సమస్యకు చెక్..

నగరాల్లోని చెరువులు కుంటల నిర్వహణ, పర్యవేక్షణకు సరైన వ్యవస్థ లేకపోవడంతో అవి ఆక్రమణలకు గురవుతున్నాయి. ప్రస్తుత జనాభాకు అనుగుణంగా మురుగు, వరద నీటి వ్యవస్థ లేకపోవడం సైతం నగరాల పాలిట శాపంగా పరిణమిస్తోంది. తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం సంభవిస్తుండటంతో భూమిలోకి ఇంకాల్సిన వాన నీరు మోతాదును మించిపోయి వరదలు లోతట్టు ప్రాంతాలను ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలు, వరదలు వచ్చినప్పుడు ఆ నీటిని తమ ఒడిలో నింపుకొనే జలాశయాలను పరిరక్షించుకోనంత వరకు వరద నీరు ఆవాసాలను ముంచెత్తుతూనే ఉంటుంది. అందుకే చిన్న నీటి వనరులైన చెరువులను, కుంటలను, వాటి పరీవాహక ప్రాంతాలను, నీటి ప్రవాహాన్ని తీసుకొచ్చే కాలువలను పరిరక్షించుకోవాలి. చెరువులు, కుంటల నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంపొందించేలా ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలి. నగరాలు, పట్టణాల నుంచి వరద నీటిని బయటికి మళ్ళించడానికి ప్రత్యేక కాలువలను సైతం నిర్మించాల్సిన అవసరం ఉంది. వరద కాలువలు, మురుగు నీటి పారుదలకు ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవాలి. వరద ముప్పును నివారించడానికి వీటన్నింటిపై దృష్టిసారించడం తక్షణావసరం.

- డాక్టర్‌ జీవీఎల్‌ విజయ్‌కుమార్‌, (భూ విజ్ఞానశాస్త్ర నిపుణులు)

ఇవీ చదవండి:

వేగంగా పెరుగుతున్న పట్టణీకరణకు కొంతమంది స్థిరాస్తి వ్యాపారుల భూదాహం తోడై చెరువులు, కుంటలు వంటి చిన్న నీటి వనరులు దురాక్రమణకు గురవుతున్నాయి. ఫలితంగా కొద్దిపాటి వర్షాలకే నగరాలు, పట్టణాలను వరదలు ముంచెత్తుతున్నాయి. చెరువులు ఆక్రమణలకు గురవుతుండటం, వాటిలోకి వరద నీరు వచ్చి చేరే మార్గాలు మూసుకుపోవడం, నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోవడం వంటి కారణాలతో ఇటీవల వరదలు ఉగ్రరూపం దాలుస్తున్నాయి. ఎక్కడ చెరువులు, కుంటలు ఉన్నాయో తెలియని పరిస్థితుల్లో భూములు కొనుగోలు చేసి ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. ఫలితంగా కొద్దిపాటి వర్షానికే జనావాసాలు జలాశయాలను తలపిస్తున్నాయి. నిరుడు అక్టోబర్‌, డిసెంబర్‌లతోపాటు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్‌ నగరంలో కొన్ని ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకొన్నాయి. తెలంగాణలో చెరువుల ఆక్రమణలపై మూడు నెలల క్రితం జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌తో పాటు వరంగల్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌ జిల్లాలతో సహా నగరాలు, పట్టణాల్లోని చెరువుల ఆక్రమణలపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ శాఖలతో పాటు కలెక్టర్లు, అధికారులకు ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో చెరువుల పరిరక్షణకు తీసుకున్న చర్యలపై ఎన్జీటీకి హెచ్‌ఎండీఏ నివేదిక అందజేసింది. హెచ్‌ఎండీఏ పరిధిలోని ఏడు జిల్లాల అదనపు కలెక్టర్లతో ప్రత్యేక కమిటీలు వేసి చెరువుల పరిరక్షణకు చర్యలు చేపడుతున్నట్లు వివరించింది. ఆంధ్రప్రదేశ్‌లో సైతం విజయనగరం, విశాఖ, కృష్ణా, నెల్లూరు, కడప జిల్లాల్లోనూ చెరువుల ఆక్రమణలపై ఇటీవల పలు కథనాలు వెలుగుచూశాయి.

వ్యర్థాలతో అనర్థం..

గత దశాబ్దం వరకు నగరాలు, పట్టణాల్లో ఎంత పెద్ద వర్షం కురిసినా కాలనీలు, జనావాసాలు వరద ముంపునకు గురికావడం చాలా అరుదుగా కనిపించేది. ఇటీవలి కాలంలో ఈ సమస్య అధికమైంది. ఒకప్పుడు హైదరాబాద్‌ నగరం, శివారు ప్రాంతాలను కలుపుతూ పెద్ద సంఖ్యలో గొలుసు కట్టు చెరువులు ఉండేవి. ప్రస్తుతం అవి ఆక్రమణలకు గురై చాలా వరకు కనుమరుగయ్యాయి. నగరాలు, పట్టణాలు విస్తరిస్తూ, భారీయెత్తున అక్రమ నిర్మాణాలు కొనసాగి వేల ఎకరాల విస్తీర్ణంలోని చెరువులు, కుంటల భూముల్ని మింగేశాయి. దీనికి తోడు ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్‌ వ్యర్థాలు, చెత్తా చెదారాన్ని విచ్చలవిడిగా పడేస్తుండటం వల్ల మురుగు, వరద నీటి ప్రవాహానికి ఆటంకాలు ఏర్పడి చిన్న వానకే నగరాల్లోని రహదారులు గోదారులుగా మారుతున్నాయి. నానాటికీ తీవ్రతరమవుతున్న భూతాపం మూలాన ఆకస్మికంగా కురుస్తున్న కుండపోత వానల వల్ల లోతట్టు ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. చెరువులు, కుంటల శిఖం భూముల్లోని లేఔట్లకు, వెంచర్లకు సునాయాసంగా అనుమతులు మంజూరవుతున్నాయి. రెవిన్యూ భూరికార్డుల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండటం స్థిరాస్తి మాఫియాకు, ఆక్రమణదారులకు వరంగా మారింది. నిన్న మొన్నటి వరకు భూ రికార్డుల నిర్వహణ, పర్యవేక్షణ, రిజిస్ట్రేషన్ల విభాగాలకు మధ్య సరైన సమన్వయం లేకపోవడంతో చెరువులు, కుంటల భూములు యథేచ్ఛగా పరాధీనమయ్యాయి.

సంరక్షణతో సమస్యకు చెక్..

నగరాల్లోని చెరువులు కుంటల నిర్వహణ, పర్యవేక్షణకు సరైన వ్యవస్థ లేకపోవడంతో అవి ఆక్రమణలకు గురవుతున్నాయి. ప్రస్తుత జనాభాకు అనుగుణంగా మురుగు, వరద నీటి వ్యవస్థ లేకపోవడం సైతం నగరాల పాలిట శాపంగా పరిణమిస్తోంది. తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం సంభవిస్తుండటంతో భూమిలోకి ఇంకాల్సిన వాన నీరు మోతాదును మించిపోయి వరదలు లోతట్టు ప్రాంతాలను ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలు, వరదలు వచ్చినప్పుడు ఆ నీటిని తమ ఒడిలో నింపుకొనే జలాశయాలను పరిరక్షించుకోనంత వరకు వరద నీరు ఆవాసాలను ముంచెత్తుతూనే ఉంటుంది. అందుకే చిన్న నీటి వనరులైన చెరువులను, కుంటలను, వాటి పరీవాహక ప్రాంతాలను, నీటి ప్రవాహాన్ని తీసుకొచ్చే కాలువలను పరిరక్షించుకోవాలి. చెరువులు, కుంటల నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంపొందించేలా ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలి. నగరాలు, పట్టణాల నుంచి వరద నీటిని బయటికి మళ్ళించడానికి ప్రత్యేక కాలువలను సైతం నిర్మించాల్సిన అవసరం ఉంది. వరద కాలువలు, మురుగు నీటి పారుదలకు ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవాలి. వరద ముప్పును నివారించడానికి వీటన్నింటిపై దృష్టిసారించడం తక్షణావసరం.

- డాక్టర్‌ జీవీఎల్‌ విజయ్‌కుమార్‌, (భూ విజ్ఞానశాస్త్ర నిపుణులు)

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.