ETV Bharat / lifestyle

ఎక్కువ సేపు కూర్చుంటే క్యాన్సర్‌ వస్తుందట..! - క్యాన్సర్​ వచ్చే పనుల తాజా వార్తలు

కూర్చోవద్దు... అరగంటకో గంటకోసారి లేవండి... అని ఎంతగా చెప్పినా చాలామంది సీట్లోంచి లేవరు. అయితే దాని ఫలితం ఆరోగ్యంమీద తీవ్రంగానే ఉంటుంది అని హెచ్చరిస్తున్నారు యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌ ఎం.డి. ఆండర్సన్‌ క్యాన్సర్‌ సెంటర్‌కు చెందిన నిపుణులు.

ఎక్కువ సేపు కూర్చుంటే క్యాన్సర్‌ వస్తుందట..!
ఎక్కువ సేపు కూర్చుంటే క్యాన్సర్‌ వస్తుందట..!
author img

By

Published : Jul 7, 2020, 12:16 PM IST

చురుకుదనం ఎంత తక్కువగా ఉంటే అంత ఎక్కువగా క్యాన్సర్‌ బారిన పడాల్సి ఉంటుందట. ఎక్కువసేపు కూర్చునేవాళ్లలో 82 శాతం మంది క్యాన్సర్‌ బారిన పడుతున్నట్లు యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌ ఎం.డి. ఆండర్సన్‌ క్యాన్సర్‌ సెంటర్‌ పరిశీలనలో తేలిందట. ఇందుకోసం నలభై ఐదేళ్లు దాటిన ముప్ఫై వేలమందిని ఎంపిక చేసి ఐదేళ్లపాటు వాళ్ల ఆరోగ్యాన్ని గమనిస్తూ వచ్చారట.

అందులో కొందరికి కూర్చునే సమయంలో అరగంట తగ్గించి, ఆ సమయంలో వ్యాయామం చేయించారట. అందులోనూ సైక్లింగ్‌ అయితే క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం 31 శాతం, నడక అయితే 8 శాతం తగ్గినట్లూ గుర్తించారు. అంతేకాదు, వాళ్లలో కదలకుండా కూర్చునే మూడు వందలమంది మరో ఐదేళ్ల తరవాత క్యాన్సర్‌తో మరణించారట. అందుకే ప్రతి గంటకీ లేచి ఓ ఐదు నిమిషాలు నడవడం, మెట్లు ఎక్కడం చేస్తే మంచిదని చెప్పుకొస్తున్నారు.

చురుకుదనం ఎంత తక్కువగా ఉంటే అంత ఎక్కువగా క్యాన్సర్‌ బారిన పడాల్సి ఉంటుందట. ఎక్కువసేపు కూర్చునేవాళ్లలో 82 శాతం మంది క్యాన్సర్‌ బారిన పడుతున్నట్లు యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌ ఎం.డి. ఆండర్సన్‌ క్యాన్సర్‌ సెంటర్‌ పరిశీలనలో తేలిందట. ఇందుకోసం నలభై ఐదేళ్లు దాటిన ముప్ఫై వేలమందిని ఎంపిక చేసి ఐదేళ్లపాటు వాళ్ల ఆరోగ్యాన్ని గమనిస్తూ వచ్చారట.

అందులో కొందరికి కూర్చునే సమయంలో అరగంట తగ్గించి, ఆ సమయంలో వ్యాయామం చేయించారట. అందులోనూ సైక్లింగ్‌ అయితే క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం 31 శాతం, నడక అయితే 8 శాతం తగ్గినట్లూ గుర్తించారు. అంతేకాదు, వాళ్లలో కదలకుండా కూర్చునే మూడు వందలమంది మరో ఐదేళ్ల తరవాత క్యాన్సర్‌తో మరణించారట. అందుకే ప్రతి గంటకీ లేచి ఓ ఐదు నిమిషాలు నడవడం, మెట్లు ఎక్కడం చేస్తే మంచిదని చెప్పుకొస్తున్నారు.

ఇదీ చదవండి: 20-20-20 సీక్రెట్ గురించి మీకు తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.