ETV Bharat / jagte-raho

గుంతలమయమైన రహదారులు.. జంకుతున్న వాహనదారులు

author img

By

Published : Oct 8, 2020, 10:32 PM IST

అడుగుకో గుంతతో ప్రయాణం నరకప్రాయంగా మారిందని ఖమ్మం జిల్లాలోని వైరా, సత్తుపల్లి నియోజకవర్గాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రివేళల్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సి వస్తోందని వాపోతున్నారు. అధికారులు స్పందించి ఇప్పటికైనా రహదారులపై గుంతలు పూడ్చాలని, రోడ్డు మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.

damaged roads in khammam district
గుంతలమయమైన రహదారులు

ఖమ్మం జిల్లా వైరా, సత్తుపల్లి నియోజకవర్గాల్లో ప్రధాన రహదారులు గుంతల మయంగా మారి వాహనదారులకు నరకం చూపిస్తున్నాయి. అడుగడుగునా పెద్ద గోతులు ఏర్పడి నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రాత్రి వేళలో వాహనదారులు మరింత ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

ఖమ్మం- రాజమండ్రి జాతీయ రహదారిలో వైరా, తల్లాడ, కల్లూరు మండల పరిధిలో రహదారులు చాలా వరకు దెబ్బతిన్నాయి. స్టేజి సమీపంలో వంతెనపై పెద్ద గోతులు ఏర్పడి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. నెలరోజులుగా వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. తాజాగా వంతెనపై పై రెండు లారీలు ఢీ కొనగా రాకపోకలు స్తంభించాయి. రెడ్డిగూడెం సమీపంలో గడిచిన పది రోజుల్లో మూడు లారీలు బోల్తా పడ్డాయి.

ప్రమాదాలకు అడ్డాగా మారిన రహదారులపై ప్రయాణించడానికి వాహనదారులు భయపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్లపై గుంతలు పూడ్చాలని, అవసరమున్న చోట మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు.

ఇవీ చూడండి: రోడ్లు, డ్రైనేజీలకు మరమ్మతులు చేస్తాం: మేయర్

ఖమ్మం జిల్లా వైరా, సత్తుపల్లి నియోజకవర్గాల్లో ప్రధాన రహదారులు గుంతల మయంగా మారి వాహనదారులకు నరకం చూపిస్తున్నాయి. అడుగడుగునా పెద్ద గోతులు ఏర్పడి నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రాత్రి వేళలో వాహనదారులు మరింత ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

ఖమ్మం- రాజమండ్రి జాతీయ రహదారిలో వైరా, తల్లాడ, కల్లూరు మండల పరిధిలో రహదారులు చాలా వరకు దెబ్బతిన్నాయి. స్టేజి సమీపంలో వంతెనపై పెద్ద గోతులు ఏర్పడి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. నెలరోజులుగా వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. తాజాగా వంతెనపై పై రెండు లారీలు ఢీ కొనగా రాకపోకలు స్తంభించాయి. రెడ్డిగూడెం సమీపంలో గడిచిన పది రోజుల్లో మూడు లారీలు బోల్తా పడ్డాయి.

ప్రమాదాలకు అడ్డాగా మారిన రహదారులపై ప్రయాణించడానికి వాహనదారులు భయపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్లపై గుంతలు పూడ్చాలని, అవసరమున్న చోట మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు.

ఇవీ చూడండి: రోడ్లు, డ్రైనేజీలకు మరమ్మతులు చేస్తాం: మేయర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.