ETV Bharat / opinion

కొవిడ్‌ టీకాతో బాలలకు రక్ష!

author img

By

Published : Oct 15, 2021, 6:58 AM IST

భారత్‌లో పాఠశాలలు, కళాశాలలు మళ్లీ ప్రారంభం కావడం వల్ల బాలల టీకా కార్యక్రమం ప్రాధాన్యం సంతరించుకొంది. ఈ నేపథ్యంలో పిల్లలకు టీకా వేసి బడులకు పంపడం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు అందరికీ భరోసా కల్పిస్తుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

vaccine for children
చిన్నారులకు కొవిడ్‌ టీకా రక్ష!

భారతదేశంలో బాలలకు, కౌమార ప్రాయంలోని వారికి త్వరలో కొవిడ్‌ టీకాల కార్యక్రమం మొదలు కాబోతోంది. ముందుగా ఈ నెల 20నుంచే 12-17 వయోవర్గంలోని వారికి జైకోవ్‌-డి టీకాలు వేస్తారని తెలుస్తోంది. సూది లేకుండా చర్మం ద్వారా ప్రతి డోసుకు మధ్య 28 రోజుల వ్యవధితో మొత్తం మూడు విడతలుగా ఈ టీకాను ఇస్తారు. తరవాత భారత్‌ బయోటెక్‌, సీరం ఇన్‌స్టిట్యూట్‌, కోర్బి వ్యాక్స్‌ (బయోలాజికల్‌ ఇ) రూపొందిస్తున్న టీకాలూ బాలలకు అందుబాటులోకి రానున్నాయి. భారత్‌ బయోటెక్‌ రూపొందించిన కొవాక్సిన్‌ టీకాను 2-18 ఏళ్లలోపు పిల్లలకు ఇవ్వడానికి ప్రభుత్వ నిపుణుల బృందం పచ్చజెండా ఊపింది. అన్ని అనుమతులు పొందిన తరవాత ఈ టీకా అందుబాటులోకి వస్తుంది.

రూపాంతరాలకు అడ్డుకట్ట

భారత్‌లో పాఠశాలలు, కళాశాలలు తిరిగి పనిచేయడం మొదలైనందువల్ల బాలల టీకా కార్యక్రమం ప్రాధాన్యం సంతరించుకొంది. బాలల్లో కొవిడ్‌ లక్షణాలు చాలా స్వల్పంగా ఉంటాయి కాబట్టి, టీకాలు అవసరమా అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. పిల్లల్లో కొవిడ్‌ లక్షణాలు బయటపడకపోయినా- వారి నుంచి ఇతరులకు వ్యాధి వ్యాపించే అవకాశాలు చాలా ఎక్కువ. కొవిడ్‌ లక్షణాలతో పిల్లలు ఆస్పత్రుల్లో చేరిన ఘటనలు ఈమధ్య తరచూ వార్తల్లో కనిపిస్తున్నాయి. కరోనా వైరస్‌ వల్ల బాలల్లో గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, మెదడు, చర్మం, కళ్లు, ఉదర కోశం వాపునకు (ఇన్‌ఫ్లమేషన్‌) గురికావడాన్ని వైద్యులు గుర్తించారు. దీన్ని వైద్య పరిభాషలో మల్టీసిస్టమ్‌ ఇన్‌ఫ్లమేషన్‌ సిండ్రోమ్‌ ఇన్‌ చిల్డ్రన్‌ (ఎంఐఎస్‌-సి)గా వ్యవహరిస్తున్నారు. పిల్లలకు టీకా వేసి బడులకు పంపడం- తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు అందరికీ భరోసా కల్పిస్తుంది. త్వరలో నెలకు కోటి డోసుల జైకోవ్‌-డి టీకాలు అందుబాటులోకి వస్తాయని, వాటిలో 25 లక్షల డోసులను నెలనెలా ప్రైవేటు ఆస్పత్రులు కోరితే అందించగలమని జాతీయ టీకా కార్యక్రమ సాంకేతిక సలహా బృందం (ఎన్టాగీ) అధ్యక్షుడు ఎన్‌కే అరోరా చెబుతున్నారు. టీకాలను కేంద్రం, ప్రైవేటు ఆస్పత్రులు 75:25 నిష్పత్తిలో పంచుకోవాలనే విధానానికి అనుగుణంగా ఆయన ఈ ప్రతిపాదన చేశారు.

బాలలకు కొవిడ్‌ టీకా వేయడంలోని సాధకబాధకాలను ఎన్టాగీ బృందం అధ్యయనం చేసింది. 130 కోట్ల పైచిలుకు భారత జనాభాలో 41 శాతం 18 ఏళ్లలోపువారే. జూన్‌లో జరిగిన సీరో పాజిటివిటీ సర్వేలో ప్రజల రక్తంలో కొవిడ్‌ వైరస్‌ యాంటీబాడీలను పరిశీలించారు. 18 ఏళ్లలోపు వారిలో 55.7శాతంలో, పెద్దవయసు వారిలో 63.5శాతంలో కొవిడ్‌ నిరోధక యాంటీబాడీలు ఉన్నట్లు అందులో తేలింది. పిన్న, పెద్ద వయస్కులనే తేడా లేకుండా జనాభాలో అత్యధికులకు టీకాలు వేస్తే, కరోనా వైరస్‌ ప్రమాదకర రూపాంతరాలను అడ్డుకోవడం సాధ్యమవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. అందుకే 12 ఏళ్లు పైబడిన బాలలకు కొవిడ్‌ టీకాలు వేయాలని వారు సిఫార్సు చేస్తున్నారు. పదేళ్లు, అయిదేళ్ల లోపువారికి టీకాలు వేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వారికి అర డోసు లేదా పావు డోసు వేయవచ్చని కొందరు వైద్యులు సూచిస్తున్నారు. బాలల్లో కొవిడ్‌ బాధితుల సంఖ్య తక్కువేనని అమెరికాతో సహా పలు దేశాల్లో జరిగిన అధ్యయనాలు సూచిస్తున్నా, జన జీవనం వేగంగా సాధారణ స్థితికి తిరిగి రావాలంటే పిల్లలకు కొవిడ్‌ టీకాలు పడాల్సిందేనని నిపుణులు అంటున్నారు.

త్వరలో మరిన్ని వ్యాక్సిన్లు

జైకోవ్‌-డి ప్రపంచంలోనే మొట్టమొదటి డీఎన్‌ఏ టీకా. డీఎన్‌ఏ టీకా అనగానే అది మానవ డీఎన్‌ఏలో మార్పులు తెస్తుందని చాలామంది పొరపాటుపడతారు. నిజానికి అది వైరస్‌ డీఎన్‌ఏను మార్చి నిరపాయం చేస్తుంది. డీఎన్‌ఏ టీకాలు 1990లనుంచే రూపొందుతున్నా, వాటిని ఇప్పటిదాకా గుర్రాలకు వేస్తున్నారు. తాజాగా మానవుల్లో దాని ప్రభావంపై క్షుణ్నంగా అధ్యయనాలు జరిపారు. క్లినికల్‌ ప్రయోగాల్లో జైకోవ్‌-డి టీకా తీసుకున్న వలంటీర్లకు టీకా వేసిన చోట వాపు, జ్వరం రాలేదు. మొత్తం 28,000 మంది వలంటీర్లపై జైకోవ్‌-డిని పరీక్షించారు. దేశంలో డెల్టా వైరస్‌ విజృంభించిన సమయంలో ఈ టీకా ప్రయోగాలు జరిగాయి. దీనికి ముందు ఇతర టీకాల ప్రయోగాల సమయంలో డెల్టా రకం ఇంకా వ్యాపించలేదు. జైకోవ్‌-డి సమర్థమైందే అయినా, దాని ధరను మూడు డోసులకు కలిపి రూ.1,900గా నిర్ణయించడం కాస్త ఇబ్బందిగానే చెప్పుకోవాలి. ధరను తగ్గించాలని కేంద్రం కోరుతోంది. జైకోవ్‌-డి టీకాను 12-17 ఏళ్లవారికి ఇస్తారు. ఇక 7-11 ఏళ్లవారికి నోవావ్యాక్స్‌ టీకాపై సీరం ఇన్‌స్టిట్యూట్‌ రెండు, మూడో దశ క్లినికల్‌ ప్రయోగాలు జరుపుతోంది. ఆగస్టులో మొదలైన ఈ ప్రయోగాల్లో 920 మంది బాల వలంటీర్లు పాల్గొంటున్నారు. వీరిలో 12-17, 2-11 వయోవర్గాల వారు 460 మంది చొప్పున ఉన్నారు. భారత్‌ బయోటెక్‌ సంస్థ దేశంలో ఆరు వేర్వేరు చోట్ల 2-18 వయోవర్గంలోని బాలలపై కొవాక్సిన్‌ టీకాలతో మొత్తం మూడు దశల క్లినికల్‌ ప్రయోగాలను విజయవంతంగా పూర్తిచేసింది. మొత్తంమీద భారత్‌లో బాలలకు త్వరలో నాలుగు కొవిడ్‌ టీకాలు అందుబాటులోకి రానున్నాయి.

- ప్రసాద్‌

ఇదీ చూడండి : చేతుల్లోనే ఆరోగ్యం.. పరిశుభ్రతే దివ్య ఔషధం

భారతదేశంలో బాలలకు, కౌమార ప్రాయంలోని వారికి త్వరలో కొవిడ్‌ టీకాల కార్యక్రమం మొదలు కాబోతోంది. ముందుగా ఈ నెల 20నుంచే 12-17 వయోవర్గంలోని వారికి జైకోవ్‌-డి టీకాలు వేస్తారని తెలుస్తోంది. సూది లేకుండా చర్మం ద్వారా ప్రతి డోసుకు మధ్య 28 రోజుల వ్యవధితో మొత్తం మూడు విడతలుగా ఈ టీకాను ఇస్తారు. తరవాత భారత్‌ బయోటెక్‌, సీరం ఇన్‌స్టిట్యూట్‌, కోర్బి వ్యాక్స్‌ (బయోలాజికల్‌ ఇ) రూపొందిస్తున్న టీకాలూ బాలలకు అందుబాటులోకి రానున్నాయి. భారత్‌ బయోటెక్‌ రూపొందించిన కొవాక్సిన్‌ టీకాను 2-18 ఏళ్లలోపు పిల్లలకు ఇవ్వడానికి ప్రభుత్వ నిపుణుల బృందం పచ్చజెండా ఊపింది. అన్ని అనుమతులు పొందిన తరవాత ఈ టీకా అందుబాటులోకి వస్తుంది.

రూపాంతరాలకు అడ్డుకట్ట

భారత్‌లో పాఠశాలలు, కళాశాలలు తిరిగి పనిచేయడం మొదలైనందువల్ల బాలల టీకా కార్యక్రమం ప్రాధాన్యం సంతరించుకొంది. బాలల్లో కొవిడ్‌ లక్షణాలు చాలా స్వల్పంగా ఉంటాయి కాబట్టి, టీకాలు అవసరమా అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. పిల్లల్లో కొవిడ్‌ లక్షణాలు బయటపడకపోయినా- వారి నుంచి ఇతరులకు వ్యాధి వ్యాపించే అవకాశాలు చాలా ఎక్కువ. కొవిడ్‌ లక్షణాలతో పిల్లలు ఆస్పత్రుల్లో చేరిన ఘటనలు ఈమధ్య తరచూ వార్తల్లో కనిపిస్తున్నాయి. కరోనా వైరస్‌ వల్ల బాలల్లో గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, మెదడు, చర్మం, కళ్లు, ఉదర కోశం వాపునకు (ఇన్‌ఫ్లమేషన్‌) గురికావడాన్ని వైద్యులు గుర్తించారు. దీన్ని వైద్య పరిభాషలో మల్టీసిస్టమ్‌ ఇన్‌ఫ్లమేషన్‌ సిండ్రోమ్‌ ఇన్‌ చిల్డ్రన్‌ (ఎంఐఎస్‌-సి)గా వ్యవహరిస్తున్నారు. పిల్లలకు టీకా వేసి బడులకు పంపడం- తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు అందరికీ భరోసా కల్పిస్తుంది. త్వరలో నెలకు కోటి డోసుల జైకోవ్‌-డి టీకాలు అందుబాటులోకి వస్తాయని, వాటిలో 25 లక్షల డోసులను నెలనెలా ప్రైవేటు ఆస్పత్రులు కోరితే అందించగలమని జాతీయ టీకా కార్యక్రమ సాంకేతిక సలహా బృందం (ఎన్టాగీ) అధ్యక్షుడు ఎన్‌కే అరోరా చెబుతున్నారు. టీకాలను కేంద్రం, ప్రైవేటు ఆస్పత్రులు 75:25 నిష్పత్తిలో పంచుకోవాలనే విధానానికి అనుగుణంగా ఆయన ఈ ప్రతిపాదన చేశారు.

బాలలకు కొవిడ్‌ టీకా వేయడంలోని సాధకబాధకాలను ఎన్టాగీ బృందం అధ్యయనం చేసింది. 130 కోట్ల పైచిలుకు భారత జనాభాలో 41 శాతం 18 ఏళ్లలోపువారే. జూన్‌లో జరిగిన సీరో పాజిటివిటీ సర్వేలో ప్రజల రక్తంలో కొవిడ్‌ వైరస్‌ యాంటీబాడీలను పరిశీలించారు. 18 ఏళ్లలోపు వారిలో 55.7శాతంలో, పెద్దవయసు వారిలో 63.5శాతంలో కొవిడ్‌ నిరోధక యాంటీబాడీలు ఉన్నట్లు అందులో తేలింది. పిన్న, పెద్ద వయస్కులనే తేడా లేకుండా జనాభాలో అత్యధికులకు టీకాలు వేస్తే, కరోనా వైరస్‌ ప్రమాదకర రూపాంతరాలను అడ్డుకోవడం సాధ్యమవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. అందుకే 12 ఏళ్లు పైబడిన బాలలకు కొవిడ్‌ టీకాలు వేయాలని వారు సిఫార్సు చేస్తున్నారు. పదేళ్లు, అయిదేళ్ల లోపువారికి టీకాలు వేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వారికి అర డోసు లేదా పావు డోసు వేయవచ్చని కొందరు వైద్యులు సూచిస్తున్నారు. బాలల్లో కొవిడ్‌ బాధితుల సంఖ్య తక్కువేనని అమెరికాతో సహా పలు దేశాల్లో జరిగిన అధ్యయనాలు సూచిస్తున్నా, జన జీవనం వేగంగా సాధారణ స్థితికి తిరిగి రావాలంటే పిల్లలకు కొవిడ్‌ టీకాలు పడాల్సిందేనని నిపుణులు అంటున్నారు.

త్వరలో మరిన్ని వ్యాక్సిన్లు

జైకోవ్‌-డి ప్రపంచంలోనే మొట్టమొదటి డీఎన్‌ఏ టీకా. డీఎన్‌ఏ టీకా అనగానే అది మానవ డీఎన్‌ఏలో మార్పులు తెస్తుందని చాలామంది పొరపాటుపడతారు. నిజానికి అది వైరస్‌ డీఎన్‌ఏను మార్చి నిరపాయం చేస్తుంది. డీఎన్‌ఏ టీకాలు 1990లనుంచే రూపొందుతున్నా, వాటిని ఇప్పటిదాకా గుర్రాలకు వేస్తున్నారు. తాజాగా మానవుల్లో దాని ప్రభావంపై క్షుణ్నంగా అధ్యయనాలు జరిపారు. క్లినికల్‌ ప్రయోగాల్లో జైకోవ్‌-డి టీకా తీసుకున్న వలంటీర్లకు టీకా వేసిన చోట వాపు, జ్వరం రాలేదు. మొత్తం 28,000 మంది వలంటీర్లపై జైకోవ్‌-డిని పరీక్షించారు. దేశంలో డెల్టా వైరస్‌ విజృంభించిన సమయంలో ఈ టీకా ప్రయోగాలు జరిగాయి. దీనికి ముందు ఇతర టీకాల ప్రయోగాల సమయంలో డెల్టా రకం ఇంకా వ్యాపించలేదు. జైకోవ్‌-డి సమర్థమైందే అయినా, దాని ధరను మూడు డోసులకు కలిపి రూ.1,900గా నిర్ణయించడం కాస్త ఇబ్బందిగానే చెప్పుకోవాలి. ధరను తగ్గించాలని కేంద్రం కోరుతోంది. జైకోవ్‌-డి టీకాను 12-17 ఏళ్లవారికి ఇస్తారు. ఇక 7-11 ఏళ్లవారికి నోవావ్యాక్స్‌ టీకాపై సీరం ఇన్‌స్టిట్యూట్‌ రెండు, మూడో దశ క్లినికల్‌ ప్రయోగాలు జరుపుతోంది. ఆగస్టులో మొదలైన ఈ ప్రయోగాల్లో 920 మంది బాల వలంటీర్లు పాల్గొంటున్నారు. వీరిలో 12-17, 2-11 వయోవర్గాల వారు 460 మంది చొప్పున ఉన్నారు. భారత్‌ బయోటెక్‌ సంస్థ దేశంలో ఆరు వేర్వేరు చోట్ల 2-18 వయోవర్గంలోని బాలలపై కొవాక్సిన్‌ టీకాలతో మొత్తం మూడు దశల క్లినికల్‌ ప్రయోగాలను విజయవంతంగా పూర్తిచేసింది. మొత్తంమీద భారత్‌లో బాలలకు త్వరలో నాలుగు కొవిడ్‌ టీకాలు అందుబాటులోకి రానున్నాయి.

- ప్రసాద్‌

ఇదీ చూడండి : చేతుల్లోనే ఆరోగ్యం.. పరిశుభ్రతే దివ్య ఔషధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.