ETV Bharat / opinion

'డబ్ల్యూటీఓ ఎన్నిక- భారత సామర్థ్య ప్రదర్శనకు అవకాశం!'

author img

By

Published : Jul 13, 2020, 3:49 PM IST

త్వరలో ప్రపంచ వాణిజ్య సంస్థకు కొత్త డైరెక్టర్ జనరల్​ ఎన్నిక జరగనుంది. అంతర్జాతీయ వాణిజ్య అస్థిరతల మధ్య ఈ డీజీ ఎన్నికకు ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఈ ఎన్నికలో భారత్​ పోషించాల్సిన పాత్ర ఏంటి? వాణిజ్య ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఏం చేయాలి?

A new Director General for the World Trade Organization: the stakes for India
డబ్ల్యూటీఓ

ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ) డైరెక్టర్ జనరల్ రాబర్టో అజెవెడో తన పదవి నుంచి తప్పుకోనున్నట్లు 2020 మే నెలలో అర్ధంతరంగా ప్రకటించారు. ఈ సంవత్సరం ఆగస్టు నాటికి పదవి నుంచి దిగిపోనున్నట్లు వెల్లడించి ఆశ్చర్యపరిచారు. రెండోసారి అధిరాకం చేపట్టిన ఆయన.. నాలుగేళ్ల పదవీకాలంలో మరో ఏడాది మిగిలి ఉండగానే పగ్గాలు వదులుకోనున్నట్లు స్పష్టం చేశారు. అంతర్జాతీయ సంబంధాల్లో అనిశ్చితులు, అంతరాయాలు నెలకొన్న ఈ సమయంలో ప్రపంచ వాణిజ్య సంస్థకు కొత్త డైరెక్టర్ జనరల్(డీజీ)​ను నియమించడం ఓవైపు సవాలుతో కూడుకుంటే మరోవైపు మంచి అవకాశంగా కనిపిస్తోంది.

డీజీ పాత్ర కీలకం!

ఏకాభిప్రాయాల ద్వారానే ప్రపంచ వాణిజ్య సంస్థ నిర్ణయాలు తీసుకుంటుంది. గ్రీన్ రూం(డీజీ సమావేశ గదికి అనధికార పేరు)కు అధ్యక్షత వహిస్తూ డబ్ల్యూటీఓ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదిర్చేందుకు డైరెక్టర్ జనరల్ తెరవెనక కీలక పాత్ర పోషిస్తారు. ఈ అనధికార యంత్రాంగం వివిధ దేశాల ప్రతినిధులను ఒక్కచోటకు చేర్చుతుంది. సమస్యపై ఏకాభిప్రాయం కోసం సభ్యుల మధ్య సమన్వయం పెంచుతుంది. సాధారణంగా 40 మంది ప్రతినిధులతో ఈ సమావేశాలు నిర్వహిస్తారు. క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడానికి కొత్త మార్గాలు అన్వేషిస్తారు.

'గ్రీన్ రూం' మూల సూత్రం అదే!

ఈ అనధికార చర్చల్లో రాజకీయంగా ముఖ్యమైన వాణిజ్య మినహాయింపు వంటి అంశాలను ప్రతినిధులు అత్యధికంగా ప్రస్తావిస్తారు. కాగా కొన్ని దేశాలు లేవనెత్తిన సమస్యలను పరిష్కరించడానికి డైరెక్టర్ జనరల్ పిలుపునిస్తారు. ఈ గ్రీన్ రూం ప్రక్రియలో భారత్​ చురుగ్గా పాల్గొంటోంది.

'ప్రతిదీ అంగీకరించే వరకు ఏదీ అంగీకారం పొందదు.'(నథింగ్ ఈజ్ అగ్రీడ్ అంటిల్ ఎవ్రిథింగ్ ఈజ్ అగ్రీడ్) ఇదే గ్రీన్ రూం ప్రక్రియ మూల సూత్రం.

దోహా వాణిజ్య చర్చల్లో ప్రతిష్టంభన వరకు గ్రీన్ రూం ప్రక్రియ చాలా మంచి ఫలితాలనే ఇచ్చింది. డబ్ల్యూటీఓ మంత్రివర్గ సమావేశాల్లో ఆమోదం పొందిన నిర్ణయాలు వెల్లడించింది. అందులో ముఖ్యమైనవి.

  • 1996లో సింగపూర్​లో జరిగిన తొలి డబ్ల్యూటీఓ మంత్రుల సమావేశంలో పెట్టుబడులు, పోటీతత్వ విధానాల వంటి కొత్త అంశాలపై చర్చ.
  • 1996, 2003 చర్చల్లో సులభతర వాణిజ్య నియమాలను చర్చించేందుకు సభ్యుల ఒప్పందం

ఎన్నిక ప్రక్రియ షురూ

తదుపరి డీజీ నియామకానికి డబ్ల్యూటీఓ గత నెల నోటిఫికేషన్ జారీ చేసింది. జూన్ 8 నుంచి జులై 8 వరకు నామినేషన్ దాఖలుకు సమయం ఇచ్చింది. మొత్తం ఎనిమిది దేశాల నుంచి నామినేషన్లు వచ్చాయి. కెన్యా, నైజీరియా, దక్షిణ కొరియా నుంచి మహిళా అభ్యర్థులు బరిలోకి దిగారు. ఇవి కాకుండా.. ఈజిప్ట్, మెక్సికో, మోల్డోవా, సౌదీ అరేబియా, యూకే దేశాలు నామినేషన్లు సమర్పించాయి. డబ్ల్యూటీఓ సెక్రటేరియట్‌కు నాయకత్వం వహించి బహుపాక్షికత సంస్కరణలో ముందడుగు వేయడానికి ప్రత్యేకమైన అవకాశం ఉన్నప్పటికీ.. భారతదేశం ఇందులో అభ్యర్థిని నామినేట్ చేయకపోవడం గమనార్హం.

నామినేషన్లు సమర్పించిన అభ్యర్థులతో జులై 15-17 మధ్య డబ్ల్యూటీఓ సమావేశాలు నిర్వహిస్తుంది. తర్వాతి డీజీ విషయంపై ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తుంది. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల్లో డబ్ల్యూటీఓ ఏం చేయాలని సభ్యులు ఆశిస్తున్నారనే అంశంపై కొత్త డీజీ నిర్ణయం ఆధారపడి ఉంటుంది. అంతేగాక సంస్థలోని పెద్ద దేశాలు తమ స్వప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని దీనిపై ఏకాభిప్రాయానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

డబ్ల్యూటీఓదే 98% వాటా

ప్రపంచ వాణిజ్యం దాదాపుగా డబ్ల్యూటీఓ సభ్య దేశాల చేతిలోనే ఉంది. మొత్తం 164 దేశాలు అంతర్జాతీయ వాణిజ్యంలో 98 శాతం వాటా కలిగి ఉన్నాయి. వాణిజ్య విధానాల్లో రెండు ప్రధాన సూత్రాలకు సభ్యదేశాలు కట్టుబడి ఉండేలా డబ్ల్యూటీఓ పర్యవేక్షిస్తుంది. ఒకటి మోస్ట్​ ఫేవర్డ్​ నేషన్(ఎంఎఫ్ఎన్), మరొకటి నేషనల్ ట్రీట్​మెంట్. ఈ సూత్రాల్లో భాగంగా సభ్యదేశాలు తమ వాణిజ్య భాగస్వాములతో వివక్షపూరిత విధానాలు అవలంబించకూడదు. దిగుమతి చేసుకున్న వస్తువులతో పాటు స్థానిక వస్తు సేవలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలి.

ప్రపంచ మార్కెట్​లో రక్షణాత్మక ధోరణి పెరుగుతున్న నేపథ్యంలో డబ్ల్యూటీఓ కొత్త డైరెక్టర్ ఈ రెండు సూత్రాలకు నిబద్ధతతో కట్టుబడి ఉండటం చాలా ముఖ్యం. ఇది భారత్​ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రయోజనం చేకూర్చుతుంది.

వీటిని పరిష్కరించే వారు కావాలి

తదుపరి డీజీని ఎన్నుకోవడంలో డబ్ల్యూటీఓ సభ్యదేశాలు ప్రధానంగా దృష్టిసారించేది రెండు సమస్యలపైనే. ఈ రెండు సమస్యలను పరిష్కరించే సామర్థ్యం ఉన్నవారినే అన్వేషిస్తాయని స్పష్టంగా తెలుస్తోంది.

మొదటిది... దోహా చర్చలను ఫలప్రదంగా ముగించడం. దశాబ్దం క్రితం ఆగిపోయిన ఈ చర్చలను ఓ కొలిక్కి తీసుకురావడం చాలా ముఖ్యం. వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్ సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో కొనసాగిన దోహా చర్చలు అమెరికా, ఐరోపా దేశాలు రాయితీలకు విముఖత వ్యక్తం చేయడం వల్ల నిలిచిపోయాయి.

రెండోది.. వివాద పరిష్కార యంత్రాంగం(డీఎస్​ఎం) కార్యకలాపాలను కొత్త డైరెక్టర్ జనరల్ పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. 1995 నుంచి ఈ యంత్రాంగం 500కు పైగా వాణిజ్య వివాదాలను పరిష్కరించింది. ఈ యంత్రాంగం వల్ల భారత్ గణనీయంగా లబ్ధిపొందింది. ద్వైపాక్షిక ఒత్తిళ్లకు గురికాకుండా అమెరికా, ఐరోపా సమాఖ్యలతో ఏర్పడిన వాణిజ్య వివాదాలలో సానుకూల ఫలితాలు రాబట్టుకుంది.

అడ్డంగా అమెరికా!

ఈ డీఎస్​ఎం ప్రక్రియను అమెరికా అడ్డుకుంది. అప్పీలేట్ బాడీ(ఏబీ)లో కొత్త న్యాయమూర్తుల నియామకంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. అప్పీలేట్ బాడీ నిర్ణయాల కోసం ముగ్గురు సభ్యుల బెంచ్ కొనసాగేందుకే మొగ్గుచూపింది. కొందరు న్యాయమూర్తుల తీర్పులు డబ్ల్యూటీఓ నిబంధనలకు అనుగుణంగా లేని కారణంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెప్పుకొచ్చింది అమెరికా. మరోవైపు ఏబీ విధానాలను కొందరు న్యాయమూర్తులు తమ ప్రయోజనం కోసం ఉపయోగించుకుంటున్నారని ఆరోపించింది.

అంతేకాకుండా డబ్ల్యూటీఓకు ముందు ఉన్న చట్టాలను పునరుద్ధరిస్తోంది అమెరికా. 1974 వాణిజ్య చట్టంలోని సెక్షన్ 301ను తిరిగి అమలు చేస్తోంది. తద్వారా భారత్ సహా ఇతర డబ్ల్యూటీఓ దేశాలపై ఏకపక్ష వాణిజ్య వివాదాలకు తెరతీస్తోంది.

భారత్​ లేని మధ్యంతర వ్యవస్థ

అప్పీలేట్ బాడీపై అమెరికా వైఖరి మార్చుకునేంత వరకు 'మధ్యంతర అప్పీల్ ఆర్బిట్రేషన్ అరేంజ్​మెంట్​'ను రూపొందించే పనిలో ఉంది ఐరోపా సమాఖ్య. ఈ ఏడాది జనవరిలో ఇందుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభించింది. చైనా, దక్షిణ కొరియా, బ్రెజిల్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సింగపూర్​ దేశాలు ఈ ప్రక్రియలో పాల్గొంటున్నాయి. ప్రధాన దేశాలన్నీ ఇందులో ఉన్నప్పటికీ... భారత్ మాత్రం ఇందులో భాగస్వామి కాలేదు. ఒకవేళ అప్పీలేట్ బాడీ పునఃప్రారంభం కాకపోతే.. డబ్ల్యూటీఓ సభ్యదేశాలతో వాణిజ్య వివాదాల పరిష్కారంలో భారత్​కు అనేక అంతరాయాలు తలెత్తే అవకాశం ఉంది.

చైనా ప్రభావమూ ఉంది!

2001 డిసెంబర్​ నుంచి చైనా తన ప్రభావాన్ని అంతకంతకూ పెంచుకోవడం వల్ల డబ్ల్యూటీఓ డైరెక్టర్ జనరల్​ను ఎన్నికపై ఏకాభిప్రాయం సాధించే విషయంలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. డబ్ల్యూటీఓ దేశాల పరస్పర ప్రయోజనాల వల్ల గ్రీన్​ రూం యంత్రాంగంపైనే ప్రభావం పడే అవకాశం ఉంది.

ఆలోచించి ఏకాభిప్రాయానికి రావాలి

1995 నుంచి భారత ఆర్థిక వ్యవస్థలో సంస్కరణలకు డబ్ల్యూటీఓ సభ్యత్వం చాలా వరకు తోడ్పడింది. ఆర్థిక సేవలు, టెలికాం, వాణిజ్య సేవల రంగాల్లో పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరింది. 2024 నాటికి 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ స్వప్నాన్ని ఛేదించేందుకు ఈ రంగాలే బాటలు పరుస్తున్నాయి. ప్రపంచ బ్యాంకు 2018 గణాంకాల ప్రకారం జీడీపీలో భారతదేశ అంతర్జాతీయ వాణిజ్యం వాటా 40 శాతం.

కాబట్టి తదుపరి డీజీ ఎంపికలో భారత్ మరింత చురుకైన పాత్ర పోషించాలి. వివాదాల పరిష్కారంలో డబ్ల్యూటీఓ డైరెక్టర్ జనరల్ పాత్ర కూడా ముఖ్యమైనదే. అమెరికా సమస్యను పరిష్కరిస్తూ అప్పీలేట్ బాడీ సామర్థ్యాన్ని, ప్రభావాన్ని తిరిగి నెలకొల్పే విషయాలను దృష్టిలో పెట్టుకొని తదుపరి డైరెక్టర్​ ఎన్నికపై భారత్ ఏకాభిప్రాయానికి రావాలి. నిర్మాణాత్మక భాగస్వామ్యం ద్వారా సంస్కరణ బహుపాక్షిక విధానాలను సాధించే సామర్థ్యాన్ని ప్రదర్శించాలి.

(రచయిత-అశోక్ ముఖర్జీ, 1995-98 మధ్య ప్రపంచ వాణిజ్య సంస్థలో భారతదేశ సంధానకర్త)

ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ) డైరెక్టర్ జనరల్ రాబర్టో అజెవెడో తన పదవి నుంచి తప్పుకోనున్నట్లు 2020 మే నెలలో అర్ధంతరంగా ప్రకటించారు. ఈ సంవత్సరం ఆగస్టు నాటికి పదవి నుంచి దిగిపోనున్నట్లు వెల్లడించి ఆశ్చర్యపరిచారు. రెండోసారి అధిరాకం చేపట్టిన ఆయన.. నాలుగేళ్ల పదవీకాలంలో మరో ఏడాది మిగిలి ఉండగానే పగ్గాలు వదులుకోనున్నట్లు స్పష్టం చేశారు. అంతర్జాతీయ సంబంధాల్లో అనిశ్చితులు, అంతరాయాలు నెలకొన్న ఈ సమయంలో ప్రపంచ వాణిజ్య సంస్థకు కొత్త డైరెక్టర్ జనరల్(డీజీ)​ను నియమించడం ఓవైపు సవాలుతో కూడుకుంటే మరోవైపు మంచి అవకాశంగా కనిపిస్తోంది.

డీజీ పాత్ర కీలకం!

ఏకాభిప్రాయాల ద్వారానే ప్రపంచ వాణిజ్య సంస్థ నిర్ణయాలు తీసుకుంటుంది. గ్రీన్ రూం(డీజీ సమావేశ గదికి అనధికార పేరు)కు అధ్యక్షత వహిస్తూ డబ్ల్యూటీఓ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదిర్చేందుకు డైరెక్టర్ జనరల్ తెరవెనక కీలక పాత్ర పోషిస్తారు. ఈ అనధికార యంత్రాంగం వివిధ దేశాల ప్రతినిధులను ఒక్కచోటకు చేర్చుతుంది. సమస్యపై ఏకాభిప్రాయం కోసం సభ్యుల మధ్య సమన్వయం పెంచుతుంది. సాధారణంగా 40 మంది ప్రతినిధులతో ఈ సమావేశాలు నిర్వహిస్తారు. క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడానికి కొత్త మార్గాలు అన్వేషిస్తారు.

'గ్రీన్ రూం' మూల సూత్రం అదే!

ఈ అనధికార చర్చల్లో రాజకీయంగా ముఖ్యమైన వాణిజ్య మినహాయింపు వంటి అంశాలను ప్రతినిధులు అత్యధికంగా ప్రస్తావిస్తారు. కాగా కొన్ని దేశాలు లేవనెత్తిన సమస్యలను పరిష్కరించడానికి డైరెక్టర్ జనరల్ పిలుపునిస్తారు. ఈ గ్రీన్ రూం ప్రక్రియలో భారత్​ చురుగ్గా పాల్గొంటోంది.

'ప్రతిదీ అంగీకరించే వరకు ఏదీ అంగీకారం పొందదు.'(నథింగ్ ఈజ్ అగ్రీడ్ అంటిల్ ఎవ్రిథింగ్ ఈజ్ అగ్రీడ్) ఇదే గ్రీన్ రూం ప్రక్రియ మూల సూత్రం.

దోహా వాణిజ్య చర్చల్లో ప్రతిష్టంభన వరకు గ్రీన్ రూం ప్రక్రియ చాలా మంచి ఫలితాలనే ఇచ్చింది. డబ్ల్యూటీఓ మంత్రివర్గ సమావేశాల్లో ఆమోదం పొందిన నిర్ణయాలు వెల్లడించింది. అందులో ముఖ్యమైనవి.

  • 1996లో సింగపూర్​లో జరిగిన తొలి డబ్ల్యూటీఓ మంత్రుల సమావేశంలో పెట్టుబడులు, పోటీతత్వ విధానాల వంటి కొత్త అంశాలపై చర్చ.
  • 1996, 2003 చర్చల్లో సులభతర వాణిజ్య నియమాలను చర్చించేందుకు సభ్యుల ఒప్పందం

ఎన్నిక ప్రక్రియ షురూ

తదుపరి డీజీ నియామకానికి డబ్ల్యూటీఓ గత నెల నోటిఫికేషన్ జారీ చేసింది. జూన్ 8 నుంచి జులై 8 వరకు నామినేషన్ దాఖలుకు సమయం ఇచ్చింది. మొత్తం ఎనిమిది దేశాల నుంచి నామినేషన్లు వచ్చాయి. కెన్యా, నైజీరియా, దక్షిణ కొరియా నుంచి మహిళా అభ్యర్థులు బరిలోకి దిగారు. ఇవి కాకుండా.. ఈజిప్ట్, మెక్సికో, మోల్డోవా, సౌదీ అరేబియా, యూకే దేశాలు నామినేషన్లు సమర్పించాయి. డబ్ల్యూటీఓ సెక్రటేరియట్‌కు నాయకత్వం వహించి బహుపాక్షికత సంస్కరణలో ముందడుగు వేయడానికి ప్రత్యేకమైన అవకాశం ఉన్నప్పటికీ.. భారతదేశం ఇందులో అభ్యర్థిని నామినేట్ చేయకపోవడం గమనార్హం.

నామినేషన్లు సమర్పించిన అభ్యర్థులతో జులై 15-17 మధ్య డబ్ల్యూటీఓ సమావేశాలు నిర్వహిస్తుంది. తర్వాతి డీజీ విషయంపై ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తుంది. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల్లో డబ్ల్యూటీఓ ఏం చేయాలని సభ్యులు ఆశిస్తున్నారనే అంశంపై కొత్త డీజీ నిర్ణయం ఆధారపడి ఉంటుంది. అంతేగాక సంస్థలోని పెద్ద దేశాలు తమ స్వప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని దీనిపై ఏకాభిప్రాయానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

డబ్ల్యూటీఓదే 98% వాటా

ప్రపంచ వాణిజ్యం దాదాపుగా డబ్ల్యూటీఓ సభ్య దేశాల చేతిలోనే ఉంది. మొత్తం 164 దేశాలు అంతర్జాతీయ వాణిజ్యంలో 98 శాతం వాటా కలిగి ఉన్నాయి. వాణిజ్య విధానాల్లో రెండు ప్రధాన సూత్రాలకు సభ్యదేశాలు కట్టుబడి ఉండేలా డబ్ల్యూటీఓ పర్యవేక్షిస్తుంది. ఒకటి మోస్ట్​ ఫేవర్డ్​ నేషన్(ఎంఎఫ్ఎన్), మరొకటి నేషనల్ ట్రీట్​మెంట్. ఈ సూత్రాల్లో భాగంగా సభ్యదేశాలు తమ వాణిజ్య భాగస్వాములతో వివక్షపూరిత విధానాలు అవలంబించకూడదు. దిగుమతి చేసుకున్న వస్తువులతో పాటు స్థానిక వస్తు సేవలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలి.

ప్రపంచ మార్కెట్​లో రక్షణాత్మక ధోరణి పెరుగుతున్న నేపథ్యంలో డబ్ల్యూటీఓ కొత్త డైరెక్టర్ ఈ రెండు సూత్రాలకు నిబద్ధతతో కట్టుబడి ఉండటం చాలా ముఖ్యం. ఇది భారత్​ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రయోజనం చేకూర్చుతుంది.

వీటిని పరిష్కరించే వారు కావాలి

తదుపరి డీజీని ఎన్నుకోవడంలో డబ్ల్యూటీఓ సభ్యదేశాలు ప్రధానంగా దృష్టిసారించేది రెండు సమస్యలపైనే. ఈ రెండు సమస్యలను పరిష్కరించే సామర్థ్యం ఉన్నవారినే అన్వేషిస్తాయని స్పష్టంగా తెలుస్తోంది.

మొదటిది... దోహా చర్చలను ఫలప్రదంగా ముగించడం. దశాబ్దం క్రితం ఆగిపోయిన ఈ చర్చలను ఓ కొలిక్కి తీసుకురావడం చాలా ముఖ్యం. వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్ సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో కొనసాగిన దోహా చర్చలు అమెరికా, ఐరోపా దేశాలు రాయితీలకు విముఖత వ్యక్తం చేయడం వల్ల నిలిచిపోయాయి.

రెండోది.. వివాద పరిష్కార యంత్రాంగం(డీఎస్​ఎం) కార్యకలాపాలను కొత్త డైరెక్టర్ జనరల్ పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. 1995 నుంచి ఈ యంత్రాంగం 500కు పైగా వాణిజ్య వివాదాలను పరిష్కరించింది. ఈ యంత్రాంగం వల్ల భారత్ గణనీయంగా లబ్ధిపొందింది. ద్వైపాక్షిక ఒత్తిళ్లకు గురికాకుండా అమెరికా, ఐరోపా సమాఖ్యలతో ఏర్పడిన వాణిజ్య వివాదాలలో సానుకూల ఫలితాలు రాబట్టుకుంది.

అడ్డంగా అమెరికా!

ఈ డీఎస్​ఎం ప్రక్రియను అమెరికా అడ్డుకుంది. అప్పీలేట్ బాడీ(ఏబీ)లో కొత్త న్యాయమూర్తుల నియామకంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. అప్పీలేట్ బాడీ నిర్ణయాల కోసం ముగ్గురు సభ్యుల బెంచ్ కొనసాగేందుకే మొగ్గుచూపింది. కొందరు న్యాయమూర్తుల తీర్పులు డబ్ల్యూటీఓ నిబంధనలకు అనుగుణంగా లేని కారణంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెప్పుకొచ్చింది అమెరికా. మరోవైపు ఏబీ విధానాలను కొందరు న్యాయమూర్తులు తమ ప్రయోజనం కోసం ఉపయోగించుకుంటున్నారని ఆరోపించింది.

అంతేకాకుండా డబ్ల్యూటీఓకు ముందు ఉన్న చట్టాలను పునరుద్ధరిస్తోంది అమెరికా. 1974 వాణిజ్య చట్టంలోని సెక్షన్ 301ను తిరిగి అమలు చేస్తోంది. తద్వారా భారత్ సహా ఇతర డబ్ల్యూటీఓ దేశాలపై ఏకపక్ష వాణిజ్య వివాదాలకు తెరతీస్తోంది.

భారత్​ లేని మధ్యంతర వ్యవస్థ

అప్పీలేట్ బాడీపై అమెరికా వైఖరి మార్చుకునేంత వరకు 'మధ్యంతర అప్పీల్ ఆర్బిట్రేషన్ అరేంజ్​మెంట్​'ను రూపొందించే పనిలో ఉంది ఐరోపా సమాఖ్య. ఈ ఏడాది జనవరిలో ఇందుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభించింది. చైనా, దక్షిణ కొరియా, బ్రెజిల్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సింగపూర్​ దేశాలు ఈ ప్రక్రియలో పాల్గొంటున్నాయి. ప్రధాన దేశాలన్నీ ఇందులో ఉన్నప్పటికీ... భారత్ మాత్రం ఇందులో భాగస్వామి కాలేదు. ఒకవేళ అప్పీలేట్ బాడీ పునఃప్రారంభం కాకపోతే.. డబ్ల్యూటీఓ సభ్యదేశాలతో వాణిజ్య వివాదాల పరిష్కారంలో భారత్​కు అనేక అంతరాయాలు తలెత్తే అవకాశం ఉంది.

చైనా ప్రభావమూ ఉంది!

2001 డిసెంబర్​ నుంచి చైనా తన ప్రభావాన్ని అంతకంతకూ పెంచుకోవడం వల్ల డబ్ల్యూటీఓ డైరెక్టర్ జనరల్​ను ఎన్నికపై ఏకాభిప్రాయం సాధించే విషయంలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. డబ్ల్యూటీఓ దేశాల పరస్పర ప్రయోజనాల వల్ల గ్రీన్​ రూం యంత్రాంగంపైనే ప్రభావం పడే అవకాశం ఉంది.

ఆలోచించి ఏకాభిప్రాయానికి రావాలి

1995 నుంచి భారత ఆర్థిక వ్యవస్థలో సంస్కరణలకు డబ్ల్యూటీఓ సభ్యత్వం చాలా వరకు తోడ్పడింది. ఆర్థిక సేవలు, టెలికాం, వాణిజ్య సేవల రంగాల్లో పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరింది. 2024 నాటికి 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ స్వప్నాన్ని ఛేదించేందుకు ఈ రంగాలే బాటలు పరుస్తున్నాయి. ప్రపంచ బ్యాంకు 2018 గణాంకాల ప్రకారం జీడీపీలో భారతదేశ అంతర్జాతీయ వాణిజ్యం వాటా 40 శాతం.

కాబట్టి తదుపరి డీజీ ఎంపికలో భారత్ మరింత చురుకైన పాత్ర పోషించాలి. వివాదాల పరిష్కారంలో డబ్ల్యూటీఓ డైరెక్టర్ జనరల్ పాత్ర కూడా ముఖ్యమైనదే. అమెరికా సమస్యను పరిష్కరిస్తూ అప్పీలేట్ బాడీ సామర్థ్యాన్ని, ప్రభావాన్ని తిరిగి నెలకొల్పే విషయాలను దృష్టిలో పెట్టుకొని తదుపరి డైరెక్టర్​ ఎన్నికపై భారత్ ఏకాభిప్రాయానికి రావాలి. నిర్మాణాత్మక భాగస్వామ్యం ద్వారా సంస్కరణ బహుపాక్షిక విధానాలను సాధించే సామర్థ్యాన్ని ప్రదర్శించాలి.

(రచయిత-అశోక్ ముఖర్జీ, 1995-98 మధ్య ప్రపంచ వాణిజ్య సంస్థలో భారతదేశ సంధానకర్త)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.