ETV Bharat / jagte-raho

నీటి సంపులో కుళ్లిన స్థితిలో మృతదేహం లభ్యం - పాతబస్తీ నేర వార్తలు

హైదరాబాద్ పాతబస్తీలోని ఛత్రినాక ఠాణా పరిధిలోని నీటి సంపులో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. ఛత్రినాక రామస్వామి గంజ్ ప్రాంతంలో వ్యాపార సముదాయాల వద్దనున్న నీటి తొట్టిలో కుళ్లిన స్థితిలో ఉన్న మృతదేహన్ని స్థానికులు గుర్తించారు.

నీటి సంపులో కుళ్లిన స్థితిలో మృతదేహం లభ్యం
నీటి సంపులో కుళ్లిన స్థితిలో మృతదేహం లభ్యం
author img

By

Published : Nov 11, 2020, 3:09 PM IST

పాతబస్తీలోని ఛత్రినాక ఠాణా పరిధిలోని రామస్వామి గంజ్​ ప్రాంతంలో వ్యాపార సముదాయాల వద్దనున్న నీటి తొట్టిలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. తీవ్ర దుర్వాసన రావడంతో సంపు తెరిచి చూడగా కుళ్లిన స్థితిలో ఉన్న వ్యక్తి మృతదేహం కనిపించింది.

సమాచారం అందుకున్న ఛత్రినాక పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీసి... శవ పరీక్ష నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. మృతుడు ఎవరనేది తెలియాల్సి ఉంది. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

పాతబస్తీలోని ఛత్రినాక ఠాణా పరిధిలోని రామస్వామి గంజ్​ ప్రాంతంలో వ్యాపార సముదాయాల వద్దనున్న నీటి తొట్టిలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. తీవ్ర దుర్వాసన రావడంతో సంపు తెరిచి చూడగా కుళ్లిన స్థితిలో ఉన్న వ్యక్తి మృతదేహం కనిపించింది.

సమాచారం అందుకున్న ఛత్రినాక పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీసి... శవ పరీక్ష నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. మృతుడు ఎవరనేది తెలియాల్సి ఉంది. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: క్రికెట్ బెట్టింగ్​లో నష్టం.. ఇద్దరి ఆత్మహత్యాయత్నం.. ఒకరు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.