ETV Bharat / opinion

బోధనలో కొత్త ఒరవడి.. ఇక అంతా ఆన్​లైన్

కరోనా మహమ్మారి వల్ల విద్యారంగం రూపురేఖలు మారిపోయాయి. కొత్త సంస్కరణలవైపు దేశం అడుగులు వేస్తోంది. 'ప్రధానమంత్రి ఈ-విద్య' కార్యక్రమం అటు వేసిన బలమైన అడుగుగా భావించవచ్ఛు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాలన్నీ సహకరిస్తే, విద్యాభ్యాసంలో ఆన్‌లైన్‌ పద్ధతి అత్యంత ఆదరణ పొందగల వీలుంది. నూతన విద్యా విధానానికి ప్రస్తుతం ఎదురవుతున్న కొత్త సవాళ్లతో సమ్మిళితం చేసే ప్రక్రియలో భాగంగా... ఉన్నత విద్యలో డిజిటల్‌, ఆన్‌లైన్‌, ఆన్‌ఎయిర్‌ వంటి కొత్త ప్రయత్నాలన్నింటినీ ఈ-విద్య ఏకతాటిపైకి తెస్తుంది.

author img

By

Published : Jun 23, 2020, 10:03 AM IST

effect of corona virus in Education field is leading to new reforms
బోధనకు కొత్త ఒరవడి.. ఆన్​లైన్​ బాట పట్టిన విద్యారంగం

కొవిడ్‌ మహమ్మారి సంప్రదాయ విద్యావిధానానికి పలు సవాళ్లు విసిరింది. అదే సమయంలో, ఎన్నో సంస్కరణలకు తలుపులు తెరవడానికి అవకాశాలు కల్పించింది. ఈ క్రమంలో సంక్షోభాలను అవకాశాలుగా మలచుకునే వ్యూహంతో ప్రభుత్వం మున్ముందు అన్ని స్థాయుల్లో డిజిటల్‌ విద్య దిశగా అడుగులు వేసేందుకు సిద్ధమవుతోంది. 'ప్రధానమంత్రి ఈ-విద్య' కార్యక్రమం అటు వేసిన బలమైన అడుగుగా భావించవచ్ఛు ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాలన్నీ సహకరిస్తే, విద్యాభ్యాసంలో ఆన్‌లైన్‌ పద్ధతి అత్యంత ఆదరణ పొందగల వీలుంది. మనదేశంలో నాలుగు గోడల మధ్య బోధించే విద్యా విధానమే ఎన్నో ఏళ్లుగా ఆచరణాత్మకంగా ఉంటూ వస్తోంది. అంతర్జాల సాంకేతిక పరిజ్ఞానం అత్యంత వేగంగా ముందడుగు వేస్తున్న కాలంలో సైతం సంప్రదాయ విద్యారంగం అడుగులు ముందుకు పడటం లేదు. ఆన్‌లైన్‌ విద్యాబోధన వల్ల అభ్యసన ప్రక్రియ బలహీనపడుతుందనేది పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల వాదన. ఇలా బలంగా పాతుకుపోయిన అభిప్రాయాల కారణంగా ఆన్‌లైన్‌ విద్యకు అంతగా ఆదరణ దక్కలేదు. భారత్‌లోకి కొవిడ్‌ అడుగుపెట్టి, వేగంగా వ్యాపించడంతో దేశంలోని విద్యాకేంద్రాలు చాలావరకు మూతపడ్డాయి. అవి త్వరలో తెరుచుకునే అవకాశాలూ అంతంత మాత్రంగానే కనిపిస్తున్నాయి. ఈ సరికొత్త మార్పులకు సంబంధించిన వాస్తవాన్ని గ్రహించిన పాఠశాలలు, కళాశాలలు, శిక్షణ కేంద్రాలు ఆన్‌లైన్‌ విద్యా పద్ధతి వైపు మొగ్గు చూపుతున్నాయి. దీనినే ప్రధాన పద్ధతిగా మార్చుకున్నాయి. ఫలితంగా, విద్యారంగంలోని కీలక శక్తులు సైతం ఆన్‌లైన్‌ విద్యపై వ్యతిరేక అభిప్రాయాలకు తిలోదకాలిస్తూ, వేగంగా వస్తున్న మార్పుల్ని అందిపుచ్చుకోవడం ప్రారంభించాయి. ఆన్‌లైన్‌ విద్యపై విద్యార్థుల్లోనూ సానుకూలత, ఆమోదనీయత పెరగడానికి పలుకారణాలు తోడయ్యాయి. ఒక్క ముక్కలో- రాబోయే కాలంలో విద్యా పద్ధతి విభిన్నంగా ఉండబోతోంది.

డిజిటల్‌ అభ్యసనం వైపు...

రాబోయే కాలంలో ఇలాంటి పరిసితి వాస్తవరూపం దాల్చే అవకాశం ఉండటంతో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి (హెచ్‌ఆర్‌డీ) మంత్రిత్వ శాఖ ఈ మార్పు దిశగా ముందు వరసన నడిచేందుకు కృషి చేస్తోంది. 'పీఎం ఈ-విద్య' కార్యక్రమం ద్వారా డిజిటల్‌ అభ్యసన ప్రక్రియను ప్రోత్సహించే దిశగా సాగుతోంది. తాజా పరిణామాలపై హెచ్‌ఆర్‌డీ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ నిశాంక్‌ స్పందిస్తూ... కొవిడ్‌ కారణంగా విద్యారంగానికి ఎదురైన సవాలును ఎదుర్కొనేందుకు విద్యావ్యవస్థలో భారీ మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. పట్టణ ప్రాంతంలో చదివే విద్యార్థికి అందుబాటులో ఉండే పాఠ్యసామగ్రి పల్లెలో ఉండే విద్యార్థికి సైతం సమాన స్థాయిలో ఉండాలంటున్నారు. ఈ దిశగా తొలి అడుగుగా, పాఠ్య ప్రణాళికను సాంకేతిక పరిజ్ఞానాన్ని సమ్మిళితం చేస్తున్నామని, విభిన్న రంగాల భౌగోళిక ప్రాంతాలు, నేపథ్యాలు ఉండే విద్యార్థులందరికీ ‘పీఎం ఈ-విద్య’ సమాన అవకాశాలను కల్పిస్తుందని అభిప్రాయపడుతున్నారు.

కేంద్ర హెచ్‌ఆర్‌డీ మంత్రిత్వశాఖ 2020-21 సంవత్సరానికిగాను యూజీసీ నుంచి ముందస్తు ఆమోదం లేకుండా పూర్తిస్థాయి ఆన్‌లైన్‌ డిగ్రీ కోర్సుల నిర్వహణకు విశ్వవిద్యాలయాల్ని ఎంపిక చేసేందుకు అనుమతి ఇచ్చింది. ఈ లక్ష్యసాధన కోసం విద్యార్థులకు నాణ్యమైన విద్యను కొనసాగేలా చూసేందుకు కొత్త ఆన్‌లైన్‌ కోర్సుల్ని ప్రారంభించేందుకు హెచ్‌ఆర్‌డీ శాఖ 100 ఉన్నత విద్యాసంస్థలను ఎంపిక చేయనుంది. భారత్‌లో ప్రస్తుతం 50.40 కోట్ల క్రియాశీలక అంతర్జాల వినియోగదారులు ఉన్నారు. కొత్త విద్యావిధానం కింద ప్రభుత్వం అంతర్జాల వినియోగదారులు పెద్దసంఖ్యలో ఉండటాన్ని సావకాశంగా మలచుకుని ఉన్నత విద్యలో ‘స్థూల నమోదు నిష్పత్తి(జీఈఆర్‌)’ని పెంచాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు హెచ్‌ఆర్‌డీ మంత్రిత్వశాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. మనదేశంలో 18 నుంచి 23 సంవత్సరాల మధ్య వయసులో 15 కోట్ల మంది ఉండగా, 3.7 కోట్ల మంది (26.3శాతం) మాత్రమే విద్యావ్యవస్థలో నమోదయ్యారు. ఇది అమెరికాలో 88 శాతం, బ్రిటన్‌లో 60 శాతం, చైనాలో 48 శాతంగా ఉంది. ఉన్నత విద్యలో జీఈఆర్‌ను పెంచేందుకు దేశవ్యాప్తంగా 736 జిల్లాల్లో కనీసం ఒకటి చొప్పున బహుళ అంశాలతో కూడిన కళాశాలలను ఏర్పాటు చేయాలని హెచ్‌ఆర్‌డీ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఇలాంటి కళాశాలలను డిజిటల్‌ సాధన సంపత్తితో తీర్చిదిద్దాలని, దానివల్ల ఆ జిల్లాలోని మారుమూల ప్రాంతంలో ఉండేవారికీ ఆన్‌లైన్‌ విద్యను అందించడం సాధ్యమవుతుందని భావిస్తోంది.

అదేబాటలో యూజీసీ

ఈ క్రమంలో 'యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ)' సైతం మారిన పరిస్థితుల్లో నిబంధనల సడలింపును పరిశీలిస్తోంది. లాక్‌డౌన్‌ కారణంగా విద్యారంగానికి జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు దూరవిద్య కోర్సుల్ని అందించేందుకు మరిన్ని విద్యాసంస్థలకు అనుమతి ఇవ్వడానికి నిబంధనలను కొంతమేర సరళీకరించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కొవిడ్‌ మహమ్మారితో ఎదురవుతున్న సవాళ్లను అర్థం చేసుకున్న కొన్ని ప్రముఖ విద్యాసంస్థలు ఓపెన్‌ బుక్‌ ఎగ్జామినేషన్‌ (ఓబీఈ) ఆన్‌లైన్‌ పరీక్షల పద్ధతి అమలుకు సంబంధించిన సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నాయి. సంప్రదాయ కలం-కాగితం పద్ధతిలో పరీక్షల నిర్వహణకు సాధ్యం కాకపోతే ఓబీఈ ఆన్‌లైన్‌ పరీక్షకు మారిపోవాలని దిల్లీ విశ్వవిద్యాలయం నిర్ణయించింది.

ఈ తరహా మార్పు ఉన్నత విద్యపై అంతర్జాతీయ సహకారంపైనా ప్రభావం చూపుతుంది. మహమ్మారి సంక్షోభం నేపథ్యంలో ఉన్నత విద్యారంగంలో భారత్‌తో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా విద్య, పరిశోధనలో సహకారాన్ని కొనసాగించేందుకు ఫ్రాన్స్‌ కొత్తమార్గాల్ని అన్వేషిస్తోంది. భారతీయ విద్యార్థుల కోసం అవసరమైతే వర్చువల్‌ తరగతుల నిర్వహణ ద్వారా ప్రస్తుత విద్యా సంవత్సరాన్ని ప్రారంభించేందుకు ఫ్రాన్స్‌ పూర్తిస్థాయిలో సన్నద్ధమైందని, సెప్టెంబర్‌లో ప్రారంభమయ్యే తరగతులకు భారతీయ విద్యార్థులు చేరతారనే విశ్వసిస్తున్నట్లు దిల్లీలో ఫ్రాన్స్‌ ఎంబసీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇకనుంచి విద్యావ్యవస్థ సరికొత్త సాంకేతిక బాటలో పయనిస్తుందనడానికి ఈ పరిణామాలే సంకేతాలు!

'ఆన్‌లైన్‌ వ్యవస్థీకరణ'కు రంగం సిద్ధం

నూతన విద్యా విధానాన్ని ప్రస్తుతం ఎదురవుతున్న కొత్త సవాళ్లతో సమ్మిళితం చేసే ప్రక్రియలో భాగంగా... ఉన్నత విద్యలో డిజిటల్‌, ఆన్‌లైన్‌, ఆన్‌ఎయిర్‌ వంటి కొత్త ప్రయత్నాలన్నింటినీ ఈ-విద్య ఏకతాటిపైకి తెస్తుంది. ఇందులో భాగంగా, మొత్తం 12 డీటీహెచ్‌ ఛానళ్లు, ఒకటి నుంచి పన్నెండో తరగతి వరకు ప్రతి తరగతికీ ఒక ఛానల్‌- విద్యార్థుల ఇళ్లకే నేరుగా పాఠాలను చేరవేస్తాయి. 12 కొత్త డీటీహెచ్‌ ఛానళ్లకుగాను ప్రతి ఛానల్‌లో రోజుకు ఆరు గంటలకు సరిపడే పాఠ్యాంశాలు ఉంటాయి. ఇవి మూడుసార్లు పునర్‌ ప్రసారంతో రోజంతా నడుస్తాయి. 'స్కైప్' సాంకేతికత ద్వారా విషయ నిపుణులు ప్రత్యక్ష సెషన్లలో పాల్గొంటారు. ఈ ఛానళ్లు అందరికీ తేలికగా అందుబాటులో ఉండేందుకుగాను హెచ్‌ఆర్‌డీ మంత్రిత్వశాఖ టాటాస్కై, ఎయిర్‌టెల్‌ వంటి ప్రైవేట్‌ డీటీహెచ్‌ ఆపరేటర్లతో ఒప్పందాలు చేసుకుంది. ఆయా రాష్ట్రాలు తమ అవసరాలకు అనుగుణంగా పాఠ్యాంశాలను అభివృద్ధి చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలనూ కోరాయి. వాటిని సైతం ఈ మాధ్యమాల ద్వారా ప్రసారం చేస్తారు.

- రాజీవ్‌ రాజన్‌

కొవిడ్‌ మహమ్మారి సంప్రదాయ విద్యావిధానానికి పలు సవాళ్లు విసిరింది. అదే సమయంలో, ఎన్నో సంస్కరణలకు తలుపులు తెరవడానికి అవకాశాలు కల్పించింది. ఈ క్రమంలో సంక్షోభాలను అవకాశాలుగా మలచుకునే వ్యూహంతో ప్రభుత్వం మున్ముందు అన్ని స్థాయుల్లో డిజిటల్‌ విద్య దిశగా అడుగులు వేసేందుకు సిద్ధమవుతోంది. 'ప్రధానమంత్రి ఈ-విద్య' కార్యక్రమం అటు వేసిన బలమైన అడుగుగా భావించవచ్ఛు ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాలన్నీ సహకరిస్తే, విద్యాభ్యాసంలో ఆన్‌లైన్‌ పద్ధతి అత్యంత ఆదరణ పొందగల వీలుంది. మనదేశంలో నాలుగు గోడల మధ్య బోధించే విద్యా విధానమే ఎన్నో ఏళ్లుగా ఆచరణాత్మకంగా ఉంటూ వస్తోంది. అంతర్జాల సాంకేతిక పరిజ్ఞానం అత్యంత వేగంగా ముందడుగు వేస్తున్న కాలంలో సైతం సంప్రదాయ విద్యారంగం అడుగులు ముందుకు పడటం లేదు. ఆన్‌లైన్‌ విద్యాబోధన వల్ల అభ్యసన ప్రక్రియ బలహీనపడుతుందనేది పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల వాదన. ఇలా బలంగా పాతుకుపోయిన అభిప్రాయాల కారణంగా ఆన్‌లైన్‌ విద్యకు అంతగా ఆదరణ దక్కలేదు. భారత్‌లోకి కొవిడ్‌ అడుగుపెట్టి, వేగంగా వ్యాపించడంతో దేశంలోని విద్యాకేంద్రాలు చాలావరకు మూతపడ్డాయి. అవి త్వరలో తెరుచుకునే అవకాశాలూ అంతంత మాత్రంగానే కనిపిస్తున్నాయి. ఈ సరికొత్త మార్పులకు సంబంధించిన వాస్తవాన్ని గ్రహించిన పాఠశాలలు, కళాశాలలు, శిక్షణ కేంద్రాలు ఆన్‌లైన్‌ విద్యా పద్ధతి వైపు మొగ్గు చూపుతున్నాయి. దీనినే ప్రధాన పద్ధతిగా మార్చుకున్నాయి. ఫలితంగా, విద్యారంగంలోని కీలక శక్తులు సైతం ఆన్‌లైన్‌ విద్యపై వ్యతిరేక అభిప్రాయాలకు తిలోదకాలిస్తూ, వేగంగా వస్తున్న మార్పుల్ని అందిపుచ్చుకోవడం ప్రారంభించాయి. ఆన్‌లైన్‌ విద్యపై విద్యార్థుల్లోనూ సానుకూలత, ఆమోదనీయత పెరగడానికి పలుకారణాలు తోడయ్యాయి. ఒక్క ముక్కలో- రాబోయే కాలంలో విద్యా పద్ధతి విభిన్నంగా ఉండబోతోంది.

డిజిటల్‌ అభ్యసనం వైపు...

రాబోయే కాలంలో ఇలాంటి పరిసితి వాస్తవరూపం దాల్చే అవకాశం ఉండటంతో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి (హెచ్‌ఆర్‌డీ) మంత్రిత్వ శాఖ ఈ మార్పు దిశగా ముందు వరసన నడిచేందుకు కృషి చేస్తోంది. 'పీఎం ఈ-విద్య' కార్యక్రమం ద్వారా డిజిటల్‌ అభ్యసన ప్రక్రియను ప్రోత్సహించే దిశగా సాగుతోంది. తాజా పరిణామాలపై హెచ్‌ఆర్‌డీ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ నిశాంక్‌ స్పందిస్తూ... కొవిడ్‌ కారణంగా విద్యారంగానికి ఎదురైన సవాలును ఎదుర్కొనేందుకు విద్యావ్యవస్థలో భారీ మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. పట్టణ ప్రాంతంలో చదివే విద్యార్థికి అందుబాటులో ఉండే పాఠ్యసామగ్రి పల్లెలో ఉండే విద్యార్థికి సైతం సమాన స్థాయిలో ఉండాలంటున్నారు. ఈ దిశగా తొలి అడుగుగా, పాఠ్య ప్రణాళికను సాంకేతిక పరిజ్ఞానాన్ని సమ్మిళితం చేస్తున్నామని, విభిన్న రంగాల భౌగోళిక ప్రాంతాలు, నేపథ్యాలు ఉండే విద్యార్థులందరికీ ‘పీఎం ఈ-విద్య’ సమాన అవకాశాలను కల్పిస్తుందని అభిప్రాయపడుతున్నారు.

కేంద్ర హెచ్‌ఆర్‌డీ మంత్రిత్వశాఖ 2020-21 సంవత్సరానికిగాను యూజీసీ నుంచి ముందస్తు ఆమోదం లేకుండా పూర్తిస్థాయి ఆన్‌లైన్‌ డిగ్రీ కోర్సుల నిర్వహణకు విశ్వవిద్యాలయాల్ని ఎంపిక చేసేందుకు అనుమతి ఇచ్చింది. ఈ లక్ష్యసాధన కోసం విద్యార్థులకు నాణ్యమైన విద్యను కొనసాగేలా చూసేందుకు కొత్త ఆన్‌లైన్‌ కోర్సుల్ని ప్రారంభించేందుకు హెచ్‌ఆర్‌డీ శాఖ 100 ఉన్నత విద్యాసంస్థలను ఎంపిక చేయనుంది. భారత్‌లో ప్రస్తుతం 50.40 కోట్ల క్రియాశీలక అంతర్జాల వినియోగదారులు ఉన్నారు. కొత్త విద్యావిధానం కింద ప్రభుత్వం అంతర్జాల వినియోగదారులు పెద్దసంఖ్యలో ఉండటాన్ని సావకాశంగా మలచుకుని ఉన్నత విద్యలో ‘స్థూల నమోదు నిష్పత్తి(జీఈఆర్‌)’ని పెంచాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు హెచ్‌ఆర్‌డీ మంత్రిత్వశాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. మనదేశంలో 18 నుంచి 23 సంవత్సరాల మధ్య వయసులో 15 కోట్ల మంది ఉండగా, 3.7 కోట్ల మంది (26.3శాతం) మాత్రమే విద్యావ్యవస్థలో నమోదయ్యారు. ఇది అమెరికాలో 88 శాతం, బ్రిటన్‌లో 60 శాతం, చైనాలో 48 శాతంగా ఉంది. ఉన్నత విద్యలో జీఈఆర్‌ను పెంచేందుకు దేశవ్యాప్తంగా 736 జిల్లాల్లో కనీసం ఒకటి చొప్పున బహుళ అంశాలతో కూడిన కళాశాలలను ఏర్పాటు చేయాలని హెచ్‌ఆర్‌డీ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఇలాంటి కళాశాలలను డిజిటల్‌ సాధన సంపత్తితో తీర్చిదిద్దాలని, దానివల్ల ఆ జిల్లాలోని మారుమూల ప్రాంతంలో ఉండేవారికీ ఆన్‌లైన్‌ విద్యను అందించడం సాధ్యమవుతుందని భావిస్తోంది.

అదేబాటలో యూజీసీ

ఈ క్రమంలో 'యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ)' సైతం మారిన పరిస్థితుల్లో నిబంధనల సడలింపును పరిశీలిస్తోంది. లాక్‌డౌన్‌ కారణంగా విద్యారంగానికి జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు దూరవిద్య కోర్సుల్ని అందించేందుకు మరిన్ని విద్యాసంస్థలకు అనుమతి ఇవ్వడానికి నిబంధనలను కొంతమేర సరళీకరించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కొవిడ్‌ మహమ్మారితో ఎదురవుతున్న సవాళ్లను అర్థం చేసుకున్న కొన్ని ప్రముఖ విద్యాసంస్థలు ఓపెన్‌ బుక్‌ ఎగ్జామినేషన్‌ (ఓబీఈ) ఆన్‌లైన్‌ పరీక్షల పద్ధతి అమలుకు సంబంధించిన సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నాయి. సంప్రదాయ కలం-కాగితం పద్ధతిలో పరీక్షల నిర్వహణకు సాధ్యం కాకపోతే ఓబీఈ ఆన్‌లైన్‌ పరీక్షకు మారిపోవాలని దిల్లీ విశ్వవిద్యాలయం నిర్ణయించింది.

ఈ తరహా మార్పు ఉన్నత విద్యపై అంతర్జాతీయ సహకారంపైనా ప్రభావం చూపుతుంది. మహమ్మారి సంక్షోభం నేపథ్యంలో ఉన్నత విద్యారంగంలో భారత్‌తో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా విద్య, పరిశోధనలో సహకారాన్ని కొనసాగించేందుకు ఫ్రాన్స్‌ కొత్తమార్గాల్ని అన్వేషిస్తోంది. భారతీయ విద్యార్థుల కోసం అవసరమైతే వర్చువల్‌ తరగతుల నిర్వహణ ద్వారా ప్రస్తుత విద్యా సంవత్సరాన్ని ప్రారంభించేందుకు ఫ్రాన్స్‌ పూర్తిస్థాయిలో సన్నద్ధమైందని, సెప్టెంబర్‌లో ప్రారంభమయ్యే తరగతులకు భారతీయ విద్యార్థులు చేరతారనే విశ్వసిస్తున్నట్లు దిల్లీలో ఫ్రాన్స్‌ ఎంబసీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇకనుంచి విద్యావ్యవస్థ సరికొత్త సాంకేతిక బాటలో పయనిస్తుందనడానికి ఈ పరిణామాలే సంకేతాలు!

'ఆన్‌లైన్‌ వ్యవస్థీకరణ'కు రంగం సిద్ధం

నూతన విద్యా విధానాన్ని ప్రస్తుతం ఎదురవుతున్న కొత్త సవాళ్లతో సమ్మిళితం చేసే ప్రక్రియలో భాగంగా... ఉన్నత విద్యలో డిజిటల్‌, ఆన్‌లైన్‌, ఆన్‌ఎయిర్‌ వంటి కొత్త ప్రయత్నాలన్నింటినీ ఈ-విద్య ఏకతాటిపైకి తెస్తుంది. ఇందులో భాగంగా, మొత్తం 12 డీటీహెచ్‌ ఛానళ్లు, ఒకటి నుంచి పన్నెండో తరగతి వరకు ప్రతి తరగతికీ ఒక ఛానల్‌- విద్యార్థుల ఇళ్లకే నేరుగా పాఠాలను చేరవేస్తాయి. 12 కొత్త డీటీహెచ్‌ ఛానళ్లకుగాను ప్రతి ఛానల్‌లో రోజుకు ఆరు గంటలకు సరిపడే పాఠ్యాంశాలు ఉంటాయి. ఇవి మూడుసార్లు పునర్‌ ప్రసారంతో రోజంతా నడుస్తాయి. 'స్కైప్' సాంకేతికత ద్వారా విషయ నిపుణులు ప్రత్యక్ష సెషన్లలో పాల్గొంటారు. ఈ ఛానళ్లు అందరికీ తేలికగా అందుబాటులో ఉండేందుకుగాను హెచ్‌ఆర్‌డీ మంత్రిత్వశాఖ టాటాస్కై, ఎయిర్‌టెల్‌ వంటి ప్రైవేట్‌ డీటీహెచ్‌ ఆపరేటర్లతో ఒప్పందాలు చేసుకుంది. ఆయా రాష్ట్రాలు తమ అవసరాలకు అనుగుణంగా పాఠ్యాంశాలను అభివృద్ధి చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలనూ కోరాయి. వాటిని సైతం ఈ మాధ్యమాల ద్వారా ప్రసారం చేస్తారు.

- రాజీవ్‌ రాజన్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.