ETV Bharat / jagte-raho

'ఇల్లు కేటాయించడం లేదని ఆత్మహత్యాయత్నం'

author img

By

Published : Jan 4, 2021, 4:55 PM IST

అధికారులు తనకు డబుల్ బెడ్ రూం ఇల్లు కేటాయించడం లేదని ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. కలెక్టరేట్​ ప్రాంగణంలో పెట్రోల్​ పోసుకుని బలవన్మరణానికి యత్నించింది. ఈ ఘటన మేడ్చల్​ జిల్లాలో చోటుచేసుకుంది.

women suicide attempt at medchal collectorate
'డబుల్​ బెడ్​ రూం కేటాయించడం లేదని ఆత్మహత్యాయత్నం'

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా నేరేడ్​మెట్ భగత్​సింగ్​నగర్​లో నివాసముంటున్న సుజాత అనే మహిళ కలెక్టరేట్​ ప్రాంగణంలో ఆత్మహత్యాయత్నం చేసింది. తనకు డబుల్ బెడ్ రూం ఇల్లు కేటాయించడం లేదని.. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదనే ఆవేదనతో పెట్రోల్​ పోసుకుని బలవన్మరణానికి యత్నించింది.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. తనకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని.. డబుల్​ బెడ్​ రూం ఇల్లు కేటాయించాలని ఎన్నిసార్లు అధికారుల చుట్టు తిరిగినా పట్టించుకోకపోవడం వల్ల ఆత్మహత్యాయత్నం చేసినట్లు సుజాత తెలిపింది. ఈ మేరకు పోలీసులు బాధితురాలికి కౌన్సెలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు.

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా నేరేడ్​మెట్ భగత్​సింగ్​నగర్​లో నివాసముంటున్న సుజాత అనే మహిళ కలెక్టరేట్​ ప్రాంగణంలో ఆత్మహత్యాయత్నం చేసింది. తనకు డబుల్ బెడ్ రూం ఇల్లు కేటాయించడం లేదని.. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదనే ఆవేదనతో పెట్రోల్​ పోసుకుని బలవన్మరణానికి యత్నించింది.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. తనకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని.. డబుల్​ బెడ్​ రూం ఇల్లు కేటాయించాలని ఎన్నిసార్లు అధికారుల చుట్టు తిరిగినా పట్టించుకోకపోవడం వల్ల ఆత్మహత్యాయత్నం చేసినట్లు సుజాత తెలిపింది. ఈ మేరకు పోలీసులు బాధితురాలికి కౌన్సెలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు.

ఇదీ చూడండి: మహిళా రైతుపై సర్పంచ్ దాడి... రక్షణ కల్పించాలని వేడుకోలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.