కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం రాంపూర్లో పొలం గట్టు వివాదంలో... శనివారం నాడు దేవెల పోచయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ మృతుని బంధువులు డీఎస్పీ కార్యాలయం ఎదుట ప్రధాన రహదారిపై బైఠాయించారు. సుమారు గంటపాటు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సీఐ రాజశేఖర్ అక్కడికి చేరుకొని... న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి, ఆందోళన విరమింపజేశారు. దాడికి పాల్పడిన 11 మందిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించినట్టు ఎస్సై శ్వేత తెలిపారు.
ఇదీ చూడండి: మహంకాళి అమ్మవారికి ఆ ఇంటి నుంచి తొలి బోనం