ETV Bharat / opinion

Violence in north east india: ఈశాన్యంలో ఆరని కుంపటి

author img

By

Published : Nov 15, 2021, 9:03 AM IST

ఈశాన్యభారతంలో(Violence in north east india) తిష్ఠవేసిన వందల కొద్దీ విద్రోహ బృందాలు- దశాబ్దాలుగా అక్కడ నెత్తుటేళ్లు పారించాయి. తాజాగా.. మణిపుర్​లోని చురాచాంద్‌పుర్‌ జిల్లాలో కర్నల్‌ విప్లవ్‌ త్రిపాఠి వాహనశ్రేణిపై మెయ్‌తెయ్‌ తిరుగుబాటుదారులు భీకరదాడికి తెగబడ్డారు. త్రిపాఠితో పాటు ఆయన భార్యాబిడ్డలు, మరో నలుగురు సైనికులను నిర్దాక్షిణ్యంగా పొట్టన పెట్టుకున్నారు. శాంతి, సామరస్యాలకు ఒప్పుకోని మణిపురీ ఉగ్రమూకలు ఆ రాష్ట్రంలో ఈ తరహా విధ్వంసాలెన్నో సృష్టిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఉగ్రవాద తండాలపై ఉక్కుపాదం మోపితేనే మణిపుర్​లో శాంతి స్థాపన సాధ్యమవుతుంది!

Violence in north east india
ఈశాన్య రాష్ట్రాల్లో హింస

శరణార్థుల ముసుగులో మయన్మార్‌ నుంచి ఇండియాలోకి(Myanmar militants in india) ముష్కరులు చొరబడే ప్రమాదం ఉందనే హెచ్చరికలు కొన్నాళ్లుగా వినవస్తున్నాయి. ఆ విద్రోహుల మూలంగా మణిపుర్‌లో(Violence in north east india) మళ్ళీ హింస ప్రకోపించవచ్చుననే భయాందోళనలూ నెలకొన్నాయి. వాటిని నిజంచేస్తూ- ఆ రాష్ట్రంలోని(Manipur attack news) చురాచాంద్‌పుర్‌ జిల్లాలో కర్నల్‌ విప్లవ్‌ త్రిపాఠి వాహనశ్రేణిపై మెయ్‌తెయ్‌ తిరుగుబాటుదారులు భీకరదాడికి తెగబడ్డారు. త్రిపాఠితో పాటు ఆయన భార్యాబిడ్డలు, మరో నలుగురు సైనికులను నిర్దాక్షిణ్యంగా పొట్టన పెట్టుకున్నారు. ఈశాన్యభారతంలో(Violence in north east india) తిష్ఠవేసిన వందల కొద్దీ విద్రోహ బృందాలు- దశాబ్దాలుగా అక్కడ నెత్తుటేళ్లు పారించాయి.

12వేల మంది విగతజీవులుగా..

గడచిన ఇరవై ఏళ్లలో ఆ రాష్ట్రాల్లో 26వేలకు పైగా ఉగ్రవాద ఘటనలు చోటుచేసుకున్నాయి. భద్రతా దళాలు, పౌరులు, తిరుగుబాటుదారులతో కలిపి సుమారు పన్నెండు వేల మంది విగతజీవులయ్యారు. మయన్మార్‌ సైనిక సహకారంతో భారత బలగాలు చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్ల ఫలితంగా కొన్నేళ్లుగా ముష్కర మూకల కార్యకలాపాలు తగ్గుతూ వస్తున్నాయి. నాగా, కుకీ, కర్బీ, జొమీ వర్గాలకు చెందిన దాదాపు ఇరవై తిరుగుబాటు బృందాలు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాయి. సయోధ్య ఒప్పందాలూ కుదుర్చుకుంటున్నాయి. శాంతి, సామరస్యాలకు ఒప్పుకోని మణిపురీ ఉగ్రమూకలు మాత్రం విధ్వంసకాండకు(Violence in north east india) పాల్పడుతున్నాయి. వాటిలో ప్రజావిముక్తి సైన్యం (పీఎల్‌ఏ), మణిపుర్‌ నాగా పీపుల్స్‌ ఫ్రంట్‌ (ఎంఎన్‌పీఎఫ్‌) తాజా దాడికి(Manipur attack news) బాధ్యత తమదేనని ప్రకటించుకున్నాయి. శాసనసభ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆ రాష్ట్రంలో రాజకీయ హింస సైతం పెచ్చరిల్లుతోంది. ఆగ్నేయాసియాతో అనుసంధానంలో కీలకమైన కలాదాన్‌ ప్రాజెక్టు ఫలాలు సత్వరం అందుబాటులోకి రావాలంటే మణిపుర్‌లో శాంతి స్థాపన అత్యవసరం. చర్చలకు అంగీకరించని ఉగ్రవాద తండాలపై ఉక్కుపాదం మోపితేనే అది సాధ్యమవుతుంది!

డ్రాగన్ కుయుక్తులు..

ఈశాన్య భారతంలోని సంక్షుభిత పరిస్థితులు దాదాపుగా అదుపులోకి వచ్చాయని భారత సైన్యాధిపతి జనరల్‌ ఎం.ఎం.నరవణె పది నెలల క్రితం ప్రకటించారు. అక్కడ మోహరించిన బలగాలను కుదించబోతున్నట్లు వెల్లడించారు. మణిపుర్‌తో పాటు మిగిలిన ఆరు రాష్ట్రాల్లోనూ శాంతివీచికలు వీస్తున్నట్లు ఇటీవల అభివర్ణించిన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా- 2024 కల్లా ఉగ్రవాదం, అరాచకత్వాలను అరికడతామని ఉద్ఘాటించారు. మయన్మార్‌ సైనిక పాలకులను మచ్చిక చేసుకుని బంగాళాఖాతంపై పట్టుసాధించడానికి ఉవ్విళ్లూరుతున్న చైనా- ఈశాన్య భారతావనిలో కుంపట్లు రాజేయడానికి కుయుక్తులు పన్నుతోంది. స్థానిక తిరుగుబాటుదారులకు వెన్నుదన్నుగా నిలబడటంలో ఆ దేశం పాత్ర బహిరంగ రహస్యమే! చైనా నుంచి మయన్మార్‌, బంగ్లాదేశ్‌ల మీదుగా ఈశాన్య రాష్ట్రాల్లోకి వెల్లువెత్తుతున్న మారణాయుధాల గుట్టుమట్లు గతంలోనే బయటపడ్డాయి. ఆరేళ్ల క్రితం మణిపుర్‌లో డొగ్రా రెజిమెంట్‌ కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రదాడిలోనూ డ్రాగన్‌ హస్తం ఉందంటూ కథనాలు వెలువడ్డాయి. పద్దెనిమిది మంది సైనికులు అమరులైన ఆ ఘటన అనంతరం మళ్ళీ అంతటి స్థాయిలో ముష్కరులు తాజాగా పేట్రేగిపోవడం ఆందోళన రేకెత్తిస్తోంది.

వ్యూహాలు పదును తేలాలి..

మూడు వేల మంది వరకు నాగా, మణిపుర్‌, అస్సాం తిరుగుబాటుదారులు మయన్మార్‌లో(Myanmar militants in india) తలదాచుకున్నట్లు లోగడ వెలుగులోకి వచ్చింది. ఆ దేశంలోని క్యూక్సియు రేవును పూర్తిగా చేజిక్కించుకోవడానికి చైనా చేస్తున్న ప్రయత్నాలు సఫలమైతే- భద్రతాపరంగా ఇండియాకు చిక్కులు తప్పవు! డ్రాగన్‌ ఎత్తులు పారకుండా కాచుకోవడంతో పాటు ఉగ్రవాదంపై పోరులో మయన్మార్‌ సైన్యంతో సమన్వయాన్ని బలోపేతం చేసుకునేలా భారత వ్యూహాలు పదును తేలాలి. నిఘా ఏర్పాట్ల పటిష్ఠీకరణ, బలగాల మోహరింపు మొదలు అభివృద్ధి కార్యక్రమాలను జోరెత్తించడం దాకా బహుముఖ కార్యాచరణతో పాలకులు క్రియాశీలకంగా వ్యవహరిస్తేనే- ఈశాన్య రాష్ట్రాల్లో శాంతికపోతాలు ఎగరగలుగుతాయి!

ఇవీ చూడండి:

శరణార్థుల ముసుగులో మయన్మార్‌ నుంచి ఇండియాలోకి(Myanmar militants in india) ముష్కరులు చొరబడే ప్రమాదం ఉందనే హెచ్చరికలు కొన్నాళ్లుగా వినవస్తున్నాయి. ఆ విద్రోహుల మూలంగా మణిపుర్‌లో(Violence in north east india) మళ్ళీ హింస ప్రకోపించవచ్చుననే భయాందోళనలూ నెలకొన్నాయి. వాటిని నిజంచేస్తూ- ఆ రాష్ట్రంలోని(Manipur attack news) చురాచాంద్‌పుర్‌ జిల్లాలో కర్నల్‌ విప్లవ్‌ త్రిపాఠి వాహనశ్రేణిపై మెయ్‌తెయ్‌ తిరుగుబాటుదారులు భీకరదాడికి తెగబడ్డారు. త్రిపాఠితో పాటు ఆయన భార్యాబిడ్డలు, మరో నలుగురు సైనికులను నిర్దాక్షిణ్యంగా పొట్టన పెట్టుకున్నారు. ఈశాన్యభారతంలో(Violence in north east india) తిష్ఠవేసిన వందల కొద్దీ విద్రోహ బృందాలు- దశాబ్దాలుగా అక్కడ నెత్తుటేళ్లు పారించాయి.

12వేల మంది విగతజీవులుగా..

గడచిన ఇరవై ఏళ్లలో ఆ రాష్ట్రాల్లో 26వేలకు పైగా ఉగ్రవాద ఘటనలు చోటుచేసుకున్నాయి. భద్రతా దళాలు, పౌరులు, తిరుగుబాటుదారులతో కలిపి సుమారు పన్నెండు వేల మంది విగతజీవులయ్యారు. మయన్మార్‌ సైనిక సహకారంతో భారత బలగాలు చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్ల ఫలితంగా కొన్నేళ్లుగా ముష్కర మూకల కార్యకలాపాలు తగ్గుతూ వస్తున్నాయి. నాగా, కుకీ, కర్బీ, జొమీ వర్గాలకు చెందిన దాదాపు ఇరవై తిరుగుబాటు బృందాలు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాయి. సయోధ్య ఒప్పందాలూ కుదుర్చుకుంటున్నాయి. శాంతి, సామరస్యాలకు ఒప్పుకోని మణిపురీ ఉగ్రమూకలు మాత్రం విధ్వంసకాండకు(Violence in north east india) పాల్పడుతున్నాయి. వాటిలో ప్రజావిముక్తి సైన్యం (పీఎల్‌ఏ), మణిపుర్‌ నాగా పీపుల్స్‌ ఫ్రంట్‌ (ఎంఎన్‌పీఎఫ్‌) తాజా దాడికి(Manipur attack news) బాధ్యత తమదేనని ప్రకటించుకున్నాయి. శాసనసభ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆ రాష్ట్రంలో రాజకీయ హింస సైతం పెచ్చరిల్లుతోంది. ఆగ్నేయాసియాతో అనుసంధానంలో కీలకమైన కలాదాన్‌ ప్రాజెక్టు ఫలాలు సత్వరం అందుబాటులోకి రావాలంటే మణిపుర్‌లో శాంతి స్థాపన అత్యవసరం. చర్చలకు అంగీకరించని ఉగ్రవాద తండాలపై ఉక్కుపాదం మోపితేనే అది సాధ్యమవుతుంది!

డ్రాగన్ కుయుక్తులు..

ఈశాన్య భారతంలోని సంక్షుభిత పరిస్థితులు దాదాపుగా అదుపులోకి వచ్చాయని భారత సైన్యాధిపతి జనరల్‌ ఎం.ఎం.నరవణె పది నెలల క్రితం ప్రకటించారు. అక్కడ మోహరించిన బలగాలను కుదించబోతున్నట్లు వెల్లడించారు. మణిపుర్‌తో పాటు మిగిలిన ఆరు రాష్ట్రాల్లోనూ శాంతివీచికలు వీస్తున్నట్లు ఇటీవల అభివర్ణించిన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా- 2024 కల్లా ఉగ్రవాదం, అరాచకత్వాలను అరికడతామని ఉద్ఘాటించారు. మయన్మార్‌ సైనిక పాలకులను మచ్చిక చేసుకుని బంగాళాఖాతంపై పట్టుసాధించడానికి ఉవ్విళ్లూరుతున్న చైనా- ఈశాన్య భారతావనిలో కుంపట్లు రాజేయడానికి కుయుక్తులు పన్నుతోంది. స్థానిక తిరుగుబాటుదారులకు వెన్నుదన్నుగా నిలబడటంలో ఆ దేశం పాత్ర బహిరంగ రహస్యమే! చైనా నుంచి మయన్మార్‌, బంగ్లాదేశ్‌ల మీదుగా ఈశాన్య రాష్ట్రాల్లోకి వెల్లువెత్తుతున్న మారణాయుధాల గుట్టుమట్లు గతంలోనే బయటపడ్డాయి. ఆరేళ్ల క్రితం మణిపుర్‌లో డొగ్రా రెజిమెంట్‌ కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రదాడిలోనూ డ్రాగన్‌ హస్తం ఉందంటూ కథనాలు వెలువడ్డాయి. పద్దెనిమిది మంది సైనికులు అమరులైన ఆ ఘటన అనంతరం మళ్ళీ అంతటి స్థాయిలో ముష్కరులు తాజాగా పేట్రేగిపోవడం ఆందోళన రేకెత్తిస్తోంది.

వ్యూహాలు పదును తేలాలి..

మూడు వేల మంది వరకు నాగా, మణిపుర్‌, అస్సాం తిరుగుబాటుదారులు మయన్మార్‌లో(Myanmar militants in india) తలదాచుకున్నట్లు లోగడ వెలుగులోకి వచ్చింది. ఆ దేశంలోని క్యూక్సియు రేవును పూర్తిగా చేజిక్కించుకోవడానికి చైనా చేస్తున్న ప్రయత్నాలు సఫలమైతే- భద్రతాపరంగా ఇండియాకు చిక్కులు తప్పవు! డ్రాగన్‌ ఎత్తులు పారకుండా కాచుకోవడంతో పాటు ఉగ్రవాదంపై పోరులో మయన్మార్‌ సైన్యంతో సమన్వయాన్ని బలోపేతం చేసుకునేలా భారత వ్యూహాలు పదును తేలాలి. నిఘా ఏర్పాట్ల పటిష్ఠీకరణ, బలగాల మోహరింపు మొదలు అభివృద్ధి కార్యక్రమాలను జోరెత్తించడం దాకా బహుముఖ కార్యాచరణతో పాలకులు క్రియాశీలకంగా వ్యవహరిస్తేనే- ఈశాన్య రాష్ట్రాల్లో శాంతికపోతాలు ఎగరగలుగుతాయి!

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.