ETV Bharat / jagte-raho

కరోనా అనుమానం: ఫ్యానుకు ఉరివేసుకుని మహిళ ఆత్మహత్య

author img

By

Published : Aug 11, 2020, 5:43 PM IST

తగు జాగ్రత్తలు తీసుకుంటే.. కరోనా ప్రమాదకరమైనదేమీ కాదని ప్రభుత్వాలు ఎంత అవగాహన కల్పిస్తున్నా.. కొందరిలో మాత్రం మార్పు రావడం లేదు. వైరస్‌ సోకితే చావడమే దిక్కన్నట్లు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తమ కుటుంబాల్లో విషాదం నింపుతున్నారు. ఇలాంటిదే ఓ ఘటన జీడిమెట్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.

Woman commits suicide by hanging herself to a fan
కరోనా అనుమానం: ఫ్యానుకు ఉరివేసుకుని మహిళ ఆత్మహత్య

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా షాపూర్‌నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. కరోనా భయంతో ఎలుగుపల్లి సుజాత అనే మహిళ ఆత్మహత్యకు పాల్పడింది.

సుజాత గత 4 రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులు సుజాతకు స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో రక్త పరీక్షలు చేయించారు. మలేరియా వ్యాధి అని తేలింది.

అయినప్పటికీ సుజాత తనకు కరోనా సోకి ఉంటుందని భయంతో సోమవారం రాత్రి.. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. విషయం తెలుసుకున్న జీడిమెట్ల పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 1,896 కరోనా కేసులు నమోదు

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా షాపూర్‌నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. కరోనా భయంతో ఎలుగుపల్లి సుజాత అనే మహిళ ఆత్మహత్యకు పాల్పడింది.

సుజాత గత 4 రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులు సుజాతకు స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో రక్త పరీక్షలు చేయించారు. మలేరియా వ్యాధి అని తేలింది.

అయినప్పటికీ సుజాత తనకు కరోనా సోకి ఉంటుందని భయంతో సోమవారం రాత్రి.. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. విషయం తెలుసుకున్న జీడిమెట్ల పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 1,896 కరోనా కేసులు నమోదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.