ETV Bharat / opinion

విద్యారంగానికి కరోనా- పరీక్షల నిర్వహణపై అయోమయం!

కరోనా లాక్​డౌన్​ కారణంగా ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు. మనం దేశంలోనూ చాలా రాష్ట్రాలు 6 నుంచి 9 తరగతుల విద్యార్థులను పరీక్షలు లేకుండా పై తరగతులకు పంపాలని నిర్ణయించాయి. అయితే మార్కులు, వెయిటేజీపై అనేక మందికి అనుమానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో యూనియన్ గ్రాంట్స్ కమిషన్​.. ప్రభుత్వానికి కొన్ని సిఫార్సులు చేసింది.

author img

By

Published : Apr 30, 2020, 8:24 AM IST

students
విద్యార్థులు

పరీక్షలు ఎప్పుడు రాయాలో తెలియని డోలాయమానంలో పడిన విద్యార్థులు నేడు ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల మందికి పైగా ఉన్నారు. యునెస్కో తాజా నివేదిక ప్రకారం 191 దేశాల్లో 157 కోట్ల మందికి పైగా విద్యార్థులు కరోనా ప్రభావంతో లాక్‌డౌన్‌లో ఇళ్లకే పరిమితమయ్యారు. భారత్‌లో ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు 32 కోట్లకు పైగా విద్యార్థులు ఉన్నారు. వీరిలో కొంతమంది పాఠ్యప్రణాళిక పూర్తిచేసి పరీక్షలు రాయడానికి సిద్ధమైన వేళ, మరి కొంతమంది సిలబస్‌ చివరి దశలో ఉన్న సమయంలో లాక్‌డౌన్‌ వచ్చిపడింది.

ఈ విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి దేశంలోని కేంద్రీయ పాఠశాలలు రాష్ట్రాల పాఠశాలల్లోని విద్యార్థులను 6 నుంచి 9 తరగతుల వరకు పరీక్షలు లేకుండానే పై తరగతులకు పంపాలని నిర్ణయించగా మిగతా విద్యార్థులకు మిగిలిపోయిన సిలబస్‌ పూర్తిచేయడానికి, పరీక్షలకు సమాయత్తం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, అనేక ఇతర విద్యా సంస్థలు ఆన్‌లైన్‌ పాఠాలు చెప్పడం ప్రారంభించాయి.

వెసులుబాటు కల్పించనున్న సిఫార్సులు

ఉన్నత విద్యారంగంలో 25 శాతం పాఠ్యప్రణాళికను అంతర్జాలం ఆధారంగా బోధించాలని, మిగతా 75శాతం ప్రణాళికను తరగతి గదుల్లో పూర్తిచేయాలని పలువురు ఉపకులపతులతో యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) ఏర్పాటు చేసిన కమిటీ తాజాగా కేంద్రానికి సిఫార్సు చేసింది. ఈ విద్యాసంవత్సరంలో పరీక్షల నిర్వహణ సాధ్యం కాని యూనివర్సిటీలు అంతర్గత పరీక్షలకు 50శాతం వెయిటేజీ ఇచ్చుకోవచ్చని, మిగతా మార్కులను గత సెమిస్టర్‌ ఆధారంగా ఇవ్వవచ్చని సూచించింది.

ప్రతి యూనివర్సిటీ వర్చువల్‌ ల్యాబ్‌ను ఏర్పాటు చేసుకోవాలని, ప్రయోగ పరీక్షలు, వైవా వంటివి వీలైనంతవరకు ఆన్‌లైన్‌లోనే నిర్వహించాలని సిఫార్సు చేసింది. కరోనా వైరస్‌ వంటి సవాళ్లను దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్‌ విద్యకు ప్రాధాన్యం పెంచాలని సూచించింది.

కోట్లాది పుస్తకాలు, జర్నల్‌లు ఆన్‌లైన్‌లోకి అందుబాటులోకి రాగా విద్యార్థులు సామాజిక మాధ్యమాల్లో ఎక్కువ సమయం వెచ్చిస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు డిజిటల్‌ మీడియా నిపుణులు. ప్రభుత్వాలు, విద్యాసంస్థలు అటుదిశగా దృష్టి సారించి సోషల్‌ మీడియా వేదికగా విద్యార్థులను ఆకర్షిస్తూ సిలబస్‌లో పాఠాలు ఏ విధంగా బోధించాలి, పాఠ్యాంశాల తయారీలో ఎటువంటి మార్పులు చేయాలని ఆలోచించి తక్షణమే అమలులోకి తేవాలి.

కంటెంట్ మాత్రమే సరిపోదు..

లక్షలాది ఈ-పుస్తకాలు అందుబాటులో ఉన్నా... ఏ తరగతి వారు ఏయే పుస్తకాలు చదవాలి, అవి ఎక్కడ దొరుకుతాయి, ఎందుకు చదవాలి వంటి అవగాహన కలిగించే ప్రేరణ పాఠాలు అవసరం. డిజిటల్‌ తరగతుల్లో కేవలం కంటెంట్‌ మాత్రమే బోధిస్తూపోతే విద్యార్థులు అంతగా దృష్టి పెట్టడం కష్టం. సజీవ ఉదాహరణలతో బోధిస్తే శ్రద్ధగా వింటారు.

తెలుగు రాష్ట్రాల్లోనూ వందలాది పాఠశాలలు వర్చువల్‌ తరగతి గదులతో డిజిటల్‌ బోధన సదుపాయాలు కలిగి ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అవే డిజిటల్‌ పాఠాలు విద్యార్థుల స్మార్ట్‌ ఫోన్లకు పంపించి, కొద్దిమంది ఉపాధ్యాయులు వాటిని నియంత్రిస్తూ పాఠాలు బోధించవచ్ఛు ఆన్‌లైన్‌లోనే రోజువారీ పరీక్షలు నిర్వహిస్తూ విద్యార్థులే తమ సమాధానాలు సరిచూసుకునే పద్ధతిలో లోటుపాట్లను సరిచేయవచ్చు.

ఆన్‌లైన్‌ బోధనకు ప్రాధాన్యం

కేంద్ర ప్రభుత్వం రూపొందించిన డిజిటల్‌ పోర్టల్‌ 'స్వయం (స్టడీ వెబ్స్‌ ఆఫ్‌ యాక్టివ్‌ లెర్నింగ్‌ ఫర్‌ యంగ్‌ ఆస్పైరింగ్‌ మైండ్స్‌)' రూపొందించిన ఉచిత ఆన్‌లైన్‌ పాఠాలు ప్రస్తుతం విశేష ప్రాచుర్యం పొందుతున్నాయి. దేశంలో నిపుణులైన ఉపాధ్యాయులు పాలుపంచుకున్న ఈ పాఠాలు కొంతవరకు ఉపయోగపడుతున్నాయి.

అయితే విద్యాలయాల నుంచి గ్రామాలకు చేరిన లక్షలాది విద్యార్థులకు అంతర్జాలం సరిగా అందుబాటులో లేకపోవడం, కంప్యూటర్‌ లేదా స్మార్ట్‌ఫోన్‌ మొరాయిస్తే బాగుచేసే అవకాశం లేకపోవడంవల్ల, కొంతమంది ఆన్‌లైన్‌ విద్యకు దూరమవుతున్నారు. ఆన్‌లైన్‌ పాఠాల కోసం ప్రభుత్వాలు దూరదర్శన్‌ను, ఆకాశవాణిని ఉపయోగిస్తున్నాయి. కొన్ని సంవత్సరాలుగా ఆకాశవాణి దూరదర్శన్‌ ప్రసారాలు వినేవారు గణనీయంగా తగ్గిపోగా ఇప్పుడు ఈ పాఠాల ద్వారా కొంత వినియోగం పెరిగినట్లు సర్వేలు తెలియజేస్తున్నాయి.

మానసిక స్థైర్యమూ ముఖ్యమే..

ఇప్పుడున్న పరిస్థితుల్లో కేవలం సబ్జెక్టు పాఠాలు మాత్రమే కాకుండా విద్యార్థులకు మానసిక స్థైర్యాన్నిచ్చే కౌన్సెలింగ్‌ పాఠాలు అవసరం. కరోనా భూతానికి భయపడుతూ పాఠాలు వినడం, రోజుల తరబడి గడప దాటకుండా ఇంటికే పరిమితం కావడం వంటివి విద్యార్థుల మానసిక పరిస్థితులను ప్రభావితం చేస్తాయి.

యూజీసీ దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాలు, కళాశాలలకు తమ వెబ్‌సైట్లలో ఆన్‌లైన్‌ పాఠాలు అందుబాటులో ఉంచడంతోపాటు విద్యార్థుల మానసిక స్థైర్యం, ఆరోగ్యం దెబ్బతినకుండా హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఉన్నత విద్యార్థులకే కాకుండా పాఠశాల స్థాయి విద్యార్థులకూ ఇటువంటి ప్రయత్నాల అవసరమే. అందుకోసం నిపుణులైన మానసిక విద్యా బోధకుల పాఠాలు ఈ డిజిటల్‌ పాఠాలతో జతచేయాల్సి ఉంది.

ప్రణాళికే కీలకం

లాక్‌డౌన్‌ మరింత కాలం పొడిగిస్తే కేంద్రీయ విశ్వవిద్యాలయాలు గత సెమిస్టర్‌లో విద్యార్థులు పొందిన మార్కుల ఆధారంగా వాటి సగటును తీసుకొని పరీక్ష రాయబోయే సెమిస్టర్లకు కేటాయించి వారికి సర్టిఫికెట్లు జారీచేయనున్నట్లు వార్తలొచ్చాయి. అటువంటి విధానంపై రాష్ట్ర విశ్వవిద్యాలయాలు పునరాలోచించాలి.

యూజీసీకి సమర్పించిన నివేదికలో వచ్చే విద్యాసంవత్సరాన్ని జులైకి బదులు సెప్టెంబర్‌లో ప్రారంభించాల్సిందిగా ఆర్‌.సి. కుహద్‌ సిఫార్సు చేసిన దృష్ట్యా... చివరి సంవత్సరం విద్యార్థులకు ఈ విధానం ఎంతో మేలుగా ఉంటుంది. కోర్సు మొదట సంవత్సరం లేదా మధ్యలో ఉండే విద్యార్థులను లాక్‌డౌన్‌ తరవాత పరీక్షలు నిర్వహించి తదుపరి తరగతులు విరామం లేకుండా బోధించగలిగితే ఒక విద్యా సంవత్సరాన్ని కాపాడుకోవచ్చు.

సెలవుల రద్దు..

పండగల సెలవులు, వేసవి సెలవులు పూర్తిగా తగ్గించి లేదా రద్దుచేసి విద్యా సంవత్సరాన్ని సరిచేయాలి. అవసరమైతే పాఠ్య ప్రణాళికను మళ్లీ బోధించాలి. విద్యా ప్రమాణాలు పడిపోకుండా కాపాడటం ముఖ్యం. విద్యా సంస్థలు, ఉపాధ్యాయులు తల్లిదండ్రుల సహకారంతో విద్యా సంవత్సరంలో నాణ్యత తగ్గిపోకుండా చర్యలు తీసుకోవాలి.

(రచయిత- డాక్టర్‌ గుజ్జు చెన్నారెడ్డి, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అసోసియేట్‌ ప్రొఫెసర్‌)

పరీక్షలు ఎప్పుడు రాయాలో తెలియని డోలాయమానంలో పడిన విద్యార్థులు నేడు ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల మందికి పైగా ఉన్నారు. యునెస్కో తాజా నివేదిక ప్రకారం 191 దేశాల్లో 157 కోట్ల మందికి పైగా విద్యార్థులు కరోనా ప్రభావంతో లాక్‌డౌన్‌లో ఇళ్లకే పరిమితమయ్యారు. భారత్‌లో ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు 32 కోట్లకు పైగా విద్యార్థులు ఉన్నారు. వీరిలో కొంతమంది పాఠ్యప్రణాళిక పూర్తిచేసి పరీక్షలు రాయడానికి సిద్ధమైన వేళ, మరి కొంతమంది సిలబస్‌ చివరి దశలో ఉన్న సమయంలో లాక్‌డౌన్‌ వచ్చిపడింది.

ఈ విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి దేశంలోని కేంద్రీయ పాఠశాలలు రాష్ట్రాల పాఠశాలల్లోని విద్యార్థులను 6 నుంచి 9 తరగతుల వరకు పరీక్షలు లేకుండానే పై తరగతులకు పంపాలని నిర్ణయించగా మిగతా విద్యార్థులకు మిగిలిపోయిన సిలబస్‌ పూర్తిచేయడానికి, పరీక్షలకు సమాయత్తం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, అనేక ఇతర విద్యా సంస్థలు ఆన్‌లైన్‌ పాఠాలు చెప్పడం ప్రారంభించాయి.

వెసులుబాటు కల్పించనున్న సిఫార్సులు

ఉన్నత విద్యారంగంలో 25 శాతం పాఠ్యప్రణాళికను అంతర్జాలం ఆధారంగా బోధించాలని, మిగతా 75శాతం ప్రణాళికను తరగతి గదుల్లో పూర్తిచేయాలని పలువురు ఉపకులపతులతో యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) ఏర్పాటు చేసిన కమిటీ తాజాగా కేంద్రానికి సిఫార్సు చేసింది. ఈ విద్యాసంవత్సరంలో పరీక్షల నిర్వహణ సాధ్యం కాని యూనివర్సిటీలు అంతర్గత పరీక్షలకు 50శాతం వెయిటేజీ ఇచ్చుకోవచ్చని, మిగతా మార్కులను గత సెమిస్టర్‌ ఆధారంగా ఇవ్వవచ్చని సూచించింది.

ప్రతి యూనివర్సిటీ వర్చువల్‌ ల్యాబ్‌ను ఏర్పాటు చేసుకోవాలని, ప్రయోగ పరీక్షలు, వైవా వంటివి వీలైనంతవరకు ఆన్‌లైన్‌లోనే నిర్వహించాలని సిఫార్సు చేసింది. కరోనా వైరస్‌ వంటి సవాళ్లను దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్‌ విద్యకు ప్రాధాన్యం పెంచాలని సూచించింది.

కోట్లాది పుస్తకాలు, జర్నల్‌లు ఆన్‌లైన్‌లోకి అందుబాటులోకి రాగా విద్యార్థులు సామాజిక మాధ్యమాల్లో ఎక్కువ సమయం వెచ్చిస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు డిజిటల్‌ మీడియా నిపుణులు. ప్రభుత్వాలు, విద్యాసంస్థలు అటుదిశగా దృష్టి సారించి సోషల్‌ మీడియా వేదికగా విద్యార్థులను ఆకర్షిస్తూ సిలబస్‌లో పాఠాలు ఏ విధంగా బోధించాలి, పాఠ్యాంశాల తయారీలో ఎటువంటి మార్పులు చేయాలని ఆలోచించి తక్షణమే అమలులోకి తేవాలి.

కంటెంట్ మాత్రమే సరిపోదు..

లక్షలాది ఈ-పుస్తకాలు అందుబాటులో ఉన్నా... ఏ తరగతి వారు ఏయే పుస్తకాలు చదవాలి, అవి ఎక్కడ దొరుకుతాయి, ఎందుకు చదవాలి వంటి అవగాహన కలిగించే ప్రేరణ పాఠాలు అవసరం. డిజిటల్‌ తరగతుల్లో కేవలం కంటెంట్‌ మాత్రమే బోధిస్తూపోతే విద్యార్థులు అంతగా దృష్టి పెట్టడం కష్టం. సజీవ ఉదాహరణలతో బోధిస్తే శ్రద్ధగా వింటారు.

తెలుగు రాష్ట్రాల్లోనూ వందలాది పాఠశాలలు వర్చువల్‌ తరగతి గదులతో డిజిటల్‌ బోధన సదుపాయాలు కలిగి ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అవే డిజిటల్‌ పాఠాలు విద్యార్థుల స్మార్ట్‌ ఫోన్లకు పంపించి, కొద్దిమంది ఉపాధ్యాయులు వాటిని నియంత్రిస్తూ పాఠాలు బోధించవచ్ఛు ఆన్‌లైన్‌లోనే రోజువారీ పరీక్షలు నిర్వహిస్తూ విద్యార్థులే తమ సమాధానాలు సరిచూసుకునే పద్ధతిలో లోటుపాట్లను సరిచేయవచ్చు.

ఆన్‌లైన్‌ బోధనకు ప్రాధాన్యం

కేంద్ర ప్రభుత్వం రూపొందించిన డిజిటల్‌ పోర్టల్‌ 'స్వయం (స్టడీ వెబ్స్‌ ఆఫ్‌ యాక్టివ్‌ లెర్నింగ్‌ ఫర్‌ యంగ్‌ ఆస్పైరింగ్‌ మైండ్స్‌)' రూపొందించిన ఉచిత ఆన్‌లైన్‌ పాఠాలు ప్రస్తుతం విశేష ప్రాచుర్యం పొందుతున్నాయి. దేశంలో నిపుణులైన ఉపాధ్యాయులు పాలుపంచుకున్న ఈ పాఠాలు కొంతవరకు ఉపయోగపడుతున్నాయి.

అయితే విద్యాలయాల నుంచి గ్రామాలకు చేరిన లక్షలాది విద్యార్థులకు అంతర్జాలం సరిగా అందుబాటులో లేకపోవడం, కంప్యూటర్‌ లేదా స్మార్ట్‌ఫోన్‌ మొరాయిస్తే బాగుచేసే అవకాశం లేకపోవడంవల్ల, కొంతమంది ఆన్‌లైన్‌ విద్యకు దూరమవుతున్నారు. ఆన్‌లైన్‌ పాఠాల కోసం ప్రభుత్వాలు దూరదర్శన్‌ను, ఆకాశవాణిని ఉపయోగిస్తున్నాయి. కొన్ని సంవత్సరాలుగా ఆకాశవాణి దూరదర్శన్‌ ప్రసారాలు వినేవారు గణనీయంగా తగ్గిపోగా ఇప్పుడు ఈ పాఠాల ద్వారా కొంత వినియోగం పెరిగినట్లు సర్వేలు తెలియజేస్తున్నాయి.

మానసిక స్థైర్యమూ ముఖ్యమే..

ఇప్పుడున్న పరిస్థితుల్లో కేవలం సబ్జెక్టు పాఠాలు మాత్రమే కాకుండా విద్యార్థులకు మానసిక స్థైర్యాన్నిచ్చే కౌన్సెలింగ్‌ పాఠాలు అవసరం. కరోనా భూతానికి భయపడుతూ పాఠాలు వినడం, రోజుల తరబడి గడప దాటకుండా ఇంటికే పరిమితం కావడం వంటివి విద్యార్థుల మానసిక పరిస్థితులను ప్రభావితం చేస్తాయి.

యూజీసీ దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాలు, కళాశాలలకు తమ వెబ్‌సైట్లలో ఆన్‌లైన్‌ పాఠాలు అందుబాటులో ఉంచడంతోపాటు విద్యార్థుల మానసిక స్థైర్యం, ఆరోగ్యం దెబ్బతినకుండా హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఉన్నత విద్యార్థులకే కాకుండా పాఠశాల స్థాయి విద్యార్థులకూ ఇటువంటి ప్రయత్నాల అవసరమే. అందుకోసం నిపుణులైన మానసిక విద్యా బోధకుల పాఠాలు ఈ డిజిటల్‌ పాఠాలతో జతచేయాల్సి ఉంది.

ప్రణాళికే కీలకం

లాక్‌డౌన్‌ మరింత కాలం పొడిగిస్తే కేంద్రీయ విశ్వవిద్యాలయాలు గత సెమిస్టర్‌లో విద్యార్థులు పొందిన మార్కుల ఆధారంగా వాటి సగటును తీసుకొని పరీక్ష రాయబోయే సెమిస్టర్లకు కేటాయించి వారికి సర్టిఫికెట్లు జారీచేయనున్నట్లు వార్తలొచ్చాయి. అటువంటి విధానంపై రాష్ట్ర విశ్వవిద్యాలయాలు పునరాలోచించాలి.

యూజీసీకి సమర్పించిన నివేదికలో వచ్చే విద్యాసంవత్సరాన్ని జులైకి బదులు సెప్టెంబర్‌లో ప్రారంభించాల్సిందిగా ఆర్‌.సి. కుహద్‌ సిఫార్సు చేసిన దృష్ట్యా... చివరి సంవత్సరం విద్యార్థులకు ఈ విధానం ఎంతో మేలుగా ఉంటుంది. కోర్సు మొదట సంవత్సరం లేదా మధ్యలో ఉండే విద్యార్థులను లాక్‌డౌన్‌ తరవాత పరీక్షలు నిర్వహించి తదుపరి తరగతులు విరామం లేకుండా బోధించగలిగితే ఒక విద్యా సంవత్సరాన్ని కాపాడుకోవచ్చు.

సెలవుల రద్దు..

పండగల సెలవులు, వేసవి సెలవులు పూర్తిగా తగ్గించి లేదా రద్దుచేసి విద్యా సంవత్సరాన్ని సరిచేయాలి. అవసరమైతే పాఠ్య ప్రణాళికను మళ్లీ బోధించాలి. విద్యా ప్రమాణాలు పడిపోకుండా కాపాడటం ముఖ్యం. విద్యా సంస్థలు, ఉపాధ్యాయులు తల్లిదండ్రుల సహకారంతో విద్యా సంవత్సరంలో నాణ్యత తగ్గిపోకుండా చర్యలు తీసుకోవాలి.

(రచయిత- డాక్టర్‌ గుజ్జు చెన్నారెడ్డి, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అసోసియేట్‌ ప్రొఫెసర్‌)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.