ETV Bharat / opinion

పాక్​ 'బ్లాక్​లిస్ట్'​ భవితవ్యం​ తేలేది ఈ నెలలోనే

author img

By

Published : Oct 5, 2020, 5:23 PM IST

"ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్​ను.. ఎఫ్​ఏటీఎఫ్​ బ్లాక్​లిస్ట్​ జాబితాలో చేర్చాల్సిందే"... ఇది కొన్నిరోజులుగా గట్టిగా వినిపిస్తున్న డిమాండ్​. ఓవైపు ఉగ్ర నిర్మూలకు ఉద్ధృతంగా పోరాడుతున్నమని చెబుతూనే.. మరోవైపు ముష్కర మూకలకు అండగా నిలుస్తున్న దాయాది భవితవ్యం ఈ నెలాఖరులో తేలనుంది. ఎఫ్​ఏటీఎఫ్ వర్చువల్​ సమావేశం అక్టోబర్ 21-23 మధ్య జరగనుంది.

FATF to decide about Pakistan
ఎఫ్​ఏటీఎఫ్​లో బ్లాక్​లిస్ట్.. పాక్​ భవితవ్యం​ తేలేది ఈ నెలలోనే

అంతర్జాతీయ సమాజంలో ఒక దేశంగా పాకిస్థాన్ భవిష్యత్తు ఏంటో తేల్చేందుకు.. ఫైనాన్షియల్​ యాక్షన్​ టాస్క్​ఫోర్స్ ఈ నెల చివరివారంలో సమావేశం కానుంది. ఉగ్రవాదానికి కొమ్ము కాస్తున్న పాక్​.. గ్రే లిస్ట్​లోనే కొనసాగుతుందా ? లేదంటే నిర్దేశిత లక్ష్యాలను అందుకోవటం విఫలమైన కారణంగా బ్లాక్​లిస్ట్​లోకి వెళ్లి 'ఉగ్రదేశం' ముద్ర వేయించుకుంటుందా అనేది త్వరలో తేలనుంది.

పారిస్​ కేంద్రంగా పనిచేసే ఎఫ్​ఏటీఎఫ్​లో 2018 నుంచి పాక్​ గ్రే జాబితాలోనే కొనసాగుతోంది. ఉగ్రవాదులకు అందుతున్న ఆర్థిక సాయాన్ని అడ్డుకోవాలని పాకిస్థాన్​ను అదేశిస్తే.. తానే స్వయంగా హవాలా చేస్తూ.. వారికి సాయపడుతోంది. ఉగ్రమూకలకు ఆశ్రయం కల్పిస్తూ తమ గడ్డపై నుంచే స్వేచ్ఛగా కార్యకలాపాలు సాగించుకునే విధంగా ప్రోత్సహిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆ దేశాన్ని నిషిద్ధ జాబితాలోకి చేర్చాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

బ్లాక్​ లిస్ట్​లో ప్రస్తుతం ఉత్తర కొరియా, ఇరాన్​ మాత్రమే ఉన్నాయి. వాటి సరసన పాక్​ చేరేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఎఫ్​ఏటీఎఫ్ అసంతృప్తి..

నిజానికి ఈ అంశంలో ప్రకటన గతేడాది చివర్లోనే వెలువడాల్సి ఉంది. అయితే, కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడింది. జూన్​లో జరగాల్సిన భేటీ మరోసారి తేదీ మార్చుకుని... అక్టోబర్​ 21-23 మధ్య వర్చువల్​ సమావేశంగా మారింది. అంతకుముందు ఫిబ్రవరిలో.. నాలుగు నెలల్లో అనుసరించాల్సిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, నిర్దేశించిన 27 అంశాల్లో కేవలం 14 విషయాల్లోనే కొంతమేర అడుగులు ముందుకు పడ్డాయని, 13 అంశాల్లో ఎటువంటి చర్యలు చేపట్టలేదని పాక్​పై అసంతృప్తి వ్యక్తం చేసింది ఎఫ్​ఏటీఎఫ్​. ఉగ్రవాద నిర్మూలనకు, వారికి అందుతున్న నిధులకు అడ్డకట్ట వేయటంలో పని పనితీరు ఆందోళనకరంగా ఉందని వ్యాఖ్యానించింది.

FATF

ఎఫ్​ఏటీఎఫ్ కథేంటి​..?

1989లో జీ-7 దేశాల చొరవతో పారిస్​ వేదికగా ఎఫ్​ఏటీఎఫ్ ఏర్పాటుచేశారు​. మనీలాండరింగ్ కట్టడి సహా అందులో భాగస్వాములయ్యే దేశాలు, సంస్థలపై తీసుకోవాల్సిన చర్యలను సిఫార్సు చేయడం ఎఫ్​ఏటీఎఫ్​ ప్రధాన విధి. ఇందులో భారత్​ సహా మొత్తం 39 సభ్యదేశాలు ఉన్నాయి. ఆసియా పసిఫిక్​ గ్రూప్​ వంటి 9 ప్రాంతీయ సంస్థలు అనుబంధ సభ్యులుగా ఉన్నాయి. ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్, ఇంటర్​పోల్, ఐడీబీ, ఓఈసీడీ వంటి 23 సంస్థలు 'పరిశీలకులు'గా ఉన్నాయి. ఎఫ్​ఏటీఎఫ్​ చేసే సిఫార్సులకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది.

ఏం చేస్తుంది..?

అక్రమ నగదు బదిలీ, ఉగ్ర నిధుల ప్రవాహం కట్టడి కోసం మొత్తం 50-లక్ష్యాలు నిర్దేశించింది ఎఫ్​ఏటీఎఫ్​. ఇందులో 40 'టెక్నికల్​ కాంప్లయన్స్​ రేటింగ్​'కు సంబంధించినవి. మిగిలిన 10 మనీలాండరింగ్, ఉగ్రనిధుల ప్రవాహం నియంత్రణకు ఆ దేశం ఎంత సమర్థంగా కృషిచేస్తుందో తెలిపేవి.

ఈ అంశాల ఆధారంగా పాకిస్థాన్​ పనితీరును 2018 అక్టోబర్ వరకు ఆసియా పసిఫిక్ గ్రూప్​(ఏపీజీ) మదింపు చేసింది. ఇందుకు సంబంధించిన నివేదికను ఎఫ్​ఏటీఎఫ్​కు అందించింది. ఈ నివేదిక ఆధారంగా.. కొన్ని సూచనలు చేసి, మరికొన్ని లక్ష్యాలను నిర్దేశించింది.

ఎఫ్​ఏటీఎఫ్​ 40 ప్రమాణాలలో పాకిస్థాన్​ కేవలం పూర్తిస్థాయిలో చర్యలు తీసుకున్నది ఒక్కదానిలోనే. చర్యలు చేపట్టినవి 9, పాక్షికంగా చర్యలు తీసుకున్నవి 26, అసలు చర్యలు తీసుకోనివి 4 ఉన్నట్లు నివేదిక పేర్కొంది. రెండో విభాగంలోని 10 ప్రమాణాలలో పాకిస్థాన్​ తొమ్మిదింటిని విస్మరించింది. ఇదే ఇప్పుడు పాక్​ ప్రభుత్వాన్ని, సైన్యాన్ని కలవరపెడుతోంది.

Pakistan's status this month
పాక్​ భవితవ్యం​ తేలేది ఈ నెలలోనే

పాక్​​ను బ్లాక్​ లిస్ట్​లో చేర్చితే...?

పాకిస్థాన్​ ఇప్పటికే తీవ్ర ఆర్థిక, రాజకీయ సంక్షోభం ఎదుర్కొంటోంది. ఎఫ్​ఏటీఎఫ్​ బ్లాక్​ లిస్ట్​లో చేర్చితే మరిన్ని ఆర్థిక ఆంక్షలు అమల్లోకి వచ్చి... దాయాది పరిస్థితి మరింత దయనీయంగా మారుతుంది. అలాంటి పరిణామాల్లో కొన్ని...

  1. అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, మదుపర్లు పాకిస్థాన్​ నుంచి పెట్టుబడులు ఉపసంహరించుకుంటారు.
  2. విదేశీ కరెన్సీ లావాదేవీలు, ఇతర దేశాల నుంచి పాక్​కు వచ్చే ఆదాయం​ భారీగా పడిపోతుంది.
  3. స్టాక్​ మార్కెట్​ కుప్పకూలుతుంది.
  4. విదేశీ నిల్వలు వేగంగా తరిగిపోతాయి.
  5. దేశీయ కరెన్సీ విలువ తగ్గిపోతుంది.
  6. ద్రవ్యోల్బణం పెరుగుతుంది.
  7. పాకిస్థాన్​తో వాణిజ్యం సాగించే దేశాలపై ఆంక్షలు విధించే అవకాశం ఉంటుంది.
  8. ఇతర దేశాల నుంచి రుణాలు, ఆర్థిక సహాయాలు వంటివి అగిపోయే ప్రమాదం ఉంది.
  9. పాక్​ అంతర్జాతీయ వాణిజ్యం ఒక్కసారిగా పడిపోతుంది.

భారత్ వైఖరి..

పాకిస్థాన్​ ప్రభుత్వం 21మంది ఉగ్రవాదులకు వీఐపీ భద్రతతో ఆశ్రయం కల్పిస్తున్నట్లుగా తెలుస్తోంది. భారత్ ఇప్పటికే ఉగ్రవాదంపై పాకిస్థాన్​ ద్వంద్వ వైఖరిని అంతర్జాతీయ వేదికలపై అనేక సార్లు బయటపెట్టింది. భారత్​లో దాడులకు తెగబడేందుకు ముష్కర మూకలకు శిక్షణనిస్తూ.. వారికి ఆయుధాలు సరఫరా చేస్తుందని స్పష్టం చేస్తోంది.

అంతర్జాతీయ సమాజాన్ని మభ్యపెట్టేందుకు.. భారత పౌరులు కొంతమందిని అంతర్జాతీయ తీవ్రవాదులుగా గుర్తించాలని మొరపెట్టుకుంటోంది. మొత్తంగా పాక్​లో నక్కిన ఉగ్రవాదులు, వారి స్థావరాలు, కార్యకలపాలపై.. పాక్ ప్రభుత్వం, సైన్యం, ఐఎస్​ఐకు పూర్తి అవగాహన ఉందంటున్నారు విశ్లేషకులు.

Pakistan's status
తప్పించుకునేందుకు పాక్​ తంటాలు

మరి పాక్ ఏం చేస్తోంది ?

ఇప్పటికే ద్రవ్యోల్బణం పెరిగి పాకిస్థాన్​ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. విదేశీ మారక నిల్వలు భారీగా క్షీణించడం ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుందనడానికి నిదర్శనం. ఈ దశలో పాక్ నిషిద్ధ జాబితాలోకి వెళ్లిపోతే చాలా కష్టమైపోతుంది. అందుకే, అంతర్జాతీయ సమాజం కళ్లుగప్పే చర్యలకు ఉపక్రమించింది.

ఆర్మీ నివేదికల ప్రకారం గత నెలలో పాకిస్థాన్​.. మరో 88మంది ఉగ్రసంస్థలకు చెందిన నేతలు, సభ్యులపై కఠిన ఆంక్షలు విధించామని ఐరాస​ భద్రతామండలికి నివేదించింది. ఈ తరహా ప్రకటనలతో​.. ఎఫ్​ఏటీఎఫ్​​ నిషిద్ధ జాబితా నుంచి తప్పించుకునేందుకు తంటాలు పడుతోంది. అందుకే ఆంక్షలు అని చెబుతున్నా.. ఎటువంటి చర్యలు తీసుకున్నారో బయటకు వెల్లడించడం లేదు. ఫైనాన్షియల్​ యాక్షన్​ టాస్క్​ ఫోర్స్ సమావేశంలో తమపై చర్యలు తీసుకోకుండా ఉండేందుకు బిల్లులు సైతం ప్రవేశపెడుతోంది.

ఆసియాలో ఉగ్రకార్యకలాపాలను పర్యవేక్షించే ఆసియా-పసిఫిక్​ గ్రూప్​.. ఏపీజీ సైతం సెప్టెంబర్​లో నిర్వహించిన వర్చువల్​ సమావేశంలో ఉగ్రవాద నిర్మూలనకు, నిధులకు అడ్డకట్ట వేయటంలో పని పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే, చైనా.. పాకిస్థాన్​కు అండగా నిలబడింది. అయితే... ఎఫ్​ఏటీఎఫ్​ విషయంలో పాకిస్థాన్​కు ఈసారి చైనా చేయకపోవచ్చని అంటున్నారు. ఏదేమైనా మరికొన్ని రోజుల్లో పాక్​ భవితవ్యం తేలనుంది.

అంతర్జాతీయ సమాజంలో ఒక దేశంగా పాకిస్థాన్ భవిష్యత్తు ఏంటో తేల్చేందుకు.. ఫైనాన్షియల్​ యాక్షన్​ టాస్క్​ఫోర్స్ ఈ నెల చివరివారంలో సమావేశం కానుంది. ఉగ్రవాదానికి కొమ్ము కాస్తున్న పాక్​.. గ్రే లిస్ట్​లోనే కొనసాగుతుందా ? లేదంటే నిర్దేశిత లక్ష్యాలను అందుకోవటం విఫలమైన కారణంగా బ్లాక్​లిస్ట్​లోకి వెళ్లి 'ఉగ్రదేశం' ముద్ర వేయించుకుంటుందా అనేది త్వరలో తేలనుంది.

పారిస్​ కేంద్రంగా పనిచేసే ఎఫ్​ఏటీఎఫ్​లో 2018 నుంచి పాక్​ గ్రే జాబితాలోనే కొనసాగుతోంది. ఉగ్రవాదులకు అందుతున్న ఆర్థిక సాయాన్ని అడ్డుకోవాలని పాకిస్థాన్​ను అదేశిస్తే.. తానే స్వయంగా హవాలా చేస్తూ.. వారికి సాయపడుతోంది. ఉగ్రమూకలకు ఆశ్రయం కల్పిస్తూ తమ గడ్డపై నుంచే స్వేచ్ఛగా కార్యకలాపాలు సాగించుకునే విధంగా ప్రోత్సహిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆ దేశాన్ని నిషిద్ధ జాబితాలోకి చేర్చాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

బ్లాక్​ లిస్ట్​లో ప్రస్తుతం ఉత్తర కొరియా, ఇరాన్​ మాత్రమే ఉన్నాయి. వాటి సరసన పాక్​ చేరేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఎఫ్​ఏటీఎఫ్ అసంతృప్తి..

నిజానికి ఈ అంశంలో ప్రకటన గతేడాది చివర్లోనే వెలువడాల్సి ఉంది. అయితే, కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడింది. జూన్​లో జరగాల్సిన భేటీ మరోసారి తేదీ మార్చుకుని... అక్టోబర్​ 21-23 మధ్య వర్చువల్​ సమావేశంగా మారింది. అంతకుముందు ఫిబ్రవరిలో.. నాలుగు నెలల్లో అనుసరించాల్సిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, నిర్దేశించిన 27 అంశాల్లో కేవలం 14 విషయాల్లోనే కొంతమేర అడుగులు ముందుకు పడ్డాయని, 13 అంశాల్లో ఎటువంటి చర్యలు చేపట్టలేదని పాక్​పై అసంతృప్తి వ్యక్తం చేసింది ఎఫ్​ఏటీఎఫ్​. ఉగ్రవాద నిర్మూలనకు, వారికి అందుతున్న నిధులకు అడ్డకట్ట వేయటంలో పని పనితీరు ఆందోళనకరంగా ఉందని వ్యాఖ్యానించింది.

FATF

ఎఫ్​ఏటీఎఫ్ కథేంటి​..?

1989లో జీ-7 దేశాల చొరవతో పారిస్​ వేదికగా ఎఫ్​ఏటీఎఫ్ ఏర్పాటుచేశారు​. మనీలాండరింగ్ కట్టడి సహా అందులో భాగస్వాములయ్యే దేశాలు, సంస్థలపై తీసుకోవాల్సిన చర్యలను సిఫార్సు చేయడం ఎఫ్​ఏటీఎఫ్​ ప్రధాన విధి. ఇందులో భారత్​ సహా మొత్తం 39 సభ్యదేశాలు ఉన్నాయి. ఆసియా పసిఫిక్​ గ్రూప్​ వంటి 9 ప్రాంతీయ సంస్థలు అనుబంధ సభ్యులుగా ఉన్నాయి. ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్, ఇంటర్​పోల్, ఐడీబీ, ఓఈసీడీ వంటి 23 సంస్థలు 'పరిశీలకులు'గా ఉన్నాయి. ఎఫ్​ఏటీఎఫ్​ చేసే సిఫార్సులకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది.

ఏం చేస్తుంది..?

అక్రమ నగదు బదిలీ, ఉగ్ర నిధుల ప్రవాహం కట్టడి కోసం మొత్తం 50-లక్ష్యాలు నిర్దేశించింది ఎఫ్​ఏటీఎఫ్​. ఇందులో 40 'టెక్నికల్​ కాంప్లయన్స్​ రేటింగ్​'కు సంబంధించినవి. మిగిలిన 10 మనీలాండరింగ్, ఉగ్రనిధుల ప్రవాహం నియంత్రణకు ఆ దేశం ఎంత సమర్థంగా కృషిచేస్తుందో తెలిపేవి.

ఈ అంశాల ఆధారంగా పాకిస్థాన్​ పనితీరును 2018 అక్టోబర్ వరకు ఆసియా పసిఫిక్ గ్రూప్​(ఏపీజీ) మదింపు చేసింది. ఇందుకు సంబంధించిన నివేదికను ఎఫ్​ఏటీఎఫ్​కు అందించింది. ఈ నివేదిక ఆధారంగా.. కొన్ని సూచనలు చేసి, మరికొన్ని లక్ష్యాలను నిర్దేశించింది.

ఎఫ్​ఏటీఎఫ్​ 40 ప్రమాణాలలో పాకిస్థాన్​ కేవలం పూర్తిస్థాయిలో చర్యలు తీసుకున్నది ఒక్కదానిలోనే. చర్యలు చేపట్టినవి 9, పాక్షికంగా చర్యలు తీసుకున్నవి 26, అసలు చర్యలు తీసుకోనివి 4 ఉన్నట్లు నివేదిక పేర్కొంది. రెండో విభాగంలోని 10 ప్రమాణాలలో పాకిస్థాన్​ తొమ్మిదింటిని విస్మరించింది. ఇదే ఇప్పుడు పాక్​ ప్రభుత్వాన్ని, సైన్యాన్ని కలవరపెడుతోంది.

Pakistan's status this month
పాక్​ భవితవ్యం​ తేలేది ఈ నెలలోనే

పాక్​​ను బ్లాక్​ లిస్ట్​లో చేర్చితే...?

పాకిస్థాన్​ ఇప్పటికే తీవ్ర ఆర్థిక, రాజకీయ సంక్షోభం ఎదుర్కొంటోంది. ఎఫ్​ఏటీఎఫ్​ బ్లాక్​ లిస్ట్​లో చేర్చితే మరిన్ని ఆర్థిక ఆంక్షలు అమల్లోకి వచ్చి... దాయాది పరిస్థితి మరింత దయనీయంగా మారుతుంది. అలాంటి పరిణామాల్లో కొన్ని...

  1. అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, మదుపర్లు పాకిస్థాన్​ నుంచి పెట్టుబడులు ఉపసంహరించుకుంటారు.
  2. విదేశీ కరెన్సీ లావాదేవీలు, ఇతర దేశాల నుంచి పాక్​కు వచ్చే ఆదాయం​ భారీగా పడిపోతుంది.
  3. స్టాక్​ మార్కెట్​ కుప్పకూలుతుంది.
  4. విదేశీ నిల్వలు వేగంగా తరిగిపోతాయి.
  5. దేశీయ కరెన్సీ విలువ తగ్గిపోతుంది.
  6. ద్రవ్యోల్బణం పెరుగుతుంది.
  7. పాకిస్థాన్​తో వాణిజ్యం సాగించే దేశాలపై ఆంక్షలు విధించే అవకాశం ఉంటుంది.
  8. ఇతర దేశాల నుంచి రుణాలు, ఆర్థిక సహాయాలు వంటివి అగిపోయే ప్రమాదం ఉంది.
  9. పాక్​ అంతర్జాతీయ వాణిజ్యం ఒక్కసారిగా పడిపోతుంది.

భారత్ వైఖరి..

పాకిస్థాన్​ ప్రభుత్వం 21మంది ఉగ్రవాదులకు వీఐపీ భద్రతతో ఆశ్రయం కల్పిస్తున్నట్లుగా తెలుస్తోంది. భారత్ ఇప్పటికే ఉగ్రవాదంపై పాకిస్థాన్​ ద్వంద్వ వైఖరిని అంతర్జాతీయ వేదికలపై అనేక సార్లు బయటపెట్టింది. భారత్​లో దాడులకు తెగబడేందుకు ముష్కర మూకలకు శిక్షణనిస్తూ.. వారికి ఆయుధాలు సరఫరా చేస్తుందని స్పష్టం చేస్తోంది.

అంతర్జాతీయ సమాజాన్ని మభ్యపెట్టేందుకు.. భారత పౌరులు కొంతమందిని అంతర్జాతీయ తీవ్రవాదులుగా గుర్తించాలని మొరపెట్టుకుంటోంది. మొత్తంగా పాక్​లో నక్కిన ఉగ్రవాదులు, వారి స్థావరాలు, కార్యకలపాలపై.. పాక్ ప్రభుత్వం, సైన్యం, ఐఎస్​ఐకు పూర్తి అవగాహన ఉందంటున్నారు విశ్లేషకులు.

Pakistan's status
తప్పించుకునేందుకు పాక్​ తంటాలు

మరి పాక్ ఏం చేస్తోంది ?

ఇప్పటికే ద్రవ్యోల్బణం పెరిగి పాకిస్థాన్​ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. విదేశీ మారక నిల్వలు భారీగా క్షీణించడం ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుందనడానికి నిదర్శనం. ఈ దశలో పాక్ నిషిద్ధ జాబితాలోకి వెళ్లిపోతే చాలా కష్టమైపోతుంది. అందుకే, అంతర్జాతీయ సమాజం కళ్లుగప్పే చర్యలకు ఉపక్రమించింది.

ఆర్మీ నివేదికల ప్రకారం గత నెలలో పాకిస్థాన్​.. మరో 88మంది ఉగ్రసంస్థలకు చెందిన నేతలు, సభ్యులపై కఠిన ఆంక్షలు విధించామని ఐరాస​ భద్రతామండలికి నివేదించింది. ఈ తరహా ప్రకటనలతో​.. ఎఫ్​ఏటీఎఫ్​​ నిషిద్ధ జాబితా నుంచి తప్పించుకునేందుకు తంటాలు పడుతోంది. అందుకే ఆంక్షలు అని చెబుతున్నా.. ఎటువంటి చర్యలు తీసుకున్నారో బయటకు వెల్లడించడం లేదు. ఫైనాన్షియల్​ యాక్షన్​ టాస్క్​ ఫోర్స్ సమావేశంలో తమపై చర్యలు తీసుకోకుండా ఉండేందుకు బిల్లులు సైతం ప్రవేశపెడుతోంది.

ఆసియాలో ఉగ్రకార్యకలాపాలను పర్యవేక్షించే ఆసియా-పసిఫిక్​ గ్రూప్​.. ఏపీజీ సైతం సెప్టెంబర్​లో నిర్వహించిన వర్చువల్​ సమావేశంలో ఉగ్రవాద నిర్మూలనకు, నిధులకు అడ్డకట్ట వేయటంలో పని పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే, చైనా.. పాకిస్థాన్​కు అండగా నిలబడింది. అయితే... ఎఫ్​ఏటీఎఫ్​ విషయంలో పాకిస్థాన్​కు ఈసారి చైనా చేయకపోవచ్చని అంటున్నారు. ఏదేమైనా మరికొన్ని రోజుల్లో పాక్​ భవితవ్యం తేలనుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.