ETV Bharat / opinion

ముంచుకొచ్చిన ‘సింధు’ వివాదం

author img

By

Published : Mar 26, 2021, 7:21 AM IST

భారత్, పాకిస్థాన్ మధ్య సమీకరణలు క్రమంగా మారుతున్నాయి. కశ్మీర్, ఆర్టికల్ 370 రద్దు విషయాలు పక్కకు పోయి.. ఇప్పుడు సింధు నదీ జలాలు ప్రధాన అంశంగా మారాయి. రెండు దేశాల మధ్య సఖ్యతకు దౌత్యాధికారుల కృషి సానుకూలంగా కనపడుతోంది. చర్చలతోనే సరైన పరిష్కారం లభిస్తుందనే భరోసా కనబడుతోంది.

Sub Feature
ముంచుకొచ్చిన ‘సింధు’ వివాదం

భారత్‌, పాక్‌ సంబంధాలను కశ్మీర్‌ అంశమో, 370 అధికరణ వ్యవహారమో మొన్నటివరకూ శాసించేవి. ఇప్పుడు సమీకరణలు మారిపోయాయి. సింధు నదీ జలాలు పాకిస్థాన్‌కు ఇప్పుడు అత్యంత ప్రాధాన్యాంశంగా మారాయి. కొన్నేళ్లుగా పాక్‌ ప్రస్తావిస్తున్న అనేక అంశాలు ఒక్కపెట్టున వెనక్కి వెళ్ళిపోయి... సింధు జలాల పంపిణీ ఇప్పుడు ప్రముఖంగా ముందుకు వచ్చింది. ఇరుదేశాలు 1960లో నదీ జలాల న్యాయబద్ధ పంపిణీకి సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్నాయి. అందుకోసం సింధు జల శాశ్వత కమిషన్‌ ఏర్పాటైంది. అది ఇప్పటికి 115 పర్యాయాలు సమావేశమైంది. ఇరుపక్షాల సభ్యులతో కూడిన ఈ కమిషన్‌ కనీసం ఏడాదికి ఒకమారు సమావేశం కావాలన్నది అలిఖిత ఒప్పందం. చివరిసారిగా 2018లో లాహోర్‌లో సమావేశమైన ఈ కమిషన్‌ ఆ తరవాత మళ్ళీ చర్చలకు కూర్చోలేదు. ఇరుపక్షాల మధ్య ఉద్రిక్తతలు పెరగడం, నియంత్రణ రేఖ వెంబడి చెదురుమదురు కాల్పులు జరగడం, జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే అధికరణ 370 రద్దు కావడం వంటి కారణాలవల్ల ఉభయ దేశాల మధ్య సంబంధాలు ఉద్రిక్తంగా మారాయి. అయితే తెరవెనక రెండు దేశాల మధ్య సఖ్యత కుదిర్చేందుకు దౌత్య ప్రయత్నాలు మాత్రం ఆగలేదు. ఉభయ దేశాల నడుమ నెల రోజుల క్రితం కాల్పుల విరమణ ఒప్పందం కుదరడానికి తెరవెనక దౌత్య కృషే కారణం.

కీలకమైన ఒప్పందం..

భారత్‌, పాకిస్థాన్‌ అధికారులతో కూడిన శాశ్వత సింధు కమిషన్‌(పీఐసీ) వార్షిక సమావేశం దిల్లీలో ముగిసింది. దీనిపై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ వెలువరించిన ప్రకటన ప్రకారం... భారత్‌ చేపట్టిన పకాల్‌దల్‌, దిగువ కల్నాయ్‌ ప్రాజెక్టుల ఆకృతులపై చర్చలు కొనసాగుతాయి. ఈ రెండు ప్రాజెక్టులూ పూర్తిగా ఒప్పందంలోని అంశాల ఆధారంగానే జరుగుతున్నట్లు మనదేశం స్పష్టం చేసింది. ప్రతిపాదిత జలవిద్యుత్తు ప్రాజెక్టుల ఆకృతులకు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా పాక్‌ భారత్‌ను కోరగా, ఒప్పందంలోని నిబంధనల మేరకు అవసరమైన సమాచారాన్ని అందిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. సింధునది, దాని ఉపనదులకు సంబంధించిన జల పంపిణీలోని అసమానతల్ని రూపుమాపి, ఉభయ దేశాల మధ్య హేతుబద్ధంగా వాటా పెట్టేందుకు 1960లో కుదిరిన ఒప్పందం దోహద పడింది. దాని ప్రకారం భారత్‌లోని పశ్చిమ ప్రాంతం ద్వారా పాక్‌వైపు ప్రవహించే సింధు, జీలం, చీనాబ్‌ జలాల వినియోగంపై పాకిస్థాన్‌కు పూర్తి హక్కులు దఖలుపడ్డాయి. మరోవంక రావి, బియాస్‌, సట్లెజ్‌ నదీ జలాల వినియోగంపై భారత్‌కు సంపూర్ణ అధికారాలు ఏర్పడ్డాయి. భారత్‌, పాక్‌లతోపాటు ఆ ఒప్పందంపై ప్రపంచబ్యాంకు సైతం సంతకం చేసింది. ఒప్పంద నిబంధనలకు విరుద్ధంగా ఆయా నదులపై నిర్మించే ఏ ప్రాజెక్టుకూ ప్రపంచబ్యాంకు మద్దతు అందించదు. పాకిస్థాన్‌ వ్యవసాయానికి చీనాబ్‌, జీలం నదులు ప్రాణాధారం. జమ్ము కశ్మీర్‌ నుంచి నియంత్రణ రేఖ ద్వారా పాకిస్థాన్‌లో ప్రవేశించే ఈ నదీ జల ప్రవాహానికి భారత్‌ అడ్డుకట్టలు వేస్తోందన్నది ఇస్లామాబాద్‌ ప్రధాన ఆరోపణ. జమ్ము ప్రాంతంలో చినాబ్‌ నదిపై బాగ్లిహార్‌, పకాల్‌దల్‌ జల విద్యుత్‌ ప్రాజెక్టుల నిర్మాణంపై పాకిస్థాన్‌ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. పాక్‌ వైపునుంచి నేతృత్వం వహిస్తున్న సయ్యద్‌ మెహర్‌ అలీ షా, భారత్‌ తరఫున సారథిగా ఉన్న పీకే సక్సేనాలతో కూడిన నిపుణుల బృందాలు జమ్ము ప్రాంతంలోని దోడ, కిష్ట్‌వార్‌ జిల్లాల్లో చీనాబ్‌ నదిపై నిర్మించిన జల విద్యుత్తు ప్రాజెక్టులపైనే తాజా సమావేశంలో చర్చించాయి. వివిధ అభ్యంతరాల కారణంగా, తాత్కాలికంగా నిలిచిపోయిన ప్రాజెక్టు పనులు ప్రపంచ బ్యాంకు జోక్యంతో తిరిగి ప్రారంభమయ్యాయి.

చర్చే మంత్రం..

‘గతానికి పాతరేసి భవిష్యత్తుకు బాటలు వేసుకుందాం’ అని పాకిస్థాన్‌ సైనికాధిపతి ఖమర్‌ జావేద్‌ బాజ్వా ఇటీవల ఇచ్చిన పిలుపు- పాక్‌ విధానంలో క్రమంగానైనా పొడగడుతున్న మార్పునకు అద్దం పడుతోంది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలను సద్దుమణిగేలా చేయడమే లక్ష్యంగా ఇరుపక్షాలు ఇటీవల సమావేశం కావడం, ‘కాల్పుల విరమణ ఒప్పందం’ కుదుర్చుకోవడం సానుకూల అంశాలు. జమ్మూకశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తికి సంబంధించి 370 అధికరణ గురించిగానీ, ఐక్యరాజ్య సమితి తీర్మానాల ప్రస్తావన జోలికి వెళ్ళడంగానీ ఇప్పుడు పాకిస్థాన్‌ చేయడం లేదు. అదే క్రమంలో వేర్పాటువాద నేత, కశ్మీర్‌లోని పాక్‌ అనుకూల నాయకుడు సయ్యద్‌ అలీ గీలానీతో కఠినంగా వ్యవహరించాలని ఇస్లామాబాద్‌ నిశ్చయించుకుంది. కశ్మీర్‌ సహా అనేక వివాదాస్పద అంశాలు వెనక్కి మరలి, సరిహద్దుల్లో కాల్పుల విరమణ సాధ్యపడటం శుభసూచకం. సింధు జలాలపైనా ఉభయ పక్షాల మధ్య ఒక సహేతుక అంగీకారం కుదిరితే... దక్షిణాసియాలో నెలకొన్న రాజకీయ సంక్షోభం కొంతమేరకైనా ఉపశమిస్తుంది.

- బిలాల్‌ భట్‌

ఇదీ చూడండి: భాషా పౌరుషం మనకు లేదేం?

భారత్‌, పాక్‌ సంబంధాలను కశ్మీర్‌ అంశమో, 370 అధికరణ వ్యవహారమో మొన్నటివరకూ శాసించేవి. ఇప్పుడు సమీకరణలు మారిపోయాయి. సింధు నదీ జలాలు పాకిస్థాన్‌కు ఇప్పుడు అత్యంత ప్రాధాన్యాంశంగా మారాయి. కొన్నేళ్లుగా పాక్‌ ప్రస్తావిస్తున్న అనేక అంశాలు ఒక్కపెట్టున వెనక్కి వెళ్ళిపోయి... సింధు జలాల పంపిణీ ఇప్పుడు ప్రముఖంగా ముందుకు వచ్చింది. ఇరుదేశాలు 1960లో నదీ జలాల న్యాయబద్ధ పంపిణీకి సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్నాయి. అందుకోసం సింధు జల శాశ్వత కమిషన్‌ ఏర్పాటైంది. అది ఇప్పటికి 115 పర్యాయాలు సమావేశమైంది. ఇరుపక్షాల సభ్యులతో కూడిన ఈ కమిషన్‌ కనీసం ఏడాదికి ఒకమారు సమావేశం కావాలన్నది అలిఖిత ఒప్పందం. చివరిసారిగా 2018లో లాహోర్‌లో సమావేశమైన ఈ కమిషన్‌ ఆ తరవాత మళ్ళీ చర్చలకు కూర్చోలేదు. ఇరుపక్షాల మధ్య ఉద్రిక్తతలు పెరగడం, నియంత్రణ రేఖ వెంబడి చెదురుమదురు కాల్పులు జరగడం, జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే అధికరణ 370 రద్దు కావడం వంటి కారణాలవల్ల ఉభయ దేశాల మధ్య సంబంధాలు ఉద్రిక్తంగా మారాయి. అయితే తెరవెనక రెండు దేశాల మధ్య సఖ్యత కుదిర్చేందుకు దౌత్య ప్రయత్నాలు మాత్రం ఆగలేదు. ఉభయ దేశాల నడుమ నెల రోజుల క్రితం కాల్పుల విరమణ ఒప్పందం కుదరడానికి తెరవెనక దౌత్య కృషే కారణం.

కీలకమైన ఒప్పందం..

భారత్‌, పాకిస్థాన్‌ అధికారులతో కూడిన శాశ్వత సింధు కమిషన్‌(పీఐసీ) వార్షిక సమావేశం దిల్లీలో ముగిసింది. దీనిపై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ వెలువరించిన ప్రకటన ప్రకారం... భారత్‌ చేపట్టిన పకాల్‌దల్‌, దిగువ కల్నాయ్‌ ప్రాజెక్టుల ఆకృతులపై చర్చలు కొనసాగుతాయి. ఈ రెండు ప్రాజెక్టులూ పూర్తిగా ఒప్పందంలోని అంశాల ఆధారంగానే జరుగుతున్నట్లు మనదేశం స్పష్టం చేసింది. ప్రతిపాదిత జలవిద్యుత్తు ప్రాజెక్టుల ఆకృతులకు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా పాక్‌ భారత్‌ను కోరగా, ఒప్పందంలోని నిబంధనల మేరకు అవసరమైన సమాచారాన్ని అందిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. సింధునది, దాని ఉపనదులకు సంబంధించిన జల పంపిణీలోని అసమానతల్ని రూపుమాపి, ఉభయ దేశాల మధ్య హేతుబద్ధంగా వాటా పెట్టేందుకు 1960లో కుదిరిన ఒప్పందం దోహద పడింది. దాని ప్రకారం భారత్‌లోని పశ్చిమ ప్రాంతం ద్వారా పాక్‌వైపు ప్రవహించే సింధు, జీలం, చీనాబ్‌ జలాల వినియోగంపై పాకిస్థాన్‌కు పూర్తి హక్కులు దఖలుపడ్డాయి. మరోవంక రావి, బియాస్‌, సట్లెజ్‌ నదీ జలాల వినియోగంపై భారత్‌కు సంపూర్ణ అధికారాలు ఏర్పడ్డాయి. భారత్‌, పాక్‌లతోపాటు ఆ ఒప్పందంపై ప్రపంచబ్యాంకు సైతం సంతకం చేసింది. ఒప్పంద నిబంధనలకు విరుద్ధంగా ఆయా నదులపై నిర్మించే ఏ ప్రాజెక్టుకూ ప్రపంచబ్యాంకు మద్దతు అందించదు. పాకిస్థాన్‌ వ్యవసాయానికి చీనాబ్‌, జీలం నదులు ప్రాణాధారం. జమ్ము కశ్మీర్‌ నుంచి నియంత్రణ రేఖ ద్వారా పాకిస్థాన్‌లో ప్రవేశించే ఈ నదీ జల ప్రవాహానికి భారత్‌ అడ్డుకట్టలు వేస్తోందన్నది ఇస్లామాబాద్‌ ప్రధాన ఆరోపణ. జమ్ము ప్రాంతంలో చినాబ్‌ నదిపై బాగ్లిహార్‌, పకాల్‌దల్‌ జల విద్యుత్‌ ప్రాజెక్టుల నిర్మాణంపై పాకిస్థాన్‌ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. పాక్‌ వైపునుంచి నేతృత్వం వహిస్తున్న సయ్యద్‌ మెహర్‌ అలీ షా, భారత్‌ తరఫున సారథిగా ఉన్న పీకే సక్సేనాలతో కూడిన నిపుణుల బృందాలు జమ్ము ప్రాంతంలోని దోడ, కిష్ట్‌వార్‌ జిల్లాల్లో చీనాబ్‌ నదిపై నిర్మించిన జల విద్యుత్తు ప్రాజెక్టులపైనే తాజా సమావేశంలో చర్చించాయి. వివిధ అభ్యంతరాల కారణంగా, తాత్కాలికంగా నిలిచిపోయిన ప్రాజెక్టు పనులు ప్రపంచ బ్యాంకు జోక్యంతో తిరిగి ప్రారంభమయ్యాయి.

చర్చే మంత్రం..

‘గతానికి పాతరేసి భవిష్యత్తుకు బాటలు వేసుకుందాం’ అని పాకిస్థాన్‌ సైనికాధిపతి ఖమర్‌ జావేద్‌ బాజ్వా ఇటీవల ఇచ్చిన పిలుపు- పాక్‌ విధానంలో క్రమంగానైనా పొడగడుతున్న మార్పునకు అద్దం పడుతోంది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలను సద్దుమణిగేలా చేయడమే లక్ష్యంగా ఇరుపక్షాలు ఇటీవల సమావేశం కావడం, ‘కాల్పుల విరమణ ఒప్పందం’ కుదుర్చుకోవడం సానుకూల అంశాలు. జమ్మూకశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తికి సంబంధించి 370 అధికరణ గురించిగానీ, ఐక్యరాజ్య సమితి తీర్మానాల ప్రస్తావన జోలికి వెళ్ళడంగానీ ఇప్పుడు పాకిస్థాన్‌ చేయడం లేదు. అదే క్రమంలో వేర్పాటువాద నేత, కశ్మీర్‌లోని పాక్‌ అనుకూల నాయకుడు సయ్యద్‌ అలీ గీలానీతో కఠినంగా వ్యవహరించాలని ఇస్లామాబాద్‌ నిశ్చయించుకుంది. కశ్మీర్‌ సహా అనేక వివాదాస్పద అంశాలు వెనక్కి మరలి, సరిహద్దుల్లో కాల్పుల విరమణ సాధ్యపడటం శుభసూచకం. సింధు జలాలపైనా ఉభయ పక్షాల మధ్య ఒక సహేతుక అంగీకారం కుదిరితే... దక్షిణాసియాలో నెలకొన్న రాజకీయ సంక్షోభం కొంతమేరకైనా ఉపశమిస్తుంది.

- బిలాల్‌ భట్‌

ఇదీ చూడండి: భాషా పౌరుషం మనకు లేదేం?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.