ETV Bharat / jagte-raho

పేకాట కేసులో అరెస్ట్​.. అవమానం భరించలేక ఆత్మహత్య - jagtial district crime news

పేకాట కేసులో అరెస్టైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు పెట్టిన కేసును అవమానంగా భావించి పొలంలో ఉరివేసుకున్నాడు. ఇంట్లో ఉన్న డబ్బును కూడా బలవంతంగా తెప్పించి పోలీసులు ఫోటోలు తీయబట్టే తమ బిడ్డ ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

young man committed to suicide due to police arrested in cards playing case at jagtial
పేకాట కేసులో అరెస్ట్​.. అవమానం భరించలేక ఆత్మహత్య
author img

By

Published : Oct 3, 2020, 12:04 PM IST

పోలీసులు పెట్టిన కేసుకు భయపడి ఓ యువకుడి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జగిత్యాల జిల్లా మల్యాల మండలం తక్కళ్లపల్లిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సాయికిరణ్​ అనే యువకుడిని పేకాట కేసులో పోలీసులు అదుపులోకి తీసుకుని వదిలిపెట్టారు. అవమానం భరించలేకపోయిన ఆ యువకుడు.. కొద్దిసేపటికే అతని పొలం వద్దకు వెళ్లి ఉరి వేసుకున్నాడు. మృతదేహాన్ని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

పేకాట ఆడుతుండగా పట్టుకున్న పోలీసులు.. ఇంట్లో ఉన్న డబ్బును కూడా బలవంతంగా తెప్పించి ఫొటోలు తీశారని.. పోలీసులు అమానపరచటంతోనే తన కొడుకు చనిపోయాడని మృతుడి తల్లి ఆరోపిస్తున్నారు.

పోలీసులు పెట్టిన కేసుకు భయపడి ఓ యువకుడి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జగిత్యాల జిల్లా మల్యాల మండలం తక్కళ్లపల్లిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సాయికిరణ్​ అనే యువకుడిని పేకాట కేసులో పోలీసులు అదుపులోకి తీసుకుని వదిలిపెట్టారు. అవమానం భరించలేకపోయిన ఆ యువకుడు.. కొద్దిసేపటికే అతని పొలం వద్దకు వెళ్లి ఉరి వేసుకున్నాడు. మృతదేహాన్ని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

పేకాట ఆడుతుండగా పట్టుకున్న పోలీసులు.. ఇంట్లో ఉన్న డబ్బును కూడా బలవంతంగా తెప్పించి ఫొటోలు తీశారని.. పోలీసులు అమానపరచటంతోనే తన కొడుకు చనిపోయాడని మృతుడి తల్లి ఆరోపిస్తున్నారు.

ఇవీ చూడండి: వసతుల లేమే శాపం.. మిగిల్చింది గర్భశోకం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.