ETV Bharat / opinion

పారదర్శకతే బ్యాంకులకు రక్ష- రుణమంజూరులో జాగ్రత్తలు కీలకం

author img

By

Published : Nov 12, 2021, 7:45 AM IST

ఎస్‌బీఐ- దేశంలోనే అతి పెద్ద బ్యాంకు. ఛైర్మన్‌ పదవిలో ఉన్న వ్యక్తి బ్యాంకును లాభదాయకంగా నడపవలసి ఉంటుంది. దాన్ని నిర్వర్తించడానికి వారికి సరైన కార్యనిర్వహణ స్వేచ్ఛ ఉండాలి. గొడావణ్‌ విషయంలో ఎస్‌బీఐ ఛైర్మన్‌ పదవి నుంచి దిగిపోయిన తరవాత జరిగిన లావాదేవీకి ప్రతీప్‌ను బాధ్యుడిగా పేర్కొనడం విపరీతంగా అనిపిస్తోంది. ఇటువంటి వాటివల్ల ఇకపై ఏ బ్యాంకరూ సాహసించి వాణిజ్యపరమైన నిర్ణయాలు తీసుకోలేకపోవచ్చని ఆర్థిక రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

SBI
ఎస్​బీఐ

రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో ప్రస్తుత మార్కెట్‌ ధరల ప్రకారం రూ.200 కోట్లు పలికే ఒక ఆస్తిని కేవలం రూ.25 కోట్లకే తెగనమ్మడం వెనక మోసం ఉందంటూ, దానికి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) మాజీ ఛైర్మన్‌ ప్రతీప్‌ చౌధరిని బాధ్యుడిగా పేర్కొంటూ అరెస్టు చేయడం సంచలనం రేపింది. ప్రతీప్‌ను నవంబరు ఒకటి నుంచి 14 రోజుల పాటు జ్యుడీషియల్‌ కస్టడీకి పంపగా, తొమ్మిదో తేదీన ఆయనకు జైసల్మేర్‌లోని అదనపు జిల్లా, సెషన్స్‌ జడ్జి కోర్టు బెయిలు మంజూరు చేసింది. ప్రతీప్‌ అరెస్టు బ్యాంకుల మనోస్థైర్యాన్ని దెబ్బతీసి రుణాలివ్వాలంటేనే జంకే పరిస్థితి కల్పిస్తోందని బ్యాంకర్లు, ఆర్థిక రంగ నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎన్నో సందేహాలు

జైసల్మేర్‌లో గొడావణ్‌ గ్రూపు చేపట్టిన గఢ్‌ రాజ్వాడా హోటల్‌ ప్రాజెక్టుకు ఎస్‌బీఐ 2008లో రూ.24 కోట్ల రుణం మంజూరు చేసింది. ఆ ప్రాజెక్టు అనుకున్న ప్రకారం పూర్తికాలేదు. యజమాని దిలీప్‌ సింగ్‌ రాఠోడ్‌ 2010లో మరణించాక బ్యాంకు రుణానికి గొడావణ్‌ గ్రూపు ఎగనామం పెట్టింది. ఎస్‌బీఐ ఆ రుణాన్ని 2013లో నిరర్థక ఆస్తి (ఎన్‌పీఏ)గా ప్రకటించింది. రూ.24 కోట్ల రుణం 2014కల్లా వడ్డీతో కలుపుకొని రూ.40 కోట్లకు చేరింది. ఎస్‌బీఐ ఛైర్మన్‌గా ప్రతీప్‌ 2013 సెప్టెంబరులో ఉద్యోగ విరమణ చేశారు. 2014 మార్చిలో గొడావణ్‌ ఆస్తిని ఎస్‌బీఐ రూ.25 కోట్లకు ఆల్కెమిస్ట్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కంపెనీకి విక్రయించింది. తద్వారా ఎస్‌బీఐ తన అసలును రాబట్టుకుని వడ్డీకి మాత్రం నీళ్లొదిలేసింది. అదే ఏడాది అక్టోబర్‌లో ఆల్కెమిస్ట్‌ డైరెక్టర్ల బోర్డులో ప్రతీప్‌ చేరారు. గొడావణ్‌ ఆస్తిని బ్యాంకు విక్రయించినప్పుడు ప్రతీప్‌ అటు ఎస్‌బీఐలో, ఇటు ఆల్కెమిస్ట్‌లో ఏ పదవిలోనూ లేరు. అయినా విక్రయంలో మోసం జరిగిందంటూ ఆయన్ను అరెస్టు చేయడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. గొడావణ్‌ గ్రూపు నిర్వాహకులు తమ రాజకీయ పలుకుబడిని ఉపయోగించి ప్రతీప్‌ను చిక్కుల్లోకి నెడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

తమ హోటల్‌ ప్రాజెక్టు రూ.200 కోట్ల విలువ చేస్తుందంటున్న ప్రమోటర్లు అందులో సగం ధరకైనా హోటల్‌ను ఎందుకు అమ్ముకోలేకపోయారనేది కీలక ప్రశ్న. హోటల్‌ ప్రాజెక్టు వేలం గురించి ప్రసిద్ధ పత్రికల్లో ప్రకటనలు ఇచ్చినా కొనడానికి ఇతర హోటళ్లు, పెట్టుబడిదారులు ఎందుకు ముందుకురాలేదన్న సందేహమూ వ్యక్తమవుతోంది. ఆస్తి విలువను తక్కువగా నిర్ణయించడంలో, దాన్ని ఎన్‌పీఏగా విక్రయించడంలో ఎక్కడా ప్రతీప్‌ పాత్ర లేదు. అయినా అదంతా పెద్ద కుట్ర అని ఆరోపిస్తూ గొడావణ్‌ గ్రూపు ప్రస్తుత ప్రమోటర్‌ హరేంద్ర రాఠోడ్‌ 2015లో కేసు పెట్టారు. అది సివిల్‌ వివాదం కాబట్టి తమకు ప్రమేయం లేదంటూ రాజస్థాన్‌ పోలీసులు కేసును మూసివేశారు. తరవాత ఆల్కెమిస్ట్‌ ఆ ఆస్తిని 2017లో ఓ బ్యాంకింగేతర ఆర్థిక సంస్థకు విక్రయించింది. అది జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) ఆదేశాలకు అనుగుణంగా జరిగింది. అందులో మోసం, కుట్ర ఉన్నాయన్న హరేంద్ర ఆరోపణలను సుప్రీంకోర్టు సైతం తోసిపుచ్చింది. అంతకు ముందు రాజస్థాన్‌ పోలీసులు కేసును మూసివేయడాన్ని నిరసిస్తూ 2016లో హరేంద్ర స్థానిక కోర్టులో అర్జీ దాఖలు చేశారు. కోర్టు ఆదేశంపై గత నెల 31న పోలీసులు ప్రతీప్‌ను అరెస్టు చేశారు.

ప్రోత్సహించాల్సిన అవసరం

ఎస్‌బీఐ- దేశంలోనే అతి పెద్ద బ్యాంకు. ఛైర్మన్‌ పదవిలో ఉన్న వ్యక్తి బ్యాంకును లాభదాయకంగా నడపవలసి ఉంటుంది. దాన్ని నిర్వర్తించడానికి వారికి సరైన కార్యనిర్వహణ స్వేచ్ఛ ఉండాలి. గొడావణ్‌ విషయంలో ఎస్‌బీఐ ఛైర్మన్‌ పదవి నుంచి దిగిపోయిన తరవాత జరిగిన లావాదేవీకి ప్రతీప్‌ను బాధ్యుడిగా పేర్కొనడం విపరీతంగా అనిపిస్తోంది. ఇటువంటి వాటివల్ల ఇకపై ఏ బ్యాంకరూ సాహసించి వాణిజ్యపరమైన నిర్ణయాలు తీసుకోలేకపోవచ్చని ఆర్థిక రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునే శక్తిమంతులైన వ్యాపారులు తమ పలుకుబడిని దుర్వినియోగపరచి బ్యాంకర్లను ఇబ్బందిపెడుతున్నారని బ్యాంకింగ్‌ వర్గాలు వాపోతున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులకు సంబంధించిన కేసులను సీబీఐకి అప్పగించడం మేలని సూచిస్తున్నాయి.

గొడావణ్‌ హోటల్‌ ఆస్తి విక్రయానికి సంబంధించి నిబంధనలన్నీ సక్రమంగా పాటించామని, కేసు పూర్వాపరాలను స్థానిక కోర్టుకు ఎవరూ సరిగ్గా వివరించినట్లు లేదని ఎస్‌బీఐ తెలిపింది. కొవిడ్‌ సృష్టించిన ఆర్థిక విధ్వంసం నుంచి దేశం త్వరగా కోలుకోవాలంటే చిన్నాపెద్ద పరిశ్రమలకు, వ్యాపారాలకు బ్యాంకులు రుణాలిచ్చి ప్రోత్సహించవలసి ఉంటుంది. ప్రతీప్‌ అరెస్టు బ్యాంకర్లు వెనకడుగు వేసేలా ఉందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్‌పీఏల అసలు విలువలో కేవలం 15శాతం ధరకే వాటిని ఆస్తి పునర్నిర్మాణ సంస్థ(ఏఆర్‌సీ)లకు విక్రయించిన సందర్భాలూ ఉన్నాయి. ప్రాజెక్టు విలువను ఎక్కువగా చూపి రుణాలు తీసుకునే బడా కంపెనీలు తరవాత వాటిని యథేచ్ఛగా ఎగవేస్తుంటే, చిన్నస్థాయి ప్రమోటర్లను బ్యాంకులు వేధించడమూ కనిపిస్తుంది. అందుకే రుణ మంజూరు, దివాలా ప్రక్రియలు పారదర్శకంగా సాగవలసిన అవసరం ఉంది. బ్యాంకర్లు అందుకు బాధ్యత వహించాలి.

-- ఏఏవీ ప్రసాద్‌

ఇదీ చదవండి:

ద్రవ్యోల్బణ అంచనా చేరుకుంటాం: శక్తికాంత దాస్‌

రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో ప్రస్తుత మార్కెట్‌ ధరల ప్రకారం రూ.200 కోట్లు పలికే ఒక ఆస్తిని కేవలం రూ.25 కోట్లకే తెగనమ్మడం వెనక మోసం ఉందంటూ, దానికి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) మాజీ ఛైర్మన్‌ ప్రతీప్‌ చౌధరిని బాధ్యుడిగా పేర్కొంటూ అరెస్టు చేయడం సంచలనం రేపింది. ప్రతీప్‌ను నవంబరు ఒకటి నుంచి 14 రోజుల పాటు జ్యుడీషియల్‌ కస్టడీకి పంపగా, తొమ్మిదో తేదీన ఆయనకు జైసల్మేర్‌లోని అదనపు జిల్లా, సెషన్స్‌ జడ్జి కోర్టు బెయిలు మంజూరు చేసింది. ప్రతీప్‌ అరెస్టు బ్యాంకుల మనోస్థైర్యాన్ని దెబ్బతీసి రుణాలివ్వాలంటేనే జంకే పరిస్థితి కల్పిస్తోందని బ్యాంకర్లు, ఆర్థిక రంగ నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎన్నో సందేహాలు

జైసల్మేర్‌లో గొడావణ్‌ గ్రూపు చేపట్టిన గఢ్‌ రాజ్వాడా హోటల్‌ ప్రాజెక్టుకు ఎస్‌బీఐ 2008లో రూ.24 కోట్ల రుణం మంజూరు చేసింది. ఆ ప్రాజెక్టు అనుకున్న ప్రకారం పూర్తికాలేదు. యజమాని దిలీప్‌ సింగ్‌ రాఠోడ్‌ 2010లో మరణించాక బ్యాంకు రుణానికి గొడావణ్‌ గ్రూపు ఎగనామం పెట్టింది. ఎస్‌బీఐ ఆ రుణాన్ని 2013లో నిరర్థక ఆస్తి (ఎన్‌పీఏ)గా ప్రకటించింది. రూ.24 కోట్ల రుణం 2014కల్లా వడ్డీతో కలుపుకొని రూ.40 కోట్లకు చేరింది. ఎస్‌బీఐ ఛైర్మన్‌గా ప్రతీప్‌ 2013 సెప్టెంబరులో ఉద్యోగ విరమణ చేశారు. 2014 మార్చిలో గొడావణ్‌ ఆస్తిని ఎస్‌బీఐ రూ.25 కోట్లకు ఆల్కెమిస్ట్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కంపెనీకి విక్రయించింది. తద్వారా ఎస్‌బీఐ తన అసలును రాబట్టుకుని వడ్డీకి మాత్రం నీళ్లొదిలేసింది. అదే ఏడాది అక్టోబర్‌లో ఆల్కెమిస్ట్‌ డైరెక్టర్ల బోర్డులో ప్రతీప్‌ చేరారు. గొడావణ్‌ ఆస్తిని బ్యాంకు విక్రయించినప్పుడు ప్రతీప్‌ అటు ఎస్‌బీఐలో, ఇటు ఆల్కెమిస్ట్‌లో ఏ పదవిలోనూ లేరు. అయినా విక్రయంలో మోసం జరిగిందంటూ ఆయన్ను అరెస్టు చేయడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. గొడావణ్‌ గ్రూపు నిర్వాహకులు తమ రాజకీయ పలుకుబడిని ఉపయోగించి ప్రతీప్‌ను చిక్కుల్లోకి నెడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

తమ హోటల్‌ ప్రాజెక్టు రూ.200 కోట్ల విలువ చేస్తుందంటున్న ప్రమోటర్లు అందులో సగం ధరకైనా హోటల్‌ను ఎందుకు అమ్ముకోలేకపోయారనేది కీలక ప్రశ్న. హోటల్‌ ప్రాజెక్టు వేలం గురించి ప్రసిద్ధ పత్రికల్లో ప్రకటనలు ఇచ్చినా కొనడానికి ఇతర హోటళ్లు, పెట్టుబడిదారులు ఎందుకు ముందుకురాలేదన్న సందేహమూ వ్యక్తమవుతోంది. ఆస్తి విలువను తక్కువగా నిర్ణయించడంలో, దాన్ని ఎన్‌పీఏగా విక్రయించడంలో ఎక్కడా ప్రతీప్‌ పాత్ర లేదు. అయినా అదంతా పెద్ద కుట్ర అని ఆరోపిస్తూ గొడావణ్‌ గ్రూపు ప్రస్తుత ప్రమోటర్‌ హరేంద్ర రాఠోడ్‌ 2015లో కేసు పెట్టారు. అది సివిల్‌ వివాదం కాబట్టి తమకు ప్రమేయం లేదంటూ రాజస్థాన్‌ పోలీసులు కేసును మూసివేశారు. తరవాత ఆల్కెమిస్ట్‌ ఆ ఆస్తిని 2017లో ఓ బ్యాంకింగేతర ఆర్థిక సంస్థకు విక్రయించింది. అది జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) ఆదేశాలకు అనుగుణంగా జరిగింది. అందులో మోసం, కుట్ర ఉన్నాయన్న హరేంద్ర ఆరోపణలను సుప్రీంకోర్టు సైతం తోసిపుచ్చింది. అంతకు ముందు రాజస్థాన్‌ పోలీసులు కేసును మూసివేయడాన్ని నిరసిస్తూ 2016లో హరేంద్ర స్థానిక కోర్టులో అర్జీ దాఖలు చేశారు. కోర్టు ఆదేశంపై గత నెల 31న పోలీసులు ప్రతీప్‌ను అరెస్టు చేశారు.

ప్రోత్సహించాల్సిన అవసరం

ఎస్‌బీఐ- దేశంలోనే అతి పెద్ద బ్యాంకు. ఛైర్మన్‌ పదవిలో ఉన్న వ్యక్తి బ్యాంకును లాభదాయకంగా నడపవలసి ఉంటుంది. దాన్ని నిర్వర్తించడానికి వారికి సరైన కార్యనిర్వహణ స్వేచ్ఛ ఉండాలి. గొడావణ్‌ విషయంలో ఎస్‌బీఐ ఛైర్మన్‌ పదవి నుంచి దిగిపోయిన తరవాత జరిగిన లావాదేవీకి ప్రతీప్‌ను బాధ్యుడిగా పేర్కొనడం విపరీతంగా అనిపిస్తోంది. ఇటువంటి వాటివల్ల ఇకపై ఏ బ్యాంకరూ సాహసించి వాణిజ్యపరమైన నిర్ణయాలు తీసుకోలేకపోవచ్చని ఆర్థిక రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునే శక్తిమంతులైన వ్యాపారులు తమ పలుకుబడిని దుర్వినియోగపరచి బ్యాంకర్లను ఇబ్బందిపెడుతున్నారని బ్యాంకింగ్‌ వర్గాలు వాపోతున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులకు సంబంధించిన కేసులను సీబీఐకి అప్పగించడం మేలని సూచిస్తున్నాయి.

గొడావణ్‌ హోటల్‌ ఆస్తి విక్రయానికి సంబంధించి నిబంధనలన్నీ సక్రమంగా పాటించామని, కేసు పూర్వాపరాలను స్థానిక కోర్టుకు ఎవరూ సరిగ్గా వివరించినట్లు లేదని ఎస్‌బీఐ తెలిపింది. కొవిడ్‌ సృష్టించిన ఆర్థిక విధ్వంసం నుంచి దేశం త్వరగా కోలుకోవాలంటే చిన్నాపెద్ద పరిశ్రమలకు, వ్యాపారాలకు బ్యాంకులు రుణాలిచ్చి ప్రోత్సహించవలసి ఉంటుంది. ప్రతీప్‌ అరెస్టు బ్యాంకర్లు వెనకడుగు వేసేలా ఉందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్‌పీఏల అసలు విలువలో కేవలం 15శాతం ధరకే వాటిని ఆస్తి పునర్నిర్మాణ సంస్థ(ఏఆర్‌సీ)లకు విక్రయించిన సందర్భాలూ ఉన్నాయి. ప్రాజెక్టు విలువను ఎక్కువగా చూపి రుణాలు తీసుకునే బడా కంపెనీలు తరవాత వాటిని యథేచ్ఛగా ఎగవేస్తుంటే, చిన్నస్థాయి ప్రమోటర్లను బ్యాంకులు వేధించడమూ కనిపిస్తుంది. అందుకే రుణ మంజూరు, దివాలా ప్రక్రియలు పారదర్శకంగా సాగవలసిన అవసరం ఉంది. బ్యాంకర్లు అందుకు బాధ్యత వహించాలి.

-- ఏఏవీ ప్రసాద్‌

ఇదీ చదవండి:

ద్రవ్యోల్బణ అంచనా చేరుకుంటాం: శక్తికాంత దాస్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.