ETV Bharat / jagte-raho

మిస్సింగ్​ మిస్టరీ: అమ్మా... నాన్న... తప్పిపోయిన కొడుకు

author img

By

Published : Sep 29, 2020, 1:10 PM IST

బతుకుదెరువు కోసం వేరే రాష్ట్రం నుంచి హైదరాబాద్​కు ఏడాది పిల్లాడితో వచ్చారు. కూలీ పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. అనుకోకుండా ఓ రోజు తమ పిల్లాడు అదృశ్యమయ్యాడు. ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదు. అంతలోనే కరోనా మహమ్మారి చుట్టుముట్టేసింది. దంపతులిద్దరూ దూరమయ్యారు. మళ్లీ ఆ కుమారుడు ఎలా దొరికాడు. భార్యభర్తలు కలిశారా... తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

two years boy missing story in hyderabad
two years boy missing story in hyderabad

పశ్చిమ బంగా​కు చెందిన కిషన్​దాస్, జర్నాదాస్ దంపతులు... ఏడాది క్రితం బతుకుదెరువు కోసం హైదరాబాద్​కు వచ్చారు. కూలీ పనిచేసుకుంటూ... హైటెక్​సిటీ ఇనార్బిట్ మాల్ సమీపంలో రహదారి పక్కన గుడిసెలో నివసించేవారు. ఓ రోజు కూలీ పనికి వెళ్లి వచ్చేసరికి తమ రెండేళ్ల రాజ్ కుమార్ దాస్ కనిపించలేదు. చుట్టుపక్కలంతా వెతికినా ఆచూకీ దొరకలేదు. చాలారోజులు వెతికినా ఫలితం లేకపోగా... కరోనా భయంతో సొంత రాష్ట్రానికి వెళ్లిపోయారు. భార్య అజాగ్రత్త వల్లే కుమారుడు తప్పిపోయాడని భర్త కిషన్ దాస్ కోపం పెంచుకున్నాడు. కాపురానికి రావద్దని చెప్పి భార్యని తన తల్లి వద్దే వదిలిపెట్టాడు.

కట్​ చేస్తే... బాలుడు తప్పిపోయిన రోజున...

హైటెక్ సిటీ సమీపంలో రహదారి పక్కన ఉన్న పిల్లాడిని అక్కడే పాత బట్టల వ్యాపారం చేసే అరుణ్ చూశాడు. వెంటనే బాలున్ని తీసుకుని సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం ఇంద్రేశం గ్రామానికి వెళ్లాడు. సాయి కాలనీలో నివసించే తన మేనమామ యాకూబ్​కు బాలున్ని అప్పగించాడు. అయితే ఆ పిల్లాన్ని తరచూ కొడుతుండటం వల్ల స్థానికులకు అనుమానమొచ్చి 100 నంబర్​కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. స్పందించిన పోలీసులు సీడబ్ల్యూసీ అధికారులతో కలిసి విచారించగా... అసలు విషయం బయటపడింది. బాలున్ని సంగారెడ్డి శిశువిహార్​కి తరలించారు. అక్రమంగా బాలున్ని అపహరించినందుకు అరుణ్​తో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు.

డీఎన్​ఏ పరీక్షలతో నిర్ధరణ...

సీడబ్ల్యూసీ అధికారుల ఫిర్యాదుతో పటాన్​చెరు పోలీసులు కేసు నమోదు చేసి హైటెక్ సిటీ ప్రాంతంలో విచారించారు సదరు కాంట్రాక్టర్​ను వెతికి.. అక్కడ గుడిసెల్లో ఉండే వారి వివరాలు తెలుసుకున్నారు. కిషన్ దాస్, జర్నా దాస్ దంపతుల కుమారుడే అని నిర్ధరించుకుని సమాచారం ఇచ్చారు. తల్లి జర్నాదాస్ వచ్చిన వెంటనే పోలీసులు... సీడబ్ల్యూసీ అధికారుల వద్దకు తీసుకెళ్లారు. సీడబ్ల్యూసీ అధికారుల సూచన మేరకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహింపజేశారు.

సంగారెడ్డి శివ విహార్​లో ఉన్న బాలుడు డీఎన్ఏ పరీక్షలో కిషన్​దాస్, జర్నాదాస్​ల కుమారుడు అని తేలింది. సీడబ్ల్యూసీ అధికారుల సమక్షంలో పిల్లాడిని పోలీసులు తల్లికి అప్పగించారు. బాలుడు దొరకటం వల్ల మళ్లీ ఆ తల్లిదండ్రులు కలవనున్నారు. ఇక్కడితో కథ సుఖాంతం కానుంది.

ఇదీ చూడండి: 'హేమంత్ హత్యోదంతం: 21కి పెరిగిన నిందితుల సంఖ్య'

పశ్చిమ బంగా​కు చెందిన కిషన్​దాస్, జర్నాదాస్ దంపతులు... ఏడాది క్రితం బతుకుదెరువు కోసం హైదరాబాద్​కు వచ్చారు. కూలీ పనిచేసుకుంటూ... హైటెక్​సిటీ ఇనార్బిట్ మాల్ సమీపంలో రహదారి పక్కన గుడిసెలో నివసించేవారు. ఓ రోజు కూలీ పనికి వెళ్లి వచ్చేసరికి తమ రెండేళ్ల రాజ్ కుమార్ దాస్ కనిపించలేదు. చుట్టుపక్కలంతా వెతికినా ఆచూకీ దొరకలేదు. చాలారోజులు వెతికినా ఫలితం లేకపోగా... కరోనా భయంతో సొంత రాష్ట్రానికి వెళ్లిపోయారు. భార్య అజాగ్రత్త వల్లే కుమారుడు తప్పిపోయాడని భర్త కిషన్ దాస్ కోపం పెంచుకున్నాడు. కాపురానికి రావద్దని చెప్పి భార్యని తన తల్లి వద్దే వదిలిపెట్టాడు.

కట్​ చేస్తే... బాలుడు తప్పిపోయిన రోజున...

హైటెక్ సిటీ సమీపంలో రహదారి పక్కన ఉన్న పిల్లాడిని అక్కడే పాత బట్టల వ్యాపారం చేసే అరుణ్ చూశాడు. వెంటనే బాలున్ని తీసుకుని సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం ఇంద్రేశం గ్రామానికి వెళ్లాడు. సాయి కాలనీలో నివసించే తన మేనమామ యాకూబ్​కు బాలున్ని అప్పగించాడు. అయితే ఆ పిల్లాన్ని తరచూ కొడుతుండటం వల్ల స్థానికులకు అనుమానమొచ్చి 100 నంబర్​కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. స్పందించిన పోలీసులు సీడబ్ల్యూసీ అధికారులతో కలిసి విచారించగా... అసలు విషయం బయటపడింది. బాలున్ని సంగారెడ్డి శిశువిహార్​కి తరలించారు. అక్రమంగా బాలున్ని అపహరించినందుకు అరుణ్​తో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు.

డీఎన్​ఏ పరీక్షలతో నిర్ధరణ...

సీడబ్ల్యూసీ అధికారుల ఫిర్యాదుతో పటాన్​చెరు పోలీసులు కేసు నమోదు చేసి హైటెక్ సిటీ ప్రాంతంలో విచారించారు సదరు కాంట్రాక్టర్​ను వెతికి.. అక్కడ గుడిసెల్లో ఉండే వారి వివరాలు తెలుసుకున్నారు. కిషన్ దాస్, జర్నా దాస్ దంపతుల కుమారుడే అని నిర్ధరించుకుని సమాచారం ఇచ్చారు. తల్లి జర్నాదాస్ వచ్చిన వెంటనే పోలీసులు... సీడబ్ల్యూసీ అధికారుల వద్దకు తీసుకెళ్లారు. సీడబ్ల్యూసీ అధికారుల సూచన మేరకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహింపజేశారు.

సంగారెడ్డి శివ విహార్​లో ఉన్న బాలుడు డీఎన్ఏ పరీక్షలో కిషన్​దాస్, జర్నాదాస్​ల కుమారుడు అని తేలింది. సీడబ్ల్యూసీ అధికారుల సమక్షంలో పిల్లాడిని పోలీసులు తల్లికి అప్పగించారు. బాలుడు దొరకటం వల్ల మళ్లీ ఆ తల్లిదండ్రులు కలవనున్నారు. ఇక్కడితో కథ సుఖాంతం కానుంది.

ఇదీ చూడండి: 'హేమంత్ హత్యోదంతం: 21కి పెరిగిన నిందితుల సంఖ్య'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.