LIVE : కిషన్​రెడ్డి మీడియా సమావేశం - ప్రత్యక్షప్రసారం

By ETV Bharat Telangana Team

Published : Jan 8, 2024, 5:27 PM IST

Updated : Jan 8, 2024, 5:42 PM IST

thumbnail

Kishan Reddy Media Conference Live : రాష్ట్రంలో రాబోయే లోక్​సభ ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ స్థానాలను గెలుచుకోవడం ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో పార్లమెంట్​ ఎన్నికల్లో గెలుపునకు బీజేపీ కార్యకర్తలకు, నేతలకు దిశానిర్దేశం చేశారు. కాళేశ్వరంలో జరిగిన అవినీతి అక్రమాలపై దర్యాప్తునకు సీబీఐతో చేయించాలని డిమాండ్​ చేశారు.

దేశంలో మోదీ నాయకత్వం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్​రెడ్డి పేర్కొన్నారు. మోదీతో పోటీకి దరిదాపుల్లో లేరని సర్వేలన్నీ స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. నూతన భారత నిర్మాణానికి బీజేపీ ప్రభుత్వం కృషి చేసిందని కిషన్​రెడ్డి పేర్కొన్నారు. కేంద్రంలో అవినీతి లేని ప్రభుత్వం నడుస్తోందని, తొమ్మిదన్నరేళ్లుగా చిత్తశుద్ధితో పాలన సాగుతోందన్నారు. గత ప్రభుత్వాలపై ఏదో రకమైన అవినీతి ఆరోపణలు ఉండేవని, ప్రజలు స్థిరమైన ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. కుటుంబ పార్టీలు, అవినీతి పార్టీలు కలిసి కాంగ్రెస్​ నేతృత్వంలో ఫ్రంట్​లు పెట్టారని ఎద్దేవా చేశారు. 

Last Updated : Jan 8, 2024, 5:42 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.