ETV Bharat / opinion

పాంగాంగ్​ ఘర్షణతో భారత్​- చైనా రగడ మరింత తీవ్రం!

author img

By

Published : Sep 1, 2020, 1:26 PM IST

తూర్పు లద్దాఖ్​లోని పాంగాంగ్​ సరస్సు దక్షిణ తీరంలో చైనా చేసిన తాజా దుస్సాహసం ఇరుదేశాల మధ్య సరిహద్దు వివాదం మరోస్థాయికి చేరేలా చేసింది. వాస్తవాధీన రేఖ (ఎల్​ఏసీ) వద్ద చెలరేగిన ఈ ఘర్షణ తదనంతర పరిణామాలను సీనియర్​ జర్నలిస్ట్​ సంజీవ్ కేఆర్​ బారువా విశ్లేషించారు.

India-China
భారత్​ -చైనా

తూర్పు లద్దాఖ్​ నుంచి అరుణాచల్​ ప్రదేశ్​ వరకు ఉన్న సుదీర్ఘ వాస్తవాధీన రేఖ (ఎల్​ఏసీ) వద్ద భారత్​- చైనా మధ్య నాలుగు నెలలుగా నెలకొన్న ప్రతిష్టంభన ఇప్పుడు పతాక స్థాయికి చేరింది. ఇరు దేశాల మధ్య తూర్పు లద్దాఖ్​లోని పాంగాంగ్​ సరస్సు దక్షిణ తీరంలో ఆగస్ట్​ 29 అర్ధరాత్రి జరిగిన ఘర్షణ రెండు బలమైన ఆసియా దేశాల సరిహద్దు వివాదాన్ని మరింత ముదిరేలా చేసింది.

పాంగాంగ్​ దక్షిణ రేవులో చెలరేగిన తాజా ఘర్షణపై ఇరు దేశాలు తమదైన రీతిలో స్పందించాయి.

"సైనిక, దౌత్య చర్చల్లో కుదిరిన ఏకాభిప్రాయాన్ని చైనా సైన్యం ఉల్లంఘించింది. ఎల్‌ఏసీ వద్ద యథాతథ స్థితిని మార్చడానికి కవ్వింపుతో కూడిన సైనిక మోహరింపులు చేపట్టింది. పాంగాంగ్‌ సరస్సు దక్షిణ ఒడ్డున చైనా చర్యలను ముందే గమనించాం. మన బలగాలను పెంచాం. క్షేత్రస్థాయిలో వాస్తవాలను ఏకపక్షంగా మార్చాలన్న చైనా ఉద్దేశాలను అడ్డుకున్నాం"

- కర్నల్‌ అమన్‌ ఆనంద్‌, భారత సైనిక ప్రతినిధి

భారత్ స్పందించిన గంటల వ్యవధిలోనే చైనా మాటల దాడికి దిగింది.

"చర్చల్లో కుదిరిన ఏకాభిప్రాయాన్ని ఉల్లంఘిస్తూ భారత సైన్యం పాంగాంగ్‌ సరస్సు దక్షిణ రేవులోని రెఖిన్‌ పాస్‌ వద్ద వాస్తవాధీన రేఖను దాటడం ద్వారా కవ్వింపు చర్యకు పాల్పడింది. ఫలితంగా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తలెత్తాయి. దీన్ని తిప్పికొట్టడానికి అవసరమైన చర్యలను చైనా సైన్యం చేపడుతోంది.

చైనా ప్రాదేశిక సార్వభౌమత్వాన్ని భారత్​ ఉల్లంఘించింది. భారత్​-చైనా సరిహద్దు ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని బలహీనపరిచింది. ఆక్రమణకు పాల్పడిన బలగాలను భారత్​ వెనువెంటనే ఉపసంహరించుకోవాలి. ఒప్పందాలకు లోబడి ఉండాలి. సమస్యలు మరింత జఠిలం కాకుండా చూసుకోవాలి."

- సీనియర్‌ కర్నల్‌ ఝాంగ్‌ ష్యులీ, చైనా సైనిక ప్రతినిధి

వాస్తవాధీన రేఖపై...

తూర్పు లద్దాఖ్​లో సుదీర్ఘ ఏల్​ఏసీ (వాస్తవాధీన రేఖ)పై ఇరుదేశాల వాదనలు భిన్నంగా ఉన్నాయి. భారత్​-చైనా సరిహద్దు ఉద్రిక్తతలకు ఇది ఓ కారణం.

అసలేం జరిగింది?

జూన్‌ 15న గల్వాన్‌ లోయలో రెండు దేశాల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణలు జరిగాక మరోసారి ఉద్రిక్తతలు నెలకొనడం ఇదే మొదటిసారి. అయితే తాజా ఘర్షణపై పూర్తి వివరాలు తెలియలేదు. భారత సైన్యం వివరాలు వెల్లడించడంపై మౌనంగా ఉంది.

అయితే తాజా ఘర్షణలో పలువురు జవాన్లు అమరులైనట్లు, మరికొంతమందికి గాయాలైనట్లు కొన్ని వార్తలు వస్తున్నాయి. వీటిపై ఎలాంటి స్పష్టత లేదు.

సర్వ సన్నద్ధంగా...

సైనిక, దౌత్య, ప్రభుత్వ చర్చల ద్వారా సరిహద్దు సమస్యను పరిష్కరించుకోవాలని ఇరుదేశాలు చెబుతున్నాయి. అయినప్పటికీ భారత్​- చైనా ఇప్పటికే శీతాకాల చలిని లెక్కచేయకుండా భారీ స్థాయిలో బలగాలను మోహరిస్తున్నాయి. ఇది ఖర్చుతో కూడుకున్నప్పటికీ లెక్కచేయడం లేదు.

లక్షకుపైగా బలగాలు...

ప్రస్తుతం ఏల్​ఏసీ సహా కీలక ప్రాంతాలకు సైనిక పరికరాలు, వాయుసేన మోహరింపులు కాకుండా ఇరు దేశాలు ఇప్పటికే లక్షకు పైగా బలగాలను తరలించాయి.

(సంజీవ్​ బారువా, సీనియర్​ జర్నలిస్ట్)

తూర్పు లద్దాఖ్​ నుంచి అరుణాచల్​ ప్రదేశ్​ వరకు ఉన్న సుదీర్ఘ వాస్తవాధీన రేఖ (ఎల్​ఏసీ) వద్ద భారత్​- చైనా మధ్య నాలుగు నెలలుగా నెలకొన్న ప్రతిష్టంభన ఇప్పుడు పతాక స్థాయికి చేరింది. ఇరు దేశాల మధ్య తూర్పు లద్దాఖ్​లోని పాంగాంగ్​ సరస్సు దక్షిణ తీరంలో ఆగస్ట్​ 29 అర్ధరాత్రి జరిగిన ఘర్షణ రెండు బలమైన ఆసియా దేశాల సరిహద్దు వివాదాన్ని మరింత ముదిరేలా చేసింది.

పాంగాంగ్​ దక్షిణ రేవులో చెలరేగిన తాజా ఘర్షణపై ఇరు దేశాలు తమదైన రీతిలో స్పందించాయి.

"సైనిక, దౌత్య చర్చల్లో కుదిరిన ఏకాభిప్రాయాన్ని చైనా సైన్యం ఉల్లంఘించింది. ఎల్‌ఏసీ వద్ద యథాతథ స్థితిని మార్చడానికి కవ్వింపుతో కూడిన సైనిక మోహరింపులు చేపట్టింది. పాంగాంగ్‌ సరస్సు దక్షిణ ఒడ్డున చైనా చర్యలను ముందే గమనించాం. మన బలగాలను పెంచాం. క్షేత్రస్థాయిలో వాస్తవాలను ఏకపక్షంగా మార్చాలన్న చైనా ఉద్దేశాలను అడ్డుకున్నాం"

- కర్నల్‌ అమన్‌ ఆనంద్‌, భారత సైనిక ప్రతినిధి

భారత్ స్పందించిన గంటల వ్యవధిలోనే చైనా మాటల దాడికి దిగింది.

"చర్చల్లో కుదిరిన ఏకాభిప్రాయాన్ని ఉల్లంఘిస్తూ భారత సైన్యం పాంగాంగ్‌ సరస్సు దక్షిణ రేవులోని రెఖిన్‌ పాస్‌ వద్ద వాస్తవాధీన రేఖను దాటడం ద్వారా కవ్వింపు చర్యకు పాల్పడింది. ఫలితంగా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తలెత్తాయి. దీన్ని తిప్పికొట్టడానికి అవసరమైన చర్యలను చైనా సైన్యం చేపడుతోంది.

చైనా ప్రాదేశిక సార్వభౌమత్వాన్ని భారత్​ ఉల్లంఘించింది. భారత్​-చైనా సరిహద్దు ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని బలహీనపరిచింది. ఆక్రమణకు పాల్పడిన బలగాలను భారత్​ వెనువెంటనే ఉపసంహరించుకోవాలి. ఒప్పందాలకు లోబడి ఉండాలి. సమస్యలు మరింత జఠిలం కాకుండా చూసుకోవాలి."

- సీనియర్‌ కర్నల్‌ ఝాంగ్‌ ష్యులీ, చైనా సైనిక ప్రతినిధి

వాస్తవాధీన రేఖపై...

తూర్పు లద్దాఖ్​లో సుదీర్ఘ ఏల్​ఏసీ (వాస్తవాధీన రేఖ)పై ఇరుదేశాల వాదనలు భిన్నంగా ఉన్నాయి. భారత్​-చైనా సరిహద్దు ఉద్రిక్తతలకు ఇది ఓ కారణం.

అసలేం జరిగింది?

జూన్‌ 15న గల్వాన్‌ లోయలో రెండు దేశాల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణలు జరిగాక మరోసారి ఉద్రిక్తతలు నెలకొనడం ఇదే మొదటిసారి. అయితే తాజా ఘర్షణపై పూర్తి వివరాలు తెలియలేదు. భారత సైన్యం వివరాలు వెల్లడించడంపై మౌనంగా ఉంది.

అయితే తాజా ఘర్షణలో పలువురు జవాన్లు అమరులైనట్లు, మరికొంతమందికి గాయాలైనట్లు కొన్ని వార్తలు వస్తున్నాయి. వీటిపై ఎలాంటి స్పష్టత లేదు.

సర్వ సన్నద్ధంగా...

సైనిక, దౌత్య, ప్రభుత్వ చర్చల ద్వారా సరిహద్దు సమస్యను పరిష్కరించుకోవాలని ఇరుదేశాలు చెబుతున్నాయి. అయినప్పటికీ భారత్​- చైనా ఇప్పటికే శీతాకాల చలిని లెక్కచేయకుండా భారీ స్థాయిలో బలగాలను మోహరిస్తున్నాయి. ఇది ఖర్చుతో కూడుకున్నప్పటికీ లెక్కచేయడం లేదు.

లక్షకుపైగా బలగాలు...

ప్రస్తుతం ఏల్​ఏసీ సహా కీలక ప్రాంతాలకు సైనిక పరికరాలు, వాయుసేన మోహరింపులు కాకుండా ఇరు దేశాలు ఇప్పటికే లక్షకు పైగా బలగాలను తరలించాయి.

(సంజీవ్​ బారువా, సీనియర్​ జర్నలిస్ట్)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.